Chandigarh Mayoral Poll: చండీగఢ్ మేయర్ ఎన్నిక ముందు కాంగ్రెస్కి భారీ షాక్.. బీజేపీ ఫుల్ హ్యాపీ..
- చండీగఢ్ మేయర్ ఎన్నిక ముందు కాంగ్రెస్కి షాక్..
- బీజేపీలో చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్..
- కమలం పార్టీతో టచ్లోకి పలువురు ఆప్ కౌన్సిలర్లు..
- ప్రత్యేక పరిశీలకుడిని నియమిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandigarh Mayoral Poll: చండీగఢ్ మేయర్ ఎన్నికకు ముందే కాంగ్రెస్కి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ కౌన్సిలర్ గుర్బక్ష్ రావత్ బీజేపీలో చేరడంతో హస్తం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్కి మొత్తం 7 మంది కౌన్సిలర్లు ఉండగా, ఇప్పుడు ఆ పార్టీకి ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే మిగిలిపోయారు. బీజేపీ కౌన్సిలర్ల సంఖ్య 16కి పెరిగింది. చండీగఢ్ లోని బీజేపీ కార్యాలయంలో, చండీగఢ్ బీజేపీ అధ్యక్షుడు జతీందర్ పాల్ మల్హోత్రా, పార్టీ సీనియర్ల సమక్షంలో రావత్ బీజేపీలో చేరారు.
జనవరి 30న మేయర్ ఎన్నిక జరగబోతున్న తరుణంలో ఈ పరిణామం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో చండీగఢ్ మేయర్ ఎన్నికలు సజావుగా సాగేందుకు ఈ రోజు సుప్రీంకోర్టు స్వతంత్ర పరిశీలకుడి నియమిస్తామని చెప్పింది. జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం పరిశీలకుడి పేరు లేకుండా ఈ ఉత్తర్వును జారీ చేసింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను ఆయన సమక్షంలోనే నిర్వహించాలని మరియు దానిని వీడియోలో చిత్రీకరించాలని పేర్కొంది. స్వతంత్ర పరిశీలకుడికి గౌరవ వేతనం చెల్లిస్తామని చెప్పింది.
Also Read
- KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
Read Also: Tollywood: నటితో దర్శకుడి ప్రేమాయణం.. గుర్తు తెలియని నెంబర్తో లీకులు
చండీగఢ్ మేయర్ ఎన్నికలు గతేడాది నుంచి చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ లబ్ది చేకూరేలా రిటర్నింగ్ అధికార బ్యాలెట్ పత్రాలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా 8 ఓట్లు చెల్లకుండా చేయడం కెమెరాలో రికార్డైంది. దీనిపై అతను సుప్రీంకోర్టు ముందు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. మేయర్ ఎన్నికల్ని నిష్పాక్షికంగా నిర్వహించేందుకు, బ్యాలెట్కి బదులుగా చేతులెత్తే ప్రక్రియ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ యాదవ్ సుప్రీకోర్టుని ఆశ్రయించారు.
ప్రస్తుతం బలాబలాను చూస్తే బీజేపీకి 16 మంది, ఆప్-కాంగ్రెస్ కూటమికి 20 మంది కౌన్సిలర్ల బలం ఉంది. పార్టీ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆప్ తన కౌన్సిలర్లను రోపర్లోని ఒక హోటల్కి తరలించింది. వారి సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీలో విభేదాల కారణంగా ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు హోటల్ వెళ్లేందుకు నిరాకరించారు. ఆప్ నుంచి ప్రేమ లత మేయర్ అభ్యర్థిత్వంపై అసంతృప్తిగా ఉన్నారని, బీజేపీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
-
Ravichandran Ashwin: మాహి వస్తున్నాడా? ధోనీ రిటైర్మెంట్ వార్తల మధ్య అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
-
PBKS-Dharamsala: పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల.. ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక!
-
AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..