Karnataka CM Post: కర్ణాటక ముఖ్యమంత్రి కావాలనే కోరిక డీకే శివకుమార్కు ఉంది..
- కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ..
- ముఖ్యమంత్రి కావాలనే కోరిక డీకే శివకుమార్కు ఉంది..
- డీకే శివకుమార్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించండి: జైన సన్యాసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka CM Post: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని డీకే శివ కుమార్- సిద్ధరామయ్య మధ్య అంతర్గత పోరు కొనసాగుతుంది. అయితే, దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం సైతం రెండున్నరేళ్లు ఒకరు ఆ తర్వాత మరోకరు పదవీ తీసుకునేలా ఒప్పించారు. దీంతో ప్రస్తుతం డీకే శివ కుమార్ మనస్సులోని మాటలను బహిరంగంగా వ్యక్తం చేశాడు ఓ జైన సన్యాసి. సోమవారం హుబ్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో జైన సన్యాసి గుణధర్ నంది మహారాజ్ మాట్లాడుతూ.. నాకు రెండు కలలు ఉన్నాయి.. ఒకటి జైన డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేయడం, ఇంకోటి డీకే శివ కుమార్ ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు.
Read Also: Kanaka Durga Temple: దుర్గగుడి ప్రధాన అర్చకులు మృతి!
Also Read
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
- Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
ఇక, ఆ జైన సన్యాసి మాటలకు ప్రతిస్పందిస్తూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ఇలా అన్నారు.. మీరు ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు నేను ఏం చెప్పగలను?.. ఆయన చెప్పేది నేను నియంత్రించలేను.. ఎందుకంటే, అది అతని కోరిక అన్నారు. నాకు ఏం కావాలో అన్నీ నా పార్టీ నిర్ణయిస్తుంది.. నాకు పార్టీ ముఖ్యం దాని ఆదేశాల ప్రకారం పని చేస్తా.. నేను ఏ పోస్ట్ కోసం వెతకాల్సిన అవసరం లేదని వెల్లడించారు. అయితే, నిన్న బెళగావిలో కాంగ్రెస్ సదస్సు సందర్భంగా డీకే శివకుమార్ మద్దతుదారుల బల ప్రదర్శన చేశారు. కొప్పల్, హోసపేట, బళ్లారి, చిత్రదుర్గ్ సహా వివిధ ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు డిప్యూటీ సీఎం కోసం ర్యాలీగా అతడి చిత్రపటాలను పట్టుకుని నినాదాలు చేశారు.
Read Also: Top Headlines @1PM: టాప్ న్యూస్!
అలాగే, డీకే శివ కుమార్ ను కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించాలని ఆయన అభిమానులు కోరారు. డీకేకు సీఎం పదవీ ఇవ్వకపోతే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్థిరతను ఎదుర్కొంటుందని పార్టీలోని కొందరు మద్దతుదారులు హెచ్చరిస్తున్నారు. డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా చేయాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ స్పందించింది. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాయకత్వ మార్పులపై ఊహాగానాలు అణిచివేసేందుకు ప్రయత్నించారు.. కాంగ్రెస్ పార్టీ కోసం మేము అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాం.. ఎవర్ని నియమించాలి.. ఎప్పుడూ తొలగించాలో హైకమాండ్ తెలుసని ఖర్గే అన్నారు.
తాజావార్తలు
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!