Rahul Gandhi: మా బావ రాబర్ట్ వాద్రాను గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వేధిస్తోంది..
- రాబర్ట్ వాద్రా ఈడీ విచారణపై స్పందించిన రాహుల్ గాంధీ..
- గుర్గావ్ ల్యాండ్ వ్యవహారంలో రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్షీట్..
- తన బావ రాబర్ట్ వాద్రాను గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వేధిస్తోంది..
- మా బావ రాబర్ట్ వాద్రా, సోదరి ప్రియాంకకు నేను అండగా ఉంటాను: రాహుల్ గాంధీ
Rahul Gandhi: వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా అభియోగపత్రాన్ని కోర్టులో దాఖలు చేసింది. 2008లో గుర్గావ్లోని సెక్టార్ 83లో షికోహ్పూర్ గ్రామంలో 3.53 ఎకరాల భూమి కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందని ఈడీ ఆరోపిస్తుంది. అయితే, ఈ భూమిని స్కైలైట్ హాస్పిటాలిటీ అనే సంస్థ, ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ అనే కంపెనీ నుంచి కొనుగోలు చేసినట్టు చార్జ్షీట్ లో ప్రస్తావించింది. ఇక, ఈ డీల్కు సంబంధించిన చెల్లింపు చెక్కులను మరో కంపెనీ అయిన స్కైలైట్ రియాల్టీ ఇచ్చిందని ఈడీ వెల్లడించింది. కాగా, ఈ రెండు సంస్థలకూ రాబర్ట్ వాద్రానే యజమానిగా ఉన్నారని పేర్కొంది.
Read Also: Rishabh Pant: మరో 40 పరుగులే.. నంబర్-1 బ్యాటర్గా చరిత్ర సృష్టించనున్న పంత్!
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
ఇక, సేల్ డీడ్ నమోదైన సమయంలో స్కైలైట్ హాస్పిటాలిటీ అకౌంట్లో కేవలం రూ.1 లక్ష నగదు మాత్రమే ఉండగా, రూ.7.5 కోట్ల విలువైన భూమిని ఎలా కొనుగోలు చేసిందన్న అనుమానాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యక్తం చేసింది. అంతేకాక, ఈ భూమిని మరుసటి రోజే స్కైలైట్ హాస్పిటాలిటీ పేరుపైకి మార్చారని తెలిపింది. సాధారణంగా భూమి టైటిల్ బదిలీ ప్రక్రియకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది.. కానీ, ఈ వ్యవహారంలో 24 గంటల్లోనే ఆస్తి పేరు మారడం అనేక అనుమానాలకు దారి తీస్తుందని చెప్పుకొచ్చింది.
Read Also: Felix Baumgartner: సూపర్సోనిక్ స్కైడైవ్ మార్గదర్శకుడు ఫెలిక్స్ బామ్గార్ట్నర్ కన్నుమూత
ఇక, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేసిన రాహుల్.. నా బావ రాబర్టుని ఈ కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా వెంటాడుతోంది అని ఆరోపించారు. బావ రాబర్ట్ వాద్రా, సోదరి ప్రియాంకతో పాటు వారి పిల్లలుకు తన అండగా ఉంటాను అని పేర్కొన్నారు. మా బావపై జరుగుతున్న కుట్రలు రాజకీయంగా ప్రేరేపించబడినవి మాత్రమే అన్నారు. ఈ వేధింపులను తట్టుకోవడానికి నేను వారికి మద్దతుగా నిలుస్తాను అని వెల్లడించారు. వారందరూ ఎలాంటి హింసనైనా తట్టుకునేంత ధైర్యంగా ఉన్నారని నాకు తెలుసు.. చివరికి నిజమే గెలుస్తుంది అని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు.
My brother-in-law has been hounded by this government for the last ten years. This latest chargesheet is a continuation of that witch hunt.
I stand with Robert, Priyanka and their children as they face yet another onslaught of malicious, politically motivated slander and…
— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2025
- Tags
- bjp
- Centre Govt
- congress
- NDA
- PM Modi
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో