Chandigarh Mayoral Poll: చండీగఢ్ మేయర్ ఎన్నిక ముందు కాంగ్రెస్కి భారీ షాక్.. బీజేపీ ఫుల్ హ్యాపీ..
- చండీగఢ్ మేయర్ ఎన్నిక ముందు కాంగ్రెస్కి షాక్..
- బీజేపీలో చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్..
- కమలం పార్టీతో టచ్లోకి పలువురు ఆప్ కౌన్సిలర్లు..
- ప్రత్యేక పరిశీలకుడిని నియమిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandigarh Mayoral Poll: చండీగఢ్ మేయర్ ఎన్నికకు ముందే కాంగ్రెస్కి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ కౌన్సిలర్ గుర్బక్ష్ రావత్ బీజేపీలో చేరడంతో హస్తం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్కి మొత్తం 7 మంది కౌన్సిలర్లు ఉండగా, ఇప్పుడు ఆ పార్టీకి ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే మిగిలిపోయారు. బీజేపీ కౌన్సిలర్ల సంఖ్య 16కి పెరిగింది. చండీగఢ్ లోని బీజేపీ కార్యాలయంలో, చండీగఢ్ బీజేపీ అధ్యక్షుడు జతీందర్ పాల్ మల్హోత్రా, పార్టీ సీనియర్ల సమక్షంలో రావత్ బీజేపీలో చేరారు.
జనవరి 30న మేయర్ ఎన్నిక జరగబోతున్న తరుణంలో ఈ పరిణామం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో చండీగఢ్ మేయర్ ఎన్నికలు సజావుగా సాగేందుకు ఈ రోజు సుప్రీంకోర్టు స్వతంత్ర పరిశీలకుడి నియమిస్తామని చెప్పింది. జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం పరిశీలకుడి పేరు లేకుండా ఈ ఉత్తర్వును జారీ చేసింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను ఆయన సమక్షంలోనే నిర్వహించాలని మరియు దానిని వీడియోలో చిత్రీకరించాలని పేర్కొంది. స్వతంత్ర పరిశీలకుడికి గౌరవ వేతనం చెల్లిస్తామని చెప్పింది.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Read Also: Tollywood: నటితో దర్శకుడి ప్రేమాయణం.. గుర్తు తెలియని నెంబర్తో లీకులు
చండీగఢ్ మేయర్ ఎన్నికలు గతేడాది నుంచి చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ లబ్ది చేకూరేలా రిటర్నింగ్ అధికార బ్యాలెట్ పత్రాలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా 8 ఓట్లు చెల్లకుండా చేయడం కెమెరాలో రికార్డైంది. దీనిపై అతను సుప్రీంకోర్టు ముందు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. మేయర్ ఎన్నికల్ని నిష్పాక్షికంగా నిర్వహించేందుకు, బ్యాలెట్కి బదులుగా చేతులెత్తే ప్రక్రియ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ యాదవ్ సుప్రీకోర్టుని ఆశ్రయించారు.
ప్రస్తుతం బలాబలాను చూస్తే బీజేపీకి 16 మంది, ఆప్-కాంగ్రెస్ కూటమికి 20 మంది కౌన్సిలర్ల బలం ఉంది. పార్టీ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆప్ తన కౌన్సిలర్లను రోపర్లోని ఒక హోటల్కి తరలించింది. వారి సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీలో విభేదాల కారణంగా ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు హోటల్ వెళ్లేందుకు నిరాకరించారు. ఆప్ నుంచి ప్రేమ లత మేయర్ అభ్యర్థిత్వంపై అసంతృప్తిగా ఉన్నారని, బీజేపీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
F-16 Fighter Jet Crash: అమెరికాలో F-16 ఫైటర్ జెట్ క్రాష్.. వీడియో వైరల్, దర్యాప్తు షురూ
-
Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
-
IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!