Congress: కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గింపు రాహుల్ గాంధీ ఘనతే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: పెట్రోల్-డిజిల్ ధరలతో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో కేంద్రం ఇంధన ధరల్ని మార్చి 15 నుంచి రూ. 2 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్-డిజిల్ ధరల తగ్గింపు వినియోగదారుల వ్యయాన్ని పెంచుతుందని, 27 లక్షల ద్విచక్రవాహనాలు, 58 లక్షల భారీ వాహనాలు, 6 కోట్ల కార్ల నిర్వహణ ఖర్చుల్ని తగ్గిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, ఈ తగ్గింపును రాహుల్ గాంధీ ఘనతగా కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ నేత నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రభావం చూపిందని, అందుకే కేంద్రం ఇంధన ధరల్ని తగ్గించిందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ శుక్రవారం అన్నారు.
Read Also: Bramayugam : ఓటీటీలోకి వచ్చేసిన ‘భ్రమయుగం’..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Also Read
- Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
- VB-G RAM G: వీబీ-జీరామ్ జీ పథకం నేటి నుంచి అమల్లోకి.. రోజువారీ కనీస వేతనం రూ.300
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
మహారాష్ట్రలోని పాల్ఘర్లో జైరాం రమేష్ మాట్లాడుతూ.. ఇంధన ధరల్ని తగ్గించడం మంచి విషయమని, భారత్ జోడో న్యాయ్ యాత్ర కొంత ప్రభావం చూపిస్తోందని ఆయన అన్నారు. అంతకుముందు కేంద్రం ఎల్పీజీ సిలిండర్లపై రూ. 100 తగ్గించింది. అయితే దీనిని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిదంబరం విమర్శించారు. ఎన్నికల తర్వాత(మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే) ధరలు పెంచబోమని ప్రభుత్వం ప్రకటిస్తుందా..? ఎల్పీజీ సిలిండర్ ధరను బీజేపీ ప్రభుత్వం రూ. 700 పెంచి, ఎన్నికల సందర్భంగా రూ.100 తగ్గించిందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పెట్రోల్, డిజిల్ విషయంలో కూడా కేంద్రం ఇదే విధమైన చేతివాటాన్ని ప్రదర్శించిందని ఆయన విమర్శించారు.
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ ఇలా ధరల్ని తగ్గిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల మహిళా దినోత్సం(మార్చి8)న ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ. 100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ఈ తగ్గింపు దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని, ముఖ్యంగా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని మోడీ అన్నారు. ఎల్పీజీ ధరలు తగ్గించిన సమయంపై ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఎన్సీపీ నేత, ఎంపీ సుప్రియా సూలే దీనిని ఎన్నికల స్టంట్గా వ్యాఖ్యానించారు. గత 7 నెలలుగా ధరల్ని ఎందుకు తగ్గించలేదని టీఎంసీ కేంద్రాన్ని ప్రశ్నించింది.
తాజావార్తలు
-
Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
-
Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
-
Zombie Reddy 2: తేజ సజ్జ సరసన బాలీవుడ్ బ్యూటీ? టాలీవుడ్ ఎంట్రీకి షనయా కపూర్ రెడీనా!
-
Commercial LPG Cylinder Price Cut: గుడ్ న్యూస్.. ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గాయోచ్..
-
AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!