Maharashtra: మహిళలకు భర్తలు రూ.100 కూడా ఇవ్వరు.. ఎన్నికల ప్రసంగంలో ఓ మంత్రి కీలక వ్యాఖ్యలు
- మంగళవారం మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు
- భర్తలు రూ.100 కూడా ఇవ్వరు
- అలాంటిది ఫడ్నవిస్ మహిళలకు రూ.1,500 స్టైఫండ్ ఇస్తున్నారు
- మహిళలు ఫడ్నవిస్ రుణం తీర్చుకోవాలన్న మంత్రి జయకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలను ఉద్దేశించి మహారాష్ట్ర మంత్రి జయకుమార్ గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో భర్తలు అవసరాలకు రూ.100 కూడా ఇవ్వరని.. అలాంటిది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివిస్.. లడ్కీ బహిన్ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500 స్టైఫండ్ ఇస్తున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి మహిళ ఫడ్నవిస్కు కృతజ్ఞతగా బీజేపీకి ఓటువేసి విధేయత చూపించాలని కోరారు. ఓటు వేసేటప్పుడు ఫడ్నవీస్ ప్రభుత్వం చేసిన సహాయాన్ని గుర్తుంచుకోవాలని మహిళా ఓటర్లను కోరారు.
ఇది కూడా చదవండి: Pinarayi Vijayan: కేరళ సీఎంకు ఈడీ నోటీసులు.. దేనికోసమంటే..!
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
డిసెంబర్ 2న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం షోలాపూర్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జయకుమార్ గోర్ మాట్లాడుతూ… స్థానిక ఎన్నికల సమయంలో ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి.. కానీ ప్రతి నెల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే రూ. 1,500 స్టైఫండ్ను గుర్తుంచుకోవాలని సూచించారు. ఫడ్నవిస్ అధికారంలో లేకపోతే మీ అకౌంట్లు డబ్బులు పడేవా? అని అడిగారు. అందుకే ఫడ్నవిస్ పట్ల విధేయత చూపించాలని విజ్ఞప్తి చేశారు. రక్షా బంధన్ సమయంలో కూడా సోదరులు తమ సోదరీమణులకు డబ్బు బహుమతిగా ఇచ్చేటప్పుడు వారి భార్యల అనుమతి తీసుకుంటారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మహాయుతి మిత్రులపై కూడా మంత్రి విమర్శలు చేశారు. పాలక వర్గంలోని కొన్ని పార్టీలు ఖజానా తమ దగ్గర ఉందని చెప్పుకుంటున్నప్పటికీ తుది ఆమోదం బీజేపీదేనని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: సీపీ.రాధాకృష్ణన్ ప్రజా సేవకే జీవితం అంకితం చేశారు.. చైర్మన్ను అభినందించిన మోడీ
246 మునిసిపల్ కౌన్సిల్లు, 42 నగర పంచాయతీలకు డిసెంబర్ 2న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 1.07 కోట్లకు పైగా ఓటర్లు 6859 మంది సభ్యులను, 288 మునిసిపల్ అధ్యక్షులను ఎన్నుకుంటారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!