Congress: కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గింపు రాహుల్ గాంధీ ఘనతే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: పెట్రోల్-డిజిల్ ధరలతో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో కేంద్రం ఇంధన ధరల్ని మార్చి 15 నుంచి రూ. 2 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్-డిజిల్ ధరల తగ్గింపు వినియోగదారుల వ్యయాన్ని పెంచుతుందని, 27 లక్షల ద్విచక్రవాహనాలు, 58 లక్షల భారీ వాహనాలు, 6 కోట్ల కార్ల నిర్వహణ ఖర్చుల్ని తగ్గిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, ఈ తగ్గింపును రాహుల్ గాంధీ ఘనతగా కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ నేత నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రభావం చూపిందని, అందుకే కేంద్రం ఇంధన ధరల్ని తగ్గించిందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ శుక్రవారం అన్నారు.
Read Also: Bramayugam : ఓటీటీలోకి వచ్చేసిన ‘భ్రమయుగం’..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Also Read
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
- AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
మహారాష్ట్రలోని పాల్ఘర్లో జైరాం రమేష్ మాట్లాడుతూ.. ఇంధన ధరల్ని తగ్గించడం మంచి విషయమని, భారత్ జోడో న్యాయ్ యాత్ర కొంత ప్రభావం చూపిస్తోందని ఆయన అన్నారు. అంతకుముందు కేంద్రం ఎల్పీజీ సిలిండర్లపై రూ. 100 తగ్గించింది. అయితే దీనిని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిదంబరం విమర్శించారు. ఎన్నికల తర్వాత(మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే) ధరలు పెంచబోమని ప్రభుత్వం ప్రకటిస్తుందా..? ఎల్పీజీ సిలిండర్ ధరను బీజేపీ ప్రభుత్వం రూ. 700 పెంచి, ఎన్నికల సందర్భంగా రూ.100 తగ్గించిందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పెట్రోల్, డిజిల్ విషయంలో కూడా కేంద్రం ఇదే విధమైన చేతివాటాన్ని ప్రదర్శించిందని ఆయన విమర్శించారు.
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ ఇలా ధరల్ని తగ్గిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల మహిళా దినోత్సం(మార్చి8)న ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ. 100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ఈ తగ్గింపు దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని, ముఖ్యంగా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని మోడీ అన్నారు. ఎల్పీజీ ధరలు తగ్గించిన సమయంపై ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఎన్సీపీ నేత, ఎంపీ సుప్రియా సూలే దీనిని ఎన్నికల స్టంట్గా వ్యాఖ్యానించారు. గత 7 నెలలుగా ధరల్ని ఎందుకు తగ్గించలేదని టీఎంసీ కేంద్రాన్ని ప్రశ్నించింది.
తాజావార్తలు
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..