Hathras stampede: ప్రజలపై విషం చల్లారు.. తొక్కిసలాట ఘటనపై భోలే బాబా లాయర్..
- హత్రాస్ ఘటనపై భోలే బాబా లాయర్ సంచలన వ్యాఖ్యలు..
- విషం చల్లడంతోనే తొక్కిసలాట..
- 15-16 మంది కుట్ర పన్నడంతోనే ఘటన..
Hathras stampede: హత్రాస్ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక ధార్మిక కార్యక్రమంతో కోసం ఎక్కువ సంఖ్యలో జనం హాజరుకావడంతో తొక్కిసలాట జరిగి 121 మంది మరణించారు. ఉత్తర్ప్రదేశ్లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. భోలే బాబాగా పిలువడే ఆధ్యాత్మిక గురువు కార్యక్రమానికి లక్షల సంఖ్యలో జనాలు హాజరయ్యారు. 80 వేల మందికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ 2.5 లక్షల మంది ప్రజలు వచ్చారు. భోలే బాబా పాదధూళి తీసుకునేందుకు జనాలు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.
Read Also: BMW Car Accident: బీఎండబ్ల్యూ కార్ ఢీకొని మహిళ మృతి.. శివసేన నేత కుమారుడే ప్రధాన నిందితుడు..
Also Read
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే ఈ ఘటనలో సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందని భోలే బాబా ఆరోపించారు. ఈ ఆరోపణల తర్వాత మరోసారి భోలే బాబా తరుపున ఆయన న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్రాస్ తొక్కిసలాట పథకం ప్రకారం జరిగిందని ఆయన ఆరోపించారు. మతమరమైన కార్యక్రమంలో 10-12 మంది వ్యక్తులు విషం చల్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని న్యాయవాది ఏపీ సింగ్ ఆదివారం పేర్కొన్నారు. తొక్కిసలాట తర్వాత కుట్ర చేసినవారు అక్కడ నుంచి పారిపోయారని అన్నారు.
ఈ కుట్రలో మొత్తం 16 మంది పాల్గొన్నారని, కొన్ని గుర్తుతెలియని వాహనాలు తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో ఉన్నాయని, 10-12 మంది విషం చిమ్మడంతో మహిళలు ఊపిరితీసుకునేందుకు పరిగెత్తారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న దేవప్రకాష్ మధుకర్ని గత వారం సిట్ ముందు లొంగిపోయాడు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జస్టిస్ (రిటైర్డ్) బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల దర్యాప్తు ప్యానెల్ను ఏర్పాటు చేసింది. తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు మధుకర్ సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!