Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం…. ‘ఒక కుటుంబం- ఒక టికెట్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి గత వైభవాన్ని తీసుకురావాలని ఆ పార్టీ యోచిస్తోంది. పార్టీలో సంస్కరణలకు వేదికగా ‘ శింతన్ శిబిర్’ నిలువనుంది. రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా నేటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధిష్టానంతో పలుమార్లు చర్చించారు. పార్టీలో తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ బలోపేతానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు సూచించారు. ఇదిలా ఉంటే శింతన్ శిబిర్ తొలి రోజు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దేశంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలను తీవ్రంగా విమర్శించారు.
కుటుంబ పార్టీగా ముద్ర పడిన కాంగ్రెస్ పార్టీ అందుల్లోంచి బయటకు రావాలని చూస్తోంది. దీంట్లో భాగంగానే ఆ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ‘ ఒక కుటుంబానికి… ఒకే టికెట్’ ఇవ్వాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. మనకు పార్టీ చాలా ఇచ్చింది… పార్టీకి మనం ఇవ్వాల్సిన సమయం వచ్చిందంటూ సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే సంస్థాగతంగా పార్టీలో పనిచేయాలని… కనీసం పార్టీలో 5 ఏళ్లు పార్టీలో పనిచేసిన వారికి మాత్రమే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపింది. స్వార్థాన్ని వీడాలని నేతలకు అధిష్టానం సూచించింది. పార్టీ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామనే సందేశాన్ని పార్టీ నాయకులకు తెలిపారు సోనియాగాంధీ. ఇదే విధంగా పార్టీలో ఒక పదవిలో ఒక వ్యక్తి కేవలం 5 ఏళ్లు మాత్రమే ఉండాలని.. మళ్లీ ఆ పదవి చేపట్టాలంటే కనీసం మూడేళ్ల కాలపరిమితి ఉండాలనే నిబంధనను కూడా తీసుకురానున్నారు. పార్టీలోని నాయకులు, పార్టీలో పనిచేయని తమ బంధువులకు టికెట్ ఇవ్వకుండా చర్యలు తీసుకోనున్నారు.
Also Read
- West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
- Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
- UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
రాజకీయ, ఆర్థిక, సామాజిక, రైతులు, యువత, సంస్థాగత అంశాల్లో మార్పులు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేశారు. ఈ కమిటీలు రూపొందించిన తీర్మానాలపై ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆమోదించనుంది.
తాజావార్తలు
-
West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
-
Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
-
India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!