West Bengal: దుర్గాపూజా మండపాలపై దాడులు.. డీజీపీ నుంచి నివేదిక కోరిన హైకోర్టు..
- దుర్గాపూజ మండపాలపై దాడులు..
- డీజీపీ నుంచి నివేదిక కోరిన కలకత్తా హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: వెస్ట్ బెంగాల్లో దుర్గాపూజ సందర్భంగా పలు మండపాలపై దాడులు జరిగాయి. దీనిపై కలకత్తా హైకోర్టు రాష్ట్ర డీజీపీ నుంచి నివేదిక కోరింది. వివిధ జిల్లాల్లో దుర్గాపూజ సందర్భంగా జరిగిన సంఘటనలు, వారు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు డీజీపీకి నివేదిక సమర్పించాలని జస్టిస్ హిరణ్మోయ్ భట్టాచార్య నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ ఆదేశించింది. డీజీపీ అన్ని నివేదికను పరిశీలించి, ఫైనల్ రిపోర్టుని హైకోర్టుకు సమర్పిస్తారు. నవంబర్ 14న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక సమర్పించాలి.
విశ్వహిందూ పరిషత్ నదియా జిల్లా శాఖ అధ్యక్షురాలు రీతూ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం విచారించింది. కోల్కతాలోని గార్డెన్ రీచ్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో దుర్గాపూజ పండల్పై జరిగిన దాడులపై పారదర్శక దర్యాప్తునకు ఆదేశించాలని రితూ పిటిషన్లో కోర్టును కోరారు. దర్యాప్తు బాధ్యతను రాష్ట్ర ఏజెన్సీలకు బదులు స్వతంత్ర సంస్థకు అప్పగించాలని సింగ్ కోర్టును ఆశ్రయించారు.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
Read Also: Diwali 2024: కేరళతోపాటు దేశంలోని ఈ ప్రాంతాల్లో దీపావళి జరుపుకోరు.. ఎందుకో తెలుసా?
ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం తరుపున హాజరైన అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ.. దుర్గాపూజ మండపాల వద్ద జరిగిన అనేక దాడుల సంఘటనలు పిటిషన్ పేర్కొన్నప్పటికీ, రీతూ సింగ్ ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. నివేదిక సమర్పించేందుకు కోర్టు నుంచి సమయం కోరాడు. అయితే, దుర్గా నవరాత్రుల సమయంలో బెంగాల్లోని వివిధ జిల్లాలో జరిగిన అనేక దాడుల గురించి రీతూ సింగ్ తరుపు న్యాయవాది ప్రస్తావించారు. గార్డెన్ రీచ్ ప్రాంతంలో దుర్గా మండపంపై దుండగులు దాడి చేశారని, కోచ్బెహార్లోని శీతాల్ కుచి, హౌరాలోని శ్యాంపూర్ మరియు నదియా జిల్లాలోని విగ్రహాలను ధ్వంసం చేశారని ఆయన చెప్పారు.
అయితే, విచారణను ఎందుకు బదిలీ చేయాలని పిటిషనర్ తరుపు న్యాయవాదిని జస్టిస్ భట్టాచార్య ప్రశ్నించారు. దీనికి లాయర్ స్పందిస్తూ.. రాష్ట్ర పోలీసులు విఫలమయ్యారని, ఈ విచారణని రాష్ట్రంలో చేయలేమని చెప్పారు. ఈ సంఘటన కోల్కతాతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రదేశాల్లో జరిగాయని, రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తే నిష్పాక్షిక దర్యాప్తు ఉందని చెప్పారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!