West Bengal: గవర్నర్ కార్యాలయంపై దుష్ప్రచారం.. సీనియర్ పోలీస్ అధికారులపై కేంద్రం చర్యలు..
- పశ్చిమ బెంగాల్లో గవర్నర్ వర్సెస్ సీఎం..
- కోల్కతా పోలీస్ అధికారులపై కేంద్రం చర్యలు..
- గవర్నర్ నివేదిక ఆధారంగా చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లో గవర్నర్ వర్సెస్ సీఎంగా రాజకీయం కొనసాగుతోంది. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, సీఎం మమతా బెనర్జీకి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే గవర్నర్ నివాసం రాజ్భవన్పై దుష్ప్రచారం చేయడంపై ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులపై కేంద్రం క్షమశిక్షణా చర్యలు ప్రారంభించినట్లు కేంద్ర అధికారి ఒకరు తెలిపారు. కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్తో పాటు కోల్కతా సెంట్రల్ డీసీసీ ఇందిరా ముఖర్జీపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ ఇద్దరు కూడా పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకులుగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ గవర్నర్ సీవీ ఆనందో బోస్ నివేదిక సమర్పించిన తర్వాత కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ చర్య తీసుకుంది.
జూన్ నెలాఖరులో కేంద్ర హోం మంత్రికి గవర్నర్ నివేదిక సమర్పించారు. ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకాండలో బాధితులను అనుమతి ఉన్నప్పటికీ గవర్నర్ని కలిసేందుకు అడ్డుకున్నారని నివేదికలో పేర్కొంది. రాజ్భవన్లో నియమించబడిన పోలీస్ అధికారులు, ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో ఒక మహిళా ఉద్యోగి గవర్నర్పై చేసిన ఆరోపణల్ని ప్రోత్సహిస్తున్నారని గవర్నర్ ఆరోపించారు. ఈ అధికారులు తమ చర్యల ద్వారా గవర్నర్ కార్యాలయానికి కళంకం తీసుకువచ్చినట్లు నివేదిక పేర్కొంది. గవర్నర్ కార్యాలయం నుంచి అభ్యంతరాలు ఉన్నప్పటికీ, రాజ్ భవన్ సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయడం, ఎంట్రన్స్-ఎగ్జిట్లను తనఖీ చేయడం వంటి కొత్త పద్దతులను కోల్కతా పోలీసులు తీసుకువచ్చినట్లు నివేదికలో ప్రస్తావించారు.
Also Read
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
Read Also: Hathras stampede: ప్రజలపై విషం చల్లారు.. తొక్కిసలాట ఘటనపై భోలే బాబా లాయర్..
పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హింసాత్మక ఘటనల్లో బాధితులుగా ఉన్న వారు ప్రతిపక్ష నేత సువేందు అధికారితో కలిసి గవర్నర్ బోస్ని కలిసేందుకు వచ్చినప్పుడు పోలీసులు అడ్డుకోవడం, వారిని అదుపులోకి తీసుకోవడం గవర్నర్ రాజ్యాంగ అధికారాన్ని అవమానించడమే అని నివేదికలో పేర్కొన్నారు. గవర్నర్ని కలవడానికి బాధితులు కోర్టుని ఆశ్రయించాల్సి రావడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర అధికారి అన్నారు. జూన్ 13న రాజ్ భవన్ నుండి పోలీసు బృందాన్ని తొలగించాలని బోస్ ఇచ్చిన ఆదేశాలపై కోల్కతా పోలీసులు మౌనం వహించడాన్ని ఆదేశాలనను ధిక్కరించినట్లుగా చూపబడిందని అధికారి తెలిపారు. గవర్నర్కి తెలియకుండా కోల్కతా పోలీసులు ఏకపక్షంగా సెక్యూరిటీ మెకానిజంని ఏర్పాటు చేశారని అధికారి వెల్లడించారు.
రాజ్ భవన్ మహిళా ఉద్యోగి తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ముందస్తు స్కిప్టులో భాగమే అని బోస్ తన నివేదికలో పేర్కొన్నారు. అసాధారణమైన వేగంతో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేశారని, ఇది గవర్నర్ క్రిమిన్ ప్రొసీడింగ్ ఎదుర్కోనగలడనే తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించడానికి మీడియా సమావేశాలను కొనసాగించారని నివేదిక పేర్కొంది.గోయల్ మరియు ముఖర్జీలపై చర్య తీసుకోవాలని కోరుతూ బోస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఆమె కార్యాలయం నుండి ఎటువంటి సమాచారం లేదు.
తాజావార్తలు
-
Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రెండో ఈవెంట్కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ?
-
Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ
-
RAW NTR: ‘ఊరు–వాడ’ కార్యక్రమంపై ‘రా ఎన్టీఆర్’ కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!