Rahul Gandhi: మా బావ రాబర్ట్ వాద్రాను గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వేధిస్తోంది..
- రాబర్ట్ వాద్రా ఈడీ విచారణపై స్పందించిన రాహుల్ గాంధీ..
- గుర్గావ్ ల్యాండ్ వ్యవహారంలో రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్షీట్..
- తన బావ రాబర్ట్ వాద్రాను గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వేధిస్తోంది..
- మా బావ రాబర్ట్ వాద్రా, సోదరి ప్రియాంకకు నేను అండగా ఉంటాను: రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా అభియోగపత్రాన్ని కోర్టులో దాఖలు చేసింది. 2008లో గుర్గావ్లోని సెక్టార్ 83లో షికోహ్పూర్ గ్రామంలో 3.53 ఎకరాల భూమి కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందని ఈడీ ఆరోపిస్తుంది. అయితే, ఈ భూమిని స్కైలైట్ హాస్పిటాలిటీ అనే సంస్థ, ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ అనే కంపెనీ నుంచి కొనుగోలు చేసినట్టు చార్జ్షీట్ లో ప్రస్తావించింది. ఇక, ఈ డీల్కు సంబంధించిన చెల్లింపు చెక్కులను మరో కంపెనీ అయిన స్కైలైట్ రియాల్టీ ఇచ్చిందని ఈడీ వెల్లడించింది. కాగా, ఈ రెండు సంస్థలకూ రాబర్ట్ వాద్రానే యజమానిగా ఉన్నారని పేర్కొంది.
Read Also: Rishabh Pant: మరో 40 పరుగులే.. నంబర్-1 బ్యాటర్గా చరిత్ర సృష్టించనున్న పంత్!
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఇక, సేల్ డీడ్ నమోదైన సమయంలో స్కైలైట్ హాస్పిటాలిటీ అకౌంట్లో కేవలం రూ.1 లక్ష నగదు మాత్రమే ఉండగా, రూ.7.5 కోట్ల విలువైన భూమిని ఎలా కొనుగోలు చేసిందన్న అనుమానాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యక్తం చేసింది. అంతేకాక, ఈ భూమిని మరుసటి రోజే స్కైలైట్ హాస్పిటాలిటీ పేరుపైకి మార్చారని తెలిపింది. సాధారణంగా భూమి టైటిల్ బదిలీ ప్రక్రియకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది.. కానీ, ఈ వ్యవహారంలో 24 గంటల్లోనే ఆస్తి పేరు మారడం అనేక అనుమానాలకు దారి తీస్తుందని చెప్పుకొచ్చింది.
Read Also: Felix Baumgartner: సూపర్సోనిక్ స్కైడైవ్ మార్గదర్శకుడు ఫెలిక్స్ బామ్గార్ట్నర్ కన్నుమూత
ఇక, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేసిన రాహుల్.. నా బావ రాబర్టుని ఈ కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా వెంటాడుతోంది అని ఆరోపించారు. బావ రాబర్ట్ వాద్రా, సోదరి ప్రియాంకతో పాటు వారి పిల్లలుకు తన అండగా ఉంటాను అని పేర్కొన్నారు. మా బావపై జరుగుతున్న కుట్రలు రాజకీయంగా ప్రేరేపించబడినవి మాత్రమే అన్నారు. ఈ వేధింపులను తట్టుకోవడానికి నేను వారికి మద్దతుగా నిలుస్తాను అని వెల్లడించారు. వారందరూ ఎలాంటి హింసనైనా తట్టుకునేంత ధైర్యంగా ఉన్నారని నాకు తెలుసు.. చివరికి నిజమే గెలుస్తుంది అని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు.
My brother-in-law has been hounded by this government for the last ten years. This latest chargesheet is a continuation of that witch hunt.
I stand with Robert, Priyanka and their children as they face yet another onslaught of malicious, politically motivated slander and…
— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2025
- Tags
- bjp
- Centre Govt
- congress
- NDA
- PM Modi
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!