Chandigarh Mayoral Poll: చండీగఢ్ మేయర్ ఎన్నిక ముందు కాంగ్రెస్కి భారీ షాక్.. బీజేపీ ఫుల్ హ్యాపీ..
- చండీగఢ్ మేయర్ ఎన్నిక ముందు కాంగ్రెస్కి షాక్..
- బీజేపీలో చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్..
- కమలం పార్టీతో టచ్లోకి పలువురు ఆప్ కౌన్సిలర్లు..
- ప్రత్యేక పరిశీలకుడిని నియమిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandigarh Mayoral Poll: చండీగఢ్ మేయర్ ఎన్నికకు ముందే కాంగ్రెస్కి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ కౌన్సిలర్ గుర్బక్ష్ రావత్ బీజేపీలో చేరడంతో హస్తం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్కి మొత్తం 7 మంది కౌన్సిలర్లు ఉండగా, ఇప్పుడు ఆ పార్టీకి ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే మిగిలిపోయారు. బీజేపీ కౌన్సిలర్ల సంఖ్య 16కి పెరిగింది. చండీగఢ్ లోని బీజేపీ కార్యాలయంలో, చండీగఢ్ బీజేపీ అధ్యక్షుడు జతీందర్ పాల్ మల్హోత్రా, పార్టీ సీనియర్ల సమక్షంలో రావత్ బీజేపీలో చేరారు.
జనవరి 30న మేయర్ ఎన్నిక జరగబోతున్న తరుణంలో ఈ పరిణామం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో చండీగఢ్ మేయర్ ఎన్నికలు సజావుగా సాగేందుకు ఈ రోజు సుప్రీంకోర్టు స్వతంత్ర పరిశీలకుడి నియమిస్తామని చెప్పింది. జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం పరిశీలకుడి పేరు లేకుండా ఈ ఉత్తర్వును జారీ చేసింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను ఆయన సమక్షంలోనే నిర్వహించాలని మరియు దానిని వీడియోలో చిత్రీకరించాలని పేర్కొంది. స్వతంత్ర పరిశీలకుడికి గౌరవ వేతనం చెల్లిస్తామని చెప్పింది.
Also Read
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
Read Also: Tollywood: నటితో దర్శకుడి ప్రేమాయణం.. గుర్తు తెలియని నెంబర్తో లీకులు
చండీగఢ్ మేయర్ ఎన్నికలు గతేడాది నుంచి చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ లబ్ది చేకూరేలా రిటర్నింగ్ అధికార బ్యాలెట్ పత్రాలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా 8 ఓట్లు చెల్లకుండా చేయడం కెమెరాలో రికార్డైంది. దీనిపై అతను సుప్రీంకోర్టు ముందు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. మేయర్ ఎన్నికల్ని నిష్పాక్షికంగా నిర్వహించేందుకు, బ్యాలెట్కి బదులుగా చేతులెత్తే ప్రక్రియ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ యాదవ్ సుప్రీకోర్టుని ఆశ్రయించారు.
ప్రస్తుతం బలాబలాను చూస్తే బీజేపీకి 16 మంది, ఆప్-కాంగ్రెస్ కూటమికి 20 మంది కౌన్సిలర్ల బలం ఉంది. పార్టీ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆప్ తన కౌన్సిలర్లను రోపర్లోని ఒక హోటల్కి తరలించింది. వారి సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీలో విభేదాల కారణంగా ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు హోటల్ వెళ్లేందుకు నిరాకరించారు. ఆప్ నుంచి ప్రేమ లత మేయర్ అభ్యర్థిత్వంపై అసంతృప్తిగా ఉన్నారని, బీజేపీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!