Bengal BJP: మమతా బెనర్జీ పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించుకోవాలని బీజేపీ డిమాండ్..!
- నేడు పశ్చిమ బెంగాల్ బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ..
- సీఎం మమతా బెనర్జీ
- కోల్కతా పోలీస్ కమిసనర్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలి..
- నిందితులను రక్షించేందుకు మమతా ప్రభుత్వం పని చేస్తుంది: బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal BJP: కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ను చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితులు సంజయ్ రాయ్, సందీప్ ఘోష్ సహా పలువురికి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ విషయంలో సీఎం మమతా బెనర్జీకి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా నిర్వహించాలని బీజేపీ పేర్కొంది. సీఎం మమతా బెనర్జీ, కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్లకు సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని పోలీసు కమిషనర్ మొదట చెప్పారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది.
Read Also: Urfi Javed: ప్రైవేట్ జెట్ కొనేంతవరకు శృంగారంలో పాల్గొనను : ఉర్ఫీ జావెద్
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
కాగా, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో ఏం జరిగినా ఆందోళనకరమేనని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జూనియర్ డాక్టర్పై అత్యాచారం కేసులో నిందితులను కాపాడేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు. దేశంలో నియంత ఎవరైనా ఉంటే ఆ నియంత మమతా బెనర్జీ అని భాటియా అన్నారు. నిజాన్ని అణచివేయలేమని, ఈ వ్యక్తులు తమ పదవుల్లో ఉండి విద్యార్థులను నలిపివేస్తున్నంత కాలం రాజ్యాంగాన్ని అణిచివేయడమే పెద్ద విషయం అని ఆయన మండిపడ్డారు.
Read Also: Srisailam Dam Gates Lifted: కృష్ణమ్మ పరవళ్లు.. ఈ ఏడాదిలో రెండోసారి శ్రీశైలం గేట్లు ఎత్తిన అధికారులు
అయితే, నబానా మార్చ్పై పోలీసుల చర్యకు నిరసనగా పశ్చిమ బెంగాల్ బీజేపీ ఇవాళ (బుధవారం) 12 గంటల పాటు బంద్కు పిలుపునిచ్చింది. రాష్ట్ర సచివాలయం నబన్నా వైపు కవాతు చేస్తున్న నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగించారు.. నీటి ఫిరంగులను ఉపయోగించడంతో పాటు లాఠీచార్జీ కూడా చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు కోల్కతా పోలీసులు భారీ బలగాలను మోహరించారు.. ఇప్పటికే పలువురు బీజేపీ ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!