Chhattisgarh: బీజాపూర్ భీకర ఎన్కౌంటర్.. అడెల్లుతో సహా కీలక ఏడుగురు మావోయిస్టులు మృతి..
- కాల్పులతో దద్దరిల్లుతున్న ఛత్తీస్గఢ్ ఇంద్రావతి నేషనల్ పార్క్..
- మైలారపు ఆడెల్లుతో సహా ఏడుగురు మావోయిస్టులు మృతి..
- మరో 10 మంది మావోలు భద్రతా బలగాల అదుపులో ఉన్నట్లు ప్రజాసంఘాల ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్గఢ్ బీజాపూర్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ భీకర ఎన్కౌంటర్తో దద్దరిల్లుతోంది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ శనివారం కూడా కొనసాగుతోంది. ఇప్పటికే కీలక మావోయిస్టులను హతమైనట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు ఇప్పటి వరకు ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు గౌతమ్ అలియాస్ సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటి సభ్యుడు మైలారపు ఆడెల్లు అలియస్ భాస్కర్ ఉన్నారు.
జూన్ 05,06, 07న బీజాపూర్ అడవుల్లో యాంటీ-నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతోంది. జూన్ 05న 025న, కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) సుధాకర్ @ గౌతమ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జూన్ 06న తెలంగాణ రాష్ట్ర కమిటీ (TSC) సభ్యుడు భాస్కర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాతి రోజుల్లో మిగతా మావోయిస్టుల మృతదేహాలను లభ్యమయ్యాయి.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
గౌతమ్, భాస్కర్తో పాటు గుర్తు తెలియని ఇద్దరు మహిళా మావోయిస్టులు, గుర్తుతెలియని ముగ్గురు పురుష మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న ఐదు గుర్తు తెలియని మావోయిస్టు మృతదేహాల గుర్తింపును నిర్ధారించడానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఎన్కౌంటర్ ప్రదేశాల నుండి రెండు AK-47 రైఫిల్స్తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు, దండకారణ్యంలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే, పాము కాట్లు, తేనెటీగల దాడులు, డీహైడ్రేషన్ వల్ల కొందరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వీరిందరికి ప్రస్తుతం వైద్య సాయం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, మరోవైపు ప్రజాసంఘాలు ఎన్కౌంటర్లపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. మరో 10 మంది మావోయిస్టుల భద్రతా బలగాల అదుపులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!