Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం…. ‘ఒక కుటుంబం- ఒక టికెట్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి గత వైభవాన్ని తీసుకురావాలని ఆ పార్టీ యోచిస్తోంది. పార్టీలో సంస్కరణలకు వేదికగా ‘ శింతన్ శిబిర్’ నిలువనుంది. రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా నేటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధిష్టానంతో పలుమార్లు చర్చించారు. పార్టీలో తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ బలోపేతానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు సూచించారు. ఇదిలా ఉంటే శింతన్ శిబిర్ తొలి రోజు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దేశంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలను తీవ్రంగా విమర్శించారు.
కుటుంబ పార్టీగా ముద్ర పడిన కాంగ్రెస్ పార్టీ అందుల్లోంచి బయటకు రావాలని చూస్తోంది. దీంట్లో భాగంగానే ఆ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ‘ ఒక కుటుంబానికి… ఒకే టికెట్’ ఇవ్వాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. మనకు పార్టీ చాలా ఇచ్చింది… పార్టీకి మనం ఇవ్వాల్సిన సమయం వచ్చిందంటూ సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే సంస్థాగతంగా పార్టీలో పనిచేయాలని… కనీసం పార్టీలో 5 ఏళ్లు పార్టీలో పనిచేసిన వారికి మాత్రమే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపింది. స్వార్థాన్ని వీడాలని నేతలకు అధిష్టానం సూచించింది. పార్టీ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామనే సందేశాన్ని పార్టీ నాయకులకు తెలిపారు సోనియాగాంధీ. ఇదే విధంగా పార్టీలో ఒక పదవిలో ఒక వ్యక్తి కేవలం 5 ఏళ్లు మాత్రమే ఉండాలని.. మళ్లీ ఆ పదవి చేపట్టాలంటే కనీసం మూడేళ్ల కాలపరిమితి ఉండాలనే నిబంధనను కూడా తీసుకురానున్నారు. పార్టీలోని నాయకులు, పార్టీలో పనిచేయని తమ బంధువులకు టికెట్ ఇవ్వకుండా చర్యలు తీసుకోనున్నారు.
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
- DK Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన డీకే శివకుమార్
- JEE Advanced Result 2026: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రిలీజ్.. టాపర్ ఎవరంటే?
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
రాజకీయ, ఆర్థిక, సామాజిక, రైతులు, యువత, సంస్థాగత అంశాల్లో మార్పులు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేశారు. ఈ కమిటీలు రూపొందించిన తీర్మానాలపై ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆమోదించనుంది.
తాజావార్తలు
-
US airstrikes on Iran: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ఇరాన్ రాడార్, డ్రోన్ స్థావరాలపై అమెరికా దాడులు..
-
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
-
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
-
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!