Chhattisgarh: బీజాపూర్ భీకర ఎన్కౌంటర్.. అడెల్లుతో సహా కీలక ఏడుగురు మావోయిస్టులు మృతి..
- కాల్పులతో దద్దరిల్లుతున్న ఛత్తీస్గఢ్ ఇంద్రావతి నేషనల్ పార్క్..
- మైలారపు ఆడెల్లుతో సహా ఏడుగురు మావోయిస్టులు మృతి..
- మరో 10 మంది మావోలు భద్రతా బలగాల అదుపులో ఉన్నట్లు ప్రజాసంఘాల ఆరోపణ..
Chhattisgarh: ఛత్తీస్గఢ్ బీజాపూర్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ భీకర ఎన్కౌంటర్తో దద్దరిల్లుతోంది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ శనివారం కూడా కొనసాగుతోంది. ఇప్పటికే కీలక మావోయిస్టులను హతమైనట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు ఇప్పటి వరకు ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు గౌతమ్ అలియాస్ సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటి సభ్యుడు మైలారపు ఆడెల్లు అలియస్ భాస్కర్ ఉన్నారు.
జూన్ 05,06, 07న బీజాపూర్ అడవుల్లో యాంటీ-నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతోంది. జూన్ 05న 025న, కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) సుధాకర్ @ గౌతమ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జూన్ 06న తెలంగాణ రాష్ట్ర కమిటీ (TSC) సభ్యుడు భాస్కర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాతి రోజుల్లో మిగతా మావోయిస్టుల మృతదేహాలను లభ్యమయ్యాయి.
Also Read
- May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
- West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
- Mamata Banerjee: బీహార్, మహారాష్ట్ర కాదు.. ఇది బెంగాల్.. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ విమర్శలు
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
గౌతమ్, భాస్కర్తో పాటు గుర్తు తెలియని ఇద్దరు మహిళా మావోయిస్టులు, గుర్తుతెలియని ముగ్గురు పురుష మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న ఐదు గుర్తు తెలియని మావోయిస్టు మృతదేహాల గుర్తింపును నిర్ధారించడానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఎన్కౌంటర్ ప్రదేశాల నుండి రెండు AK-47 రైఫిల్స్తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు, దండకారణ్యంలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే, పాము కాట్లు, తేనెటీగల దాడులు, డీహైడ్రేషన్ వల్ల కొందరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వీరిందరికి ప్రస్తుతం వైద్య సాయం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, మరోవైపు ప్రజాసంఘాలు ఎన్కౌంటర్లపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. మరో 10 మంది మావోయిస్టుల భద్రతా బలగాల అదుపులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
-
Jason Holder: కేజీ నా దగ్గరే ఉన్నాడు.. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్పై స్పందించిన హోల్డర్!
-
Veggie Frittata Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. లంచ్ బాక్స్లోకి కమ్మని ‘వెజ్జీ ఫ్రిటాటా’.. తింటే పిల్లలు అస్సలు వదలరు!
-
May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
-
PEDDI Press Meet : ‘పెద్ది’ షూటింగ్ ఫినిష్.. నేడు మేకర్స్ భారీ ప్రెస్ మీట్.. రిలీజ్ డేట్ ఛేంజ్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!