Amit Shah: సీఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదు.. వెనక్కితీసుకునే ప్రసక్తే లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ప్రతిపక్షాలు అబద్ధాల రాజకీయాలను ఆశ్రయిస్తున్నాయని మండిపడ్డారు. దేశంలోని మైనారిటీలు భయపడాల్సిన పని లేదని, ఎందుకంటే ఇది ఏ పౌరుడి హక్కులను వెనక్కి తీసుకోదని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన మరోసారి స్పష్టం చేశారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కి వచ్చిదిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రిస్టియన్లతో సహా ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వాన్ని అందించడమే సీఏఏ లక్ష్యమని చెప్పారు.
ముస్లింలకు భారతదేశంలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుని హక్కు ఉందని అయితే, ఈ చట్టం మాత్రం ఆయా దేశాల్లో పీడించబడుతున్న మైనారిటీల కోసమని చెప్పారు. సీఏఏకి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమైతే ప్రభుత్వం దీనిపై పునరాలోచించవచ్చా..? అనే ప్రశ్నకు సమాధానంగా, సీఏఏని ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని అమిత్ షా చెప్పారు. తాము అధికారంలోకి రాగానే సీఏఏని రద్దు చేస్తామని కాంగ్రెస్ చెబుతున్న దానిపై వ్యాఖ్యానిస్తూ.. ఎలాగూ ఇండియా కూటమి అధికారంలోకి రాదని తెలుసని ఎద్దేవా చేశారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Read Also: Pratibha Patil: జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో ఇబ్బంది.. ఆస్పత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి
సీఏఏపై బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలను సృష్టిస్తోందని ప్రతిపక్షాల ఆరోపణలపై అమిత్ షా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు వేరే పనిలేదని దుయ్యబట్టారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం కూడా మా రాజకీయ ప్రయోజనాల కోసమే అని ప్రతిపక్షాలు చెబుతున్నాయి, ఆర్టికల్ 370 తొలగిస్తామని 1950 నుంచి చెబుతున్నామని అమిత్ షా చెప్పారు. సీఏఏ నోటిఫికేషన్ వెలువడే సమయంపై ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించగా, అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ సహా ప్రతిపక్షాలన్నీ అబద్ధాల రాజకీయాలు చేస్తున్నాయని షా అన్నారు. ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలు చేయాలని, తమ ఓటు బ్యాంకును ఏకీకృతం చేయాలని అనుకుంటున్నాయని అమిత్ షా మండిపడ్డారు.
అరవింద్ కేజ్రీవాల్ విమర్శల గురించి మాట్లాడుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అవినీతి బయటపడిన తర్వాత నుంచి ప్రశాంతత కోల్పోతున్నారని అన్నారు. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం వల్ల దొంగతనాలు, అత్యాచారాలు పెరుగుతాయని కేజ్రీవాల్ ప్రకటనపై మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులు, రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడరని, వారిని ఎందుకు వ్యతిరేకించరని అమిత్ షా ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురించి మాట్లాడుతూ.. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే రోజు దగ్గరలోనే ఉందని, చొరబాట్లను ఆపుతామని అన్నారు. మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ చొరబాట్లను అనుమతిస్తే దేశ భద్రత సమస్య ఎదుర్కొంటుందని, ఆమెకు శరణార్థులకు, చొరబాటుదారులకు తేడా తెలియదని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!