RG Kar verdict: ఆర్జీ కర్ కేసులో ఉరిశిక్ష విధించాలన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తిని వ్యతిరేకించిన సీబీఐ
- ఆర్జీ కర్ హత్య కేసుపై కోల్కతా హైకోర్టులో బెంగాల్ ప్రభుత్వం పిటిషన్..
- దోషి సంజయ్ రాయ్ కి మరణశిక్ష విధించాలని సీఎం మమతా బెనర్జీ డిమాండ్..
- నిందితుడికి ఉరిశిక్ష విధించాలన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తిని వ్యతిరేకించిన సీబీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RG Kar verdict: ఆర్జీ కర్ హస్పటల్ లో జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారం కేసులో నిందితుడు సంజయ్రాయ్కు మరణశిక్ష విధించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్ కతా హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన సీబీఐ బెంగాల్ సర్కార్ ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ దాఖలు చేయడాన్ని సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కేసును విచారించిన ఏజెన్సీగా శిక్ష విషయంలో కోర్టును ఆశ్రయించే హక్కు తమకు మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పింది. ఇందులో జోక్యం చేసుకొనే అధికారం ప్రభుత్వానికి లేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేర్కొంది.
Read Also: Karnataka CM Post: కర్ణాటక ముఖ్యమంత్రి కావాలనే కోరిక డీకే శివకుమార్కు ఉంది..
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
అయితే, ఈ కేసులో నిందితుడికి సీల్దా కోర్టు విధించిన శిక్ష సరిపోదని బెంగాల్ ప్రభుత్వ కోల్కతా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన న్యాయస్థానం.. అందరి వాదనలు విన్న తర్వాతే సర్కార్ దాఖలు చేసిన అప్పీల్ను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించింది. నిందితుడు సంజయ్ రాయ్తో పాటు సీబీఐ, మృతురాలి కుటుంబ సభ్యుల వాదనలు మరోసారి వింటామని చెప్పుకొచ్చింది. వచ్చే సోమవారం ( జనవరి 27) ఈ కేసుపై విచారణను జరుపుతామని తెలిపింది.
Read Also: Molly Wood : ఏడాదిగా ఆ హీరోతో దోబుచూలాడుతోన్న హిట్టు
కాగా, గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన కేసుపై ఇటీవల విచారణ చేసిన కోల్కతాలోని సీల్దా న్యాయస్థానం నిందితుడికి జీవిత ఖైదు విధించింది. అలాగే, బాధిత కుటుంబానికి రూ.17 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని బెంగాల్ సర్కార్ కి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఉరి శిక్ష విధించడానికి అరుదైన కేసు కేటగిరీలోకి రాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. ఈ తీర్పుపై అసంతృప్తిగా ఉందన్నారు. దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..