Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Congress Mla Nirmala Sapre Demands Rs 300 Crore Sparks Political Row

Congress MLA Rs 300 Crore Demand: రూ.300 కోట్లు ఇస్తేనే పార్టీలో ఉంటా.. మహిళా ఎమ్మెల్యే డిమాండ్‌తో కాంగ్రెస్‌లో కలకలం..

Published Date :May 8, 2026 , 8:21 pm
By Sudhakar Ravula
Congress MLA Rs 300 Crore Demand: రూ.300 కోట్లు ఇస్తేనే పార్టీలో ఉంటా.. మహిళా ఎమ్మెల్యే డిమాండ్‌తో కాంగ్రెస్‌లో కలకలం..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Congress MLA Rs 300 Crore Demand: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మలా సప్రే చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న ఆమె, ఇప్పుడు తన సొంత పార్టీ ఎదుటే భారీ షరతులు పెట్టడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. బీనా అభివృద్ధి కోసం రూ.300 కోట్లు కేటాయించి, బీనాను జిల్లాగా ప్రకటిస్తేనే కాంగ్రెస్‌లో కొనసాగుతానని ఆమె స్పష్టం చేయడం కలకలం రేపుతోంది.

ఉమాంగ్ సింఘర్‌కు నేరుగా సవాల్
నిర్మలా సప్రే ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు ఉమాంగ్ సింఘర్‌కు బహిరంగంగా సవాల్ విసిరారు. “బీనా అభివృద్ధి కోసం రూ.300 కోట్లు ఇవ్వాలి. అదేవిధంగా బీనాను జిల్లాగా ఏర్పాటు చేయాలి. ఈ రెండు డిమాండ్లు నెరవేరితేనే నేను కాంగ్రెస్‌తో కొనసాగుతాను” అని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దీనిని “బహిరంగ రాజకీయ బేరసారాలు”గా అభివర్ణించింది.

Also Read

  • Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌కు లైన్‌క్లియర్.. రేపే ప్రమాణస్వీకారం
  • Hantavirus: వెలుగులోకి హంటావైరస్ కేసులు.. భారత్‌లో వైద్య నిపుణుల కీలక సూచనలు..
  • Tamil Nadu: అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని డీఎంకే చెప్పింది.. లెఫ్ట్ పార్టీల సంచలన వ్యాఖ్యలు..
  • TVK Vijay: మ్యాజిక్ ఫిగరైతే చేరింది.. షరతులు చూస్తే మాత్రం వామ్మో అనాల్సిందే!
Add as a preferred
source on google

కాంగ్రెస్ ఎమ్మెల్యే.. కానీ బీజేపీకి దగ్గరగా?
నిర్మలా సప్రే కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ, ఎన్నికల అనంతరం నుంచి ఆమె బీజేపీ కార్యక్రమాల్లో తరచూ కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌తో పాటు పలువురు బీజేపీ నేతలతో వేదికలు పంచుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో ఆమె త్వరలో బీజేపీలో చేరతారనే ఊహాగానాలు కూడా బలపడ్డాయి. అయితే ఇప్పటి వరకు ఆమె అధికారికంగా పార్టీ మార్పుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

హైకోర్టులో ఫిరాయింపు కేసు
మరోవైపు, నిర్మలా సప్రేపై కాంగ్రెస్ ఇప్పటికే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు కోరుతూ జబల్‌పూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాంగ్రెస్ ఆరోపణల ప్రకారం, పార్టీ టికెట్‌పై గెలిచిన తర్వాత నిర్మలా సప్రే పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

కాంగ్రెస్ ఫైర్.. బీజేపీ సైలెంట్..
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పీసీ శర్మ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆయన స్పందిస్తూ, “నిర్మలా సప్రే వ్యాఖ్యలు రాజకీయ ఒత్తిడి, బేరసారాల్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రభావితం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది” అని ఆరోపించారు. అయితే, ఈ వివాదంపై ఇప్పటివరకు బీజేపీ అధికారికంగా స్పందించలేదు. అయితే నిర్మలా సప్రే వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఇక, బీనాను జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్ చాలా కాలంగా కొనసాగుతోంది. స్థానికంగా ఇది కీలక రాజకీయ అంశంగా మారింది. ప్రజల అభివృద్ధి, ప్రాంతీయ అవసరాల కోసం తాను ఈ డిమాండ్లు చేస్తున్నానని నిర్మలా సప్రే పేర్కొన్నారు. అయితే ఆమె వ్యాఖ్యలు నిజంగా ప్రజా ప్రయోజనాల కోసమా? లేక రాజకీయ ఒత్తిడి భాగమా? అన్న చర్చ ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bina district demand
  • BJP Congress controversy
  • congress mla
  • Congress MLA row
  • Indian politics news

తాజావార్తలు

  • Congress MLA Rs 300 Crore Demand: రూ.300 కోట్లు ఇస్తేనే పార్టీలో ఉంటా.. మహిళా ఎమ్మెల్యే డిమాండ్‌తో కాంగ్రెస్‌లో కలకలం..

  • Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌కు లైన్‌క్లియర్.. రేపే ప్రమాణస్వీకారం

  • DC vs KKR: టాస్ గెలిచిన కేకేఆర్.. ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్!

  • Hantavirus: వెలుగులోకి హంటావైరస్ కేసులు.. భారత్‌లో వైద్య నిపుణుల కీలక సూచనలు..

  • Tamil Nadu: అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని డీఎంకే చెప్పింది.. లెఫ్ట్ పార్టీల సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions