Jairam Ramesh: పార్లమెంట్కి రూ.50,000 తీసుకెళ్లడం అసాధారణం కాదు..
- పార్లమెంట్కి రూ.50,000 తీసుకెళ్లడం అసాధారణం కాదు..
- రాజ్యసభలో డబ్బులు దొరికిన వివాదంపై కాంగ్రెస్ నేత జైరాంరమేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jairam Ramesh: కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన రాజ్యసభ సీటు వద్ద నుంచి రూ. 50,000 దొరకడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై సభ చైర్మన్ జగదీప్ ధంఖర్ విచారణకు ఆదేశించారు. అయితే, ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ శుక్రవారం స్పందించారు. సభలోకి రూ. 50,000 నగదును తీసుకెళ్లడం అసాధారణం లేదా అనుమానాస్పదంగా లేదని ఆయన అన్నారు. బీజేపీకి చెందిన ఎంపీలు, ఇతర ఎంపీలు కూడా పార్లమెంట్కి ఇదే మొత్తాన్ని తీసుకెళ్లినట్లు అంగీకరించారు.
Read Also: Pushpa 2: ఇంకెక్కడి బాహుబలి, RRR.. రికార్డులన్నీ రప రపే!
Also Read
మను సింఘ్వీ పేరును తీసుకురావడం తప్పు, సాయంత్రం 6 గంటల తర్వాత సభలో సోదాలు జరిగాయి, డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి..? దర్యాప్తు చేస్తే విషయం స్పష్టంగా తెలుస్తుందని ఆయన అన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని, దర్యాప్తు నుంచి తాము తప్పించుకోవడం లేదని, ఇది ప్రభుత్వ కుట్రగా ఆయన అభివర్ణించారు.
బీజేపీ ఎంపీలతో సహా 5-6 మందితో తాను అంతకుముందు రోజు మాట్లాడానని, వారు రూ. 50,000 చూపించారని జైరాం రమేష్ అన్నారు. ఎవరైనా జేబులో రూ. 50 వేలు ఉంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదని చెప్పారు. అయితే, ఈ ఆరోపణల్ని సింఘ్వీ తోసిపుచ్చారు. ఈ సంఘటన గురించి తనకు తెలియదని, పార్లమెంట్కి హాజరయ్యేటప్పుడు సాధారణంగా తాను రూ. 500 మాత్రమే తీసుకెళ్తానని చెప్పారు. దర్యాప్తు పూర్తికాకముందే సింఘ్వీ పేరును చైర్మన్ ధంఖర్ బయటపెట్టారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
తాజావార్తలు
-
PeddiTrailer : ‘పెద్ది’ పెద్దగా మెప్పిచలేకపోయాడా? రెహమాన్ దెబ్బేసాడా?
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!