CAA: సీఏఏ మతపర వివక్ష చూపిస్తోంది.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అసహనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CAA: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు సంబంధించి పలు అంతర్జాతీయ సంస్థలు తప్పుబడుతున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్తో పాటు ఐక్యరాజ్యసమితి, అమెరికాలు దీనిపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. భారత్ తీసుకువచ్చిన సీఏఏ సమానత్వం, మతపరమైన వివక్షత, భారతదేశ అంతర్జాతీయ మానవహక్కుల బాధ్యతలకు అసంబద్ధమని, రాజ్యాంగ విలువలకు దెబ్బగా అభివర్ణించింది. ‘‘పౌరసత్వ సవరణ చట్టం అనేది మతం ఆధారంగా వివక్షను చూపిస్తోందని, ఇది మతోన్మాద చట్టం అని, దీనిని అమలు చేయకూడదు. దేశవ్యాప్తంగా ప్రజలు, పౌర సమాజం, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు మరియు ఐక్యరాజ్యసమితి నుండి CAAని విమర్శించే అనేక స్వరాలను వినడంలో భారత అధికారులు విఫలమయ్యారు’’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రతినిధి ఆకర్ పటేల్ అన్నారు.
Read Also: Anupama Parameswaran: కలువ పువ్వు లాంటి కళ్ళతో మాయచేస్తున్న అనుపమ పరమేశ్వరన్..
Also Read
- PM Modi: ఆస్ట్రేలియా టూర్ ముందు మోడీకి బెదిరింపులు.. ఫేస్బుక్ ఐడీ ఎక్కడదంటే..!
- Om Birla: ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరించాలి
- Success Story: బీటెక్లో 24 బ్యాక్లాగ్స్.. కట్ చేస్తే ఐపీఎస్ అధికారి.. అతడి సక్సెస్ రహస్యం ఇదే..
- E20 petrol: భారత ‘‘E20 పెట్రోల్’’ను తిరస్కరించిన భూటాన్.. అసలు కారణం ఇదే..
మరోవైపు ఐక్యరాజ్యసమితి(UN)..ఇది ప్రాథమికంగా వివక్షతతో కూడిన స్వభావం అని వర్ణించింది. యూఎన్ మానవహక్కుల హైకమీషనర్ కార్యాలయ ప్రతినిధి మాట్లాడుతూ.. మేము 2019లో సీఏఏ వివక్షతతో కూడి స్వభావం కలిగినదని, భారతదేశం అంతర్జాతీయ మానవహక్కలను బాధ్యతలను ఉల్లంఘిస్తోదని ఆందోళన చెందుతున్నామని అన్నారు. ఈ చట్టం అంతర్జాతీయ మానవహక్కుల చట్టానికి లోబడి ఉందో లేదో తమ కార్యాలయం అధ్యయనం చేస్తోందని అధికారి తెలిపారు. అమెరికా కూడా ఈ చట్టంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ చట్టం ఎలా అమలు చేయబడుతుందో మేము నిశితంగా పరిశీలిస్తున్నామని స్టేట్ డిపార్ట్మెంట్ స్పోక్పర్సన్ రాయిటర్స్తో చెప్పారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మతపరమైన హింసను ఎదుర్కొంటూ భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు, బౌద్ధులు ఇలా ముస్లిమేతర మతాల వారికి భారత పౌరసత్వాన్ని అందించేందుక సీఏఏ ఉద్దేశింపబడింది. డిసెంబర్ 31, 2014కి ముందు వచ్చిన వారికి ఈ చట్టం కింద పౌరసత్వం అందించనున్నారు. అయితే, ముస్లింలకు ఎందుకు ఈ చట్టాన్ని అమలు చేయరని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో, మూడు దేశాల్లో మైనారిటీలుగా ఉన్న వారు, అణిచివేతకు గురైన వారి కోసమే ఈ చట్టం తీసుకువచ్చామని అమిత్ షా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : మిడ్జిల్ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం.. నాడు మీరు నాటిన మొక్కే.. నేడు సీఎంగా..
-
Tata Motors: మారుతిని వెనక్కి నెట్టిన టాటా పంచ్.. జూన్లో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే!
-
Sachin Tendulkar: టీ20ల్లో వైభవ్ సరికొత్త చరిత్ర.. కానీ సచిన్కి చెందిన ఈ రికార్డులను తాకడం అంత ఈజీ కాదు!
-
First Match: వైభవ్ కాదు.. చిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది ఎవరో తెలుసా..?
-
PM Modi: ఆస్ట్రేలియా టూర్ ముందు మోడీకి బెదిరింపులు.. ఫేస్బుక్ ఐడీ ఎక్కడదంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..