Cakes: “కేక్”లలో క్యాన్సర్ కారక పదార్థాలు.. కర్ణాటక ప్రభుత్వం హెచ్చరిక..
- కేకులలో క్యాన్సర్ కారక పదార్థాలు..
- హెచ్చరించిన కర్ణాటక ప్రభుత్వం..
- కృత్రిమ రంగుల్ని అతిగా వాడొద్దని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cakes: కొన్ని కేక్లలో ‘‘క్యాన్సర్’’ కారక పదార్థాలు ఉండే అవకాశం ఉందని కర్ణాటక ఆహార భద్రత-నాణ్యత విభాగం హెచ్చరికలు జారీ చేసింది. రెండు నెలల క్రితం కబాబ్లు, మంచూరియన్, పానీ పూరీలతో సహా రాష్ట్రంలోని కొన్ని స్ట్రీట్ ఫుడ్ శాంపిల్స్లో కార్సినోజెన్స్ అని పిలువబడే క్యాన్సర్ కారక పదార్ధాల ఉనికిపై ఆహార భద్రతా విభాగం ఇదే విధమైన ఆందోళనల్ని లేవనెత్తింది. తాజాగా కేకుల్లో కూడా కార్సినోజెన్స్ ఉండే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది.
ఆగస్టులో 235 కేక్ శాంపిళ్లను విశ్లేషించింది. ఇందులో 223 సురక్షితమే అని, అయితే 12 కేకుల్లో ఆర్టిఫిషియల్ కలర్స్ ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లు డిపార్ట్మెంట్ తెలిపింది. కేకుల్లో ఉపయోగించి కృత్రిమ రంగులైన అల్లూరా రెడ్, సన్సెట్ ఎల్లో ఎఫ్సిఎఫ్, పోన్సీయు 4ఆర్ (స్ట్రాబెర్రీ రెడ్), టార్ట్రాజైన్ (నిమ్మ పసుపు), కార్మోయిసిన్ (మెరూన్) వాటిని సురక్షితమైన స్థాయికి మించి ఉపయోగిస్తే క్యాన్సర్ ప్రమాదాలు పెరుగుతాయని హెచ్చరించింది. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయొచ్చని తెలిపింది.
Also Read
- PM Modi: మరో రికార్డ్ దిశగా మోడీ.. 7 రోజుల్లో సరికొత్త చరిత్ర
- Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే..
- Mamata Banerjee: "అప్పటి వరకు నేను చావను".. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
- Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
Read Also: Thalapathy 69: గ్రాండ్ గా మొదలైన దళపతి విజయ్ చివరి సినిమా
ముఖ్యంగా ‘‘రెడ్ వెల్వెట్’’, ‘‘బ్లాక్ ఫారెస్ట్’’ వంటి ప్రసిద్ధమైన కేకులు తరుచుగా వైబ్రెంట్ కలర్స్తో తయారవుతాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరించారు. బేకరీలు కేకుల తయారీలో భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు. ఈ రసాయనాలు తక్కువగా వినియోగిస్తే బాగానే ఉంటాయి, కానీ ఎక్కువగా వాడితే మాత్రం ప్రమాదమే అని నిపుణులు చెబుతున్నారు. కేకులు మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు వీటిని అధిక మొత్తాల్లో వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రకృతిలో లేని రంగురంగుల టొమాటోలను, అతిగా మెరిసే యాపిల్లను ప్రజలు కోరుకుంటున్నారు. ఇలా ఆకర్షించేందుకు వాటికి కృత్రిమ రంగులు వినియోగిస్తున్నారు. చాలా వరకు ప్యాక్ చేసిన ఆహారంలో టైటానియం డయాక్సైడ్ ఉంటుంది, దీనిని భారత్లో అనుమతించారు, కానీ యూరప్, ఇతత మిడిల్ ఈస్ట్ దేశాల్లో దీనిపై నిషేధం ఉందని ఆహార నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
PM Modi: మరో రికార్డ్ దిశగా మోడీ.. 7 రోజుల్లో సరికొత్త చరిత్ర
-
Janhvi Kapoor: ‘స్టార్ కిడ్ అనే అహంకారం అస్సలు లేదు’.. ‘పెద్ది’ హీరోయిన్ రియల్ క్యారెక్టర్ను బయటపెట్టిన బుచ్చిబాబు!
-
CM Chandrababu: గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష.. పవన్ కల్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం..
-
Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే..
-
Pawan Kalyan : గద్దరన్న విగ్రహం ఏపీలో పెట్టిస్తా
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!