CAA: సీఏఏ మతపర వివక్ష చూపిస్తోంది.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అసహనం..
CAA: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు సంబంధించి పలు అంతర్జాతీయ సంస్థలు తప్పుబడుతున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్తో పాటు ఐక్యరాజ్యసమితి, అమెరికాలు దీనిపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. భారత్ తీసుకువచ్చిన సీఏఏ సమానత్వం, మతపరమైన వివక్షత, భారతదేశ అంతర్జాతీయ మానవహక్కుల బాధ్యతలకు అసంబద్ధమని, రాజ్యాంగ విలువలకు దెబ్బగా అభివర్ణించింది. ‘‘పౌరసత్వ సవరణ చట్టం అనేది మతం ఆధారంగా వివక్షను చూపిస్తోందని, ఇది మతోన్మాద చట్టం అని, దీనిని అమలు చేయకూడదు. దేశవ్యాప్తంగా ప్రజలు, పౌర సమాజం, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు మరియు ఐక్యరాజ్యసమితి నుండి CAAని విమర్శించే అనేక స్వరాలను వినడంలో భారత అధికారులు విఫలమయ్యారు’’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రతినిధి ఆకర్ పటేల్ అన్నారు.
Read Also: Anupama Parameswaran: కలువ పువ్వు లాంటి కళ్ళతో మాయచేస్తున్న అనుపమ పరమేశ్వరన్..
Also Read
- May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
- West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
- Mamata Banerjee: బీహార్, మహారాష్ట్ర కాదు.. ఇది బెంగాల్.. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ విమర్శలు
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
మరోవైపు ఐక్యరాజ్యసమితి(UN)..ఇది ప్రాథమికంగా వివక్షతతో కూడిన స్వభావం అని వర్ణించింది. యూఎన్ మానవహక్కుల హైకమీషనర్ కార్యాలయ ప్రతినిధి మాట్లాడుతూ.. మేము 2019లో సీఏఏ వివక్షతతో కూడి స్వభావం కలిగినదని, భారతదేశం అంతర్జాతీయ మానవహక్కలను బాధ్యతలను ఉల్లంఘిస్తోదని ఆందోళన చెందుతున్నామని అన్నారు. ఈ చట్టం అంతర్జాతీయ మానవహక్కుల చట్టానికి లోబడి ఉందో లేదో తమ కార్యాలయం అధ్యయనం చేస్తోందని అధికారి తెలిపారు. అమెరికా కూడా ఈ చట్టంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ చట్టం ఎలా అమలు చేయబడుతుందో మేము నిశితంగా పరిశీలిస్తున్నామని స్టేట్ డిపార్ట్మెంట్ స్పోక్పర్సన్ రాయిటర్స్తో చెప్పారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మతపరమైన హింసను ఎదుర్కొంటూ భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు, బౌద్ధులు ఇలా ముస్లిమేతర మతాల వారికి భారత పౌరసత్వాన్ని అందించేందుక సీఏఏ ఉద్దేశింపబడింది. డిసెంబర్ 31, 2014కి ముందు వచ్చిన వారికి ఈ చట్టం కింద పౌరసత్వం అందించనున్నారు. అయితే, ముస్లింలకు ఎందుకు ఈ చట్టాన్ని అమలు చేయరని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో, మూడు దేశాల్లో మైనారిటీలుగా ఉన్న వారు, అణిచివేతకు గురైన వారి కోసమే ఈ చట్టం తీసుకువచ్చామని అమిత్ షా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
-
Shruti Haasan : హీరోయిన్గా కంటే ఐటంగర్ల్గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి
-
AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
-
Jason Holder: కేజీ నా దగ్గరే ఉన్నాడు.. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్పై స్పందించిన హోల్డర్!
-
Veggie Frittata Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. లంచ్ బాక్స్లోకి కమ్మని ‘వెజ్జీ ఫ్రిటాటా’.. తింటే పిల్లలు అస్సలు వదలరు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!