Health Warning: ‘పొగాకు వాడేవారు పోతారు’.. కేంద్రం కొత్త ఆరోగ్య హెచ్చరిక జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Warning: ఇప్పటివరకు పొగాకు ఉత్పత్తులైన సిగరెట్, బీడీ, పాన్ మసాలా ప్యాకెట్లపై ‘పొగాకు ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరిక ఉండేది. ఇకపై కొత్త హెచ్చరిక అమల్లోకి రానుంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై హెచ్చరికలను సవరించింది. 2022 డిసెంబరు 1న లేదా ఆ తర్వాత తయారయ్యే, దిగుమతి చేసుకునే లేదా ప్యాకేజ్ అయ్యే పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై అక్షరాలు, బొమ్మల రూపంలో కొత్త హెచ్చరికలను ముద్రించాలని ఆదేశించింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సవరించిన నియమాలు డిసెంబర్ 1, 2022 నుండి అమలులోకి వస్తాయి.
ఈ ప్రకటన ప్రకారం డిసెంబర్ 1 నుంచి తయారయ్యే పొగాకు ఉత్పత్తులపై ‘పొగాకు బాధాకరమైన మరణానికి కారణమవుతుంది’ అనే వచన ఆరోగ్య హెచ్చరికతో పాటు ప్రభుత్వం అందించిన చిత్రాలను ముద్రించాలి. వచ్చే ఏడాది డిసెంబర్ 1 నుంచి దిగుమతి చేసుకునే లేదా ప్యాకేజ్ అయ్యే పొగాకు ఉత్పత్తుల పెట్టెలపై ‘పొగాకు వినియోగదారులు తక్కువ వయసులోనే మరణిస్తారు” అని అక్షరాలతో పాటు ప్రభుత్వం అందించిన చిత్రాలను ముద్రించాలి.
Also Read
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
- Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
Arpita Mukherjee: నటి అర్పితా ముఖర్జీకి నాలుగు లగ్జరీ కార్లు.. వాటి నిండా డబ్బే!
సిగరెట్లు లేదా ఏదైనా పొగాకు ఉత్పత్తుల తయారీ, ఉత్పత్తి, సరఫరా, దిగుమతి లేదా పంపిణీలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిమగ్నమై ఉన్న ఏ వ్యక్తి అయినా, అన్ని పొగాకు ఉత్పత్తుల ప్యాకేజీలు నిర్దేశించిన విధంగానే నిర్దేశించిన ఆరోగ్య హెచ్చరికలను కలిగి ఉండేలా చూసుకోవాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం-2003లోని సెక్షన్ 20లో సూచించిన విధంగా జైలు శిక్ష లేదా జరిమానాకు శిక్షార్హులని ఈ ప్రకటనలో కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తుల తయారీ (ప్యాకేజీ, లేబులింగ్) నిబంధనలు-2008లో ఈ మేరకు సవరణలు చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. సవరించిన నిబంధనలు 2022 డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నోటిఫికేషన్ 19 భాషల్లో అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
-
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
-
China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
-
Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
-
Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!