Raghav Chadha: వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్లో ఆప్ ఎంపీ దంపతుల ప్రత్యక్షం.. కాంగ్రెస్ విమర్శలు
- వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్లో ఆప్ ఎంపీ దంపతుల ప్రత్యక్షం
- ఎక్స్లో ప్రశ్నించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాగిణి
- హైకమాండ్ ఆగ్రహంతో వెంటనే పోస్టు తొలగింపు
- మిత్రపక్షాల మధ్య స్నేహం చెడిందన్న బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా కూటమిలో మిత్రపక్షాల మధ్య విభేదాలు తలెత్తినట్లుగా కనిపిస్తోంది. ఇందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాగిణి నాయక్ ఎక్స్ ట్విట్టర్లో ఆప్ ఎంపీకి సంబంధించిన ఫొటోను పోస్టు చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.

Also Read
- Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
- KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, ఆయ భార్య, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా లండన్లో జరిగిన వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్కు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పరిణీతి చోప్రా తన ఇన్స్ట్రాగామ్లో పోస్టు చేసింది. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాగిణి నాయక్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. రూ.8-10 లక్షల ఖరీదైన టికెట్లను కొనుగోలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ దంపతులు వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నారని రాఘవ్ చద్దా, చోప్రా ఫొటో పోస్టుకు క్యాప్షన్ పెట్టింది. ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అయింది. రాగిణి నాయక్.. చోప్రా ఇన్స్ట్రాగామ్ నుంచే ఫొటో డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే రాగిణి నాయక్ సోమవారం సాయంత్రం 7 గంటలకు పోస్టు పెట్టిన కొద్దిసేపటికే వైరల్గా మారింది. అంతలోనే ఆమె ఆ పోస్టును తొలగించేసింది. రాగిణి పోస్టుపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయినట్లుగా సమాచారం. మిత్రపక్షాలపై దాడి చేయడం మానుకోవాలని అధిష్టానం హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె వెంటనే ఎక్స్ ట్విట్టర్ నుంచి పోస్టు తొలగించింది. కాకపోతే అప్పటికే ఆ పోస్టు వైరల్గా మారిపోయింది. జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. దీనిపై మిత్రపక్షాలైన ఆప్, కాంగ్రెస్ నేతల మధ్య ఎలాంటి పరిణామం చోటుచేసుకుంటుందో చూడాలి.

నటి పరిణీతి చోప్రా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ‘వింబుల్డన్ ఫైనల్స్, స్ట్రాబెర్రీలు, క్రీమ్, మరియు నా ప్రేమ … ఉత్తమ వీకెండ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఇండియా కూటమిలోని మిత్రపక్షాల విభేదాలపై బీజేపీ స్పందించింది. బీజేపీ నేత షెహజాద్ పూనావల్లా మాట్లాడుతూ.. ఎన్నికలు ముగిసినందున ఆప్, కాంగ్రెస్ మధ్య స్నేహం చెడిందని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Ragi Side Effects: రాగులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఎక్కువగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!
-
Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
-
Jasprit Bumrah-BCCI: ఆఫ్ఘనిస్థాన్తో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ కండిషన్!
-
Mirai 2: ‘మిరాయ్ 2’ వీఎఫ్ఎక్స్ కోసం… తేజ సజ్జా స్మార్ట్ ప్లానింగ్ వైరల్
-
Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..