Shashi Tharoor: భారత్ కూడా ప్రతీకారం తీర్చుకోవాలి.. ట్రంప్ టారిఫ్పై శశిథరూర్ సూచన
- భారత్ కూడా ప్రతీకారం తీర్చుకోవాలి
- ట్రంప్ టారిఫ్పై శశిథరూర్ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్పై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. ఆగస్టు 27 నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి రానుంది. కొత్త టారిఫ్ కారణంగా పలు రంగాలు ఘోరంగా దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిగా వస్త్రాలు, ఆటో రంగం, సముద్ర ఫుడ్పై తీవ్ర ప్రభావం పడనుంది.
ఇది కూడా చదవండి: Sangeetha : మొత్తానికి విడాకుల ప్రచారంపై స్పందించిన.. హీరోయిన్
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
తాజాగా ట్రంప్ టారిఫ్పై కాంగ్రెస్ ఎంపీ శిశథరూర్ స్పందించారు. ట్రంప్ విధించిన సుంకాలకు భారత్ కూడా ప్రతీకారం తీర్చుకోవాలని సూచించారు. అమెరికాతో చర్చలు ఫలించకపోతే అమెరికా దిగుమతులపై కూడా 50 శాతం సుంకాలు విధించాలని.. అప్పుడే ట్రంప్ దిగొస్తారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Kollywood : మలేషియాలో స్టార్ హీరో సినిమా ఆడియో లాంచ్.. ఎప్పుడంటే
అయినా మనపై ట్రంప్ ఎందుకు అంత కోపంగా ఉన్నారో తెలియడం లేదన్నారు. చైనాకు 90 రోజులు గడువు ఇచ్చారని.. మనకు మాత్రం 21 రోజులు మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. మనం కూడా 50 శాతం సుంకం విధిస్తేనే దారిలోకి వస్తారని పేర్కొన్నారు. భారతదేశం ప్రస్తుతం అమెరికా దిగుమతులపై 17 శాతం సుంకాలను విధిస్తోందని.. దానిని 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. మీరు చేస్తే.. మేము చేస్తామన్న ధోరణిలో బెదిరించాలన్నారు. రష్యా దగ్గర చమురు తక్కువగా దొరుకుతుంది కాబట్టే భారత్ కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఏ దేశమైనా అదే పని చేస్తుందన్నారు. ఏ ప్రభుత్వమైనా అన్నదాతలకు నష్టం కలిగించే చర్యలకు పూనుకోకూడదని శశిథరూర్ సూచించారు.
భారత్పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే దీన్ని అన్యాయంగా విదేశాంగ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే అమెరికా బృందం ఈనెలలో భారత్లో పర్యటించనుంది. అప్పుడైనా అమెరికాలో మార్పు వస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!