కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం: పార్లమెంటరీ గ్రూపులు ఏర్పాటు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపటి నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈరోజు సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి ముందే అధినేత్రి సోనియా గాంధీ పార్లమెంటరీ గ్రూపులను ఏర్పాటు చేశారు. మాజీ కేంద్రమంత్రులు పి చిదంబరం, మనీశ్ తివారీ, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్ వంటి వారికి స్థానం కల్పించారు. లోక్సభ, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సమర్ధవంతంగా పనిచేసేందుకు ఈ గ్రూపులను ఏర్పాటు చేసినట్టు సోనియా గాంధీ పేర్కొన్నారు.
Read: ఉపాసన సోదరి నిశ్చితార్థం!
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో ఈ గ్రూపులు ప్రతిరోజూ సమావేశమవుతాయని, పార్లమెంట్లో ప్రస్తావించే సమస్యలకు సంబందించి అవసరమైనపుడు ఇంటర్ సెషన్ పీరియడ్స్లో కూడా సమావేశం కావోచ్చని సోనియాగాంధీ పేర్కొన్నారు. లోక్సభ కాంగ్రెస్ పక్షనేతను మారుస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్టీ క్లారిటీ ఇచ్చింది. కాంగ్రెస్ పక్షనేతగా బెంగాల్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరినే కొనసాగుతారని స్పష్టం చేశారు. శశిథరూర్, గౌరవ్ గొగోయ్, కే సురేష్, రవనీత్ సింగ్ బిట్టు, మాణిక్యం ఠాగూర్లకు ఈ గ్రూపులో స్థానం కల్పించారు. ఇక, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నేతగా మల్లిఖార్జున ఖర్గే కొనసాగుతారని పార్టీ స్పష్టం చేసింది. ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటరీ గ్రూపులు సమావేశాలు నిర్వహిస్తాయి. అవసరమైనపుడు ఈ గ్రూపులు ఉమ్మడి సమావేశాలు కూడా నిర్వహించేందుకు అవకాశం ఉన్నది. ఉమ్మడి సమావేశం నిర్వహించినపుడు మల్లిఖార్జున ఖర్గే కన్వీనర్గా వ్యవహరిస్తారు.
తాజావార్తలు
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!