Jairam Ramesh: పార్లమెంట్కి రూ.50,000 తీసుకెళ్లడం అసాధారణం కాదు..
- పార్లమెంట్కి రూ.50,000 తీసుకెళ్లడం అసాధారణం కాదు..
- రాజ్యసభలో డబ్బులు దొరికిన వివాదంపై కాంగ్రెస్ నేత జైరాంరమేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jairam Ramesh: కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన రాజ్యసభ సీటు వద్ద నుంచి రూ. 50,000 దొరకడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై సభ చైర్మన్ జగదీప్ ధంఖర్ విచారణకు ఆదేశించారు. అయితే, ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ శుక్రవారం స్పందించారు. సభలోకి రూ. 50,000 నగదును తీసుకెళ్లడం అసాధారణం లేదా అనుమానాస్పదంగా లేదని ఆయన అన్నారు. బీజేపీకి చెందిన ఎంపీలు, ఇతర ఎంపీలు కూడా పార్లమెంట్కి ఇదే మొత్తాన్ని తీసుకెళ్లినట్లు అంగీకరించారు.
Read Also: Pushpa 2: ఇంకెక్కడి బాహుబలి, RRR.. రికార్డులన్నీ రప రపే!
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
మను సింఘ్వీ పేరును తీసుకురావడం తప్పు, సాయంత్రం 6 గంటల తర్వాత సభలో సోదాలు జరిగాయి, డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి..? దర్యాప్తు చేస్తే విషయం స్పష్టంగా తెలుస్తుందని ఆయన అన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని, దర్యాప్తు నుంచి తాము తప్పించుకోవడం లేదని, ఇది ప్రభుత్వ కుట్రగా ఆయన అభివర్ణించారు.
బీజేపీ ఎంపీలతో సహా 5-6 మందితో తాను అంతకుముందు రోజు మాట్లాడానని, వారు రూ. 50,000 చూపించారని జైరాం రమేష్ అన్నారు. ఎవరైనా జేబులో రూ. 50 వేలు ఉంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదని చెప్పారు. అయితే, ఈ ఆరోపణల్ని సింఘ్వీ తోసిపుచ్చారు. ఈ సంఘటన గురించి తనకు తెలియదని, పార్లమెంట్కి హాజరయ్యేటప్పుడు సాధారణంగా తాను రూ. 500 మాత్రమే తీసుకెళ్తానని చెప్పారు. దర్యాప్తు పూర్తికాకముందే సింఘ్వీ పేరును చైర్మన్ ధంఖర్ బయటపెట్టారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
తాజావార్తలు
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!