Bengal BJP: మమతా బెనర్జీ పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించుకోవాలని బీజేపీ డిమాండ్..!
- నేడు పశ్చిమ బెంగాల్ బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ..
- సీఎం మమతా బెనర్జీ
- కోల్కతా పోలీస్ కమిసనర్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలి..
- నిందితులను రక్షించేందుకు మమతా ప్రభుత్వం పని చేస్తుంది: బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal BJP: కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ను చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితులు సంజయ్ రాయ్, సందీప్ ఘోష్ సహా పలువురికి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ విషయంలో సీఎం మమతా బెనర్జీకి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా నిర్వహించాలని బీజేపీ పేర్కొంది. సీఎం మమతా బెనర్జీ, కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్లకు సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని పోలీసు కమిషనర్ మొదట చెప్పారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది.
Read Also: Urfi Javed: ప్రైవేట్ జెట్ కొనేంతవరకు శృంగారంలో పాల్గొనను : ఉర్ఫీ జావెద్
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
కాగా, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో ఏం జరిగినా ఆందోళనకరమేనని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జూనియర్ డాక్టర్పై అత్యాచారం కేసులో నిందితులను కాపాడేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు. దేశంలో నియంత ఎవరైనా ఉంటే ఆ నియంత మమతా బెనర్జీ అని భాటియా అన్నారు. నిజాన్ని అణచివేయలేమని, ఈ వ్యక్తులు తమ పదవుల్లో ఉండి విద్యార్థులను నలిపివేస్తున్నంత కాలం రాజ్యాంగాన్ని అణిచివేయడమే పెద్ద విషయం అని ఆయన మండిపడ్డారు.
Read Also: Srisailam Dam Gates Lifted: కృష్ణమ్మ పరవళ్లు.. ఈ ఏడాదిలో రెండోసారి శ్రీశైలం గేట్లు ఎత్తిన అధికారులు
అయితే, నబానా మార్చ్పై పోలీసుల చర్యకు నిరసనగా పశ్చిమ బెంగాల్ బీజేపీ ఇవాళ (బుధవారం) 12 గంటల పాటు బంద్కు పిలుపునిచ్చింది. రాష్ట్ర సచివాలయం నబన్నా వైపు కవాతు చేస్తున్న నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగించారు.. నీటి ఫిరంగులను ఉపయోగించడంతో పాటు లాఠీచార్జీ కూడా చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు కోల్కతా పోలీసులు భారీ బలగాలను మోహరించారు.. ఇప్పటికే పలువురు బీజేపీ ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!