Milind Deora: “చాయ్వాలా ప్రధాని, ఆటో డ్రైవర్ సీఎం”.. కాంగ్రెస్ మాజీ నేత ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Milind Deora: 55 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి ఉన్న బంధాన్ని మిలింద్ దేవరా వదిలేశారు. మహారాష్ట్రలో కీలక కాంగ్రెస్ నేతగా ఉన్న మిలింద్ దేవరా ఈ రోజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన సీఎం ఏక్నాథ్ షిండే సమక్షంలో శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి తన శక్తిసామర్థ్యాలపై నమ్మకం ఉన్నందుకు శివసేనలో చేరినట్లు వెల్లడించారు.
పార్టీలో చేరుతూ.. ‘‘మనం రోజూ చూస్తున్నాం ఒక చాయ్వాలా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రధాని అయ్యారు. ఆటోరిక్షా డ్రైవర్ దేశంలో రెండో అతిపెద్ద రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. ఈ మార్పు భారతదేశ రాజకీయాలను మెరుగుపరుస్తుంది. మన సమానత్వపు విలువలను పునరుద్ఘాటిస్తుంది’’ అని ఆయన ప్రధాని మోడీ, సీఎం ఏక్నాథ్ షిండేలపై ప్రశంసలు కురిపించారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
Read Also: Shashi Tharoor: వచ్చే ఎన్నికల్లో బీజేపీనే అతిపెద్ద పార్టీ, కానీ.. శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు..
దేశంలో అత్యంత కష్టపడే, అందరికి అందుబాటులో ఉండే సీఎం ఏక్నాథ్ షిండే అని అన్నారు. మహారాష్ట్రలో అనగారిని వర్గాలపై ఆయనకున్న అవగాహన, పాలన, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఆయన చేసిన కృషి అభినందనీయమని అన్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాల దార్శనికత తనకు స్పూర్తినిచ్చాయని చెప్పారు. ముంబై, మహారాష్ట్రలకు సంపన్నమైన భవిష్యత్తు కోసం సీఎం షిండే ప్రయత్నాలకు మద్దతు ఇస్తానని వెల్లడించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ తీరుపై ఆయన మండిపడ్డారు. కీలకమైన రాజకీయ నిర్ణయాల సమయంలో తను పార్టీ పక్కనపెట్టినట్లు చెప్పారు. పదేళ్ల పాటు నేను వ్యక్తిగత హోదా, అధికారాన్ని ఆశించకుండా పనిచేశానని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!