RG Kar verdict: ఆర్జీ కర్ కేసులో ఉరిశిక్ష విధించాలన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తిని వ్యతిరేకించిన సీబీఐ
- ఆర్జీ కర్ హత్య కేసుపై కోల్కతా హైకోర్టులో బెంగాల్ ప్రభుత్వం పిటిషన్..
- దోషి సంజయ్ రాయ్ కి మరణశిక్ష విధించాలని సీఎం మమతా బెనర్జీ డిమాండ్..
- నిందితుడికి ఉరిశిక్ష విధించాలన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తిని వ్యతిరేకించిన సీబీఐ
RG Kar verdict: ఆర్జీ కర్ హస్పటల్ లో జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారం కేసులో నిందితుడు సంజయ్రాయ్కు మరణశిక్ష విధించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్ కతా హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన సీబీఐ బెంగాల్ సర్కార్ ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ దాఖలు చేయడాన్ని సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కేసును విచారించిన ఏజెన్సీగా శిక్ష విషయంలో కోర్టును ఆశ్రయించే హక్కు తమకు మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పింది. ఇందులో జోక్యం చేసుకొనే అధికారం ప్రభుత్వానికి లేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేర్కొంది.
Read Also: Karnataka CM Post: కర్ణాటక ముఖ్యమంత్రి కావాలనే కోరిక డీకే శివకుమార్కు ఉంది..
Also Read
- Assembly Elections Exit poll 2026: అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. కాంగ్రెస్ గల్లంతు..
- Assembly Elections Exit poll 2026: బెంగాల్లో మమత అడ్రస్ గల్లంతు.. కాషాయానిదే గెలుపు..
- Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
- Oil Crisis: భారత్కు గుడ్ న్యూస్.. చమురు రూటు మార్చిన యూఏఈ..
అయితే, ఈ కేసులో నిందితుడికి సీల్దా కోర్టు విధించిన శిక్ష సరిపోదని బెంగాల్ ప్రభుత్వ కోల్కతా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన న్యాయస్థానం.. అందరి వాదనలు విన్న తర్వాతే సర్కార్ దాఖలు చేసిన అప్పీల్ను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించింది. నిందితుడు సంజయ్ రాయ్తో పాటు సీబీఐ, మృతురాలి కుటుంబ సభ్యుల వాదనలు మరోసారి వింటామని చెప్పుకొచ్చింది. వచ్చే సోమవారం ( జనవరి 27) ఈ కేసుపై విచారణను జరుపుతామని తెలిపింది.
Read Also: Molly Wood : ఏడాదిగా ఆ హీరోతో దోబుచూలాడుతోన్న హిట్టు
కాగా, గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన కేసుపై ఇటీవల విచారణ చేసిన కోల్కతాలోని సీల్దా న్యాయస్థానం నిందితుడికి జీవిత ఖైదు విధించింది. అలాగే, బాధిత కుటుంబానికి రూ.17 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని బెంగాల్ సర్కార్ కి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఉరి శిక్ష విధించడానికి అరుదైన కేసు కేటగిరీలోకి రాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. ఈ తీర్పుపై అసంతృప్తిగా ఉందన్నారు. దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
IPL 2026: అనూహ్య రీతిలో మెరిసిన భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణాలు.. బీసీసీఐ దృష్టిలో ఈ 5 గురు..
-
Assembly Elections Exit poll 2026: అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. కాంగ్రెస్ గల్లంతు..
-
EPFO: ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఈపీఎఫ్ఓ నుంచి కీలక అప్డేట్.. ఇక సులువుగా..
-
Assembly Elections Exit poll 2026: బెంగాల్లో మమత అడ్రస్ గల్లంతు.. కాషాయానిదే గెలుపు..
-
Ask YouTube: యూట్యూబ్ యూజర్లకు సర్ప్రైజ్.. సెర్చ్ బార్లో ఏఐ ఫీచర్ వచ్చేస్తోంది!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!