Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం…. ‘ఒక కుటుంబం- ఒక టికెట్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి గత వైభవాన్ని తీసుకురావాలని ఆ పార్టీ యోచిస్తోంది. పార్టీలో సంస్కరణలకు వేదికగా ‘ శింతన్ శిబిర్’ నిలువనుంది. రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా నేటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధిష్టానంతో పలుమార్లు చర్చించారు. పార్టీలో తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ బలోపేతానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు సూచించారు. ఇదిలా ఉంటే శింతన్ శిబిర్ తొలి రోజు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దేశంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలను తీవ్రంగా విమర్శించారు.
కుటుంబ పార్టీగా ముద్ర పడిన కాంగ్రెస్ పార్టీ అందుల్లోంచి బయటకు రావాలని చూస్తోంది. దీంట్లో భాగంగానే ఆ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ‘ ఒక కుటుంబానికి… ఒకే టికెట్’ ఇవ్వాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. మనకు పార్టీ చాలా ఇచ్చింది… పార్టీకి మనం ఇవ్వాల్సిన సమయం వచ్చిందంటూ సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే సంస్థాగతంగా పార్టీలో పనిచేయాలని… కనీసం పార్టీలో 5 ఏళ్లు పార్టీలో పనిచేసిన వారికి మాత్రమే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపింది. స్వార్థాన్ని వీడాలని నేతలకు అధిష్టానం సూచించింది. పార్టీ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామనే సందేశాన్ని పార్టీ నాయకులకు తెలిపారు సోనియాగాంధీ. ఇదే విధంగా పార్టీలో ఒక పదవిలో ఒక వ్యక్తి కేవలం 5 ఏళ్లు మాత్రమే ఉండాలని.. మళ్లీ ఆ పదవి చేపట్టాలంటే కనీసం మూడేళ్ల కాలపరిమితి ఉండాలనే నిబంధనను కూడా తీసుకురానున్నారు. పార్టీలోని నాయకులు, పార్టీలో పనిచేయని తమ బంధువులకు టికెట్ ఇవ్వకుండా చర్యలు తీసుకోనున్నారు.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
రాజకీయ, ఆర్థిక, సామాజిక, రైతులు, యువత, సంస్థాగత అంశాల్లో మార్పులు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేశారు. ఈ కమిటీలు రూపొందించిన తీర్మానాలపై ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆమోదించనుంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?