Adani: భారత్కు శాంతి విలువేంటో తెలుసు.. త్రివిధ దళాలపై అదానీ ప్రశంసలు
- భారత్కు శాంతి విలువేంటో తెలుసు
- త్రివిధ దళాలపై అదానీ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్, అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ గుర్తుచేసుకున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్కు శాంతి విలువ ఏంటో తెలుసు అని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సాయుధ దళాలకు అదానీ సెల్యూట్ చేశారు. అలాగే అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఇక అమెరికా లంచం ఆరోపణలను ఆయన ఖండించారు.
ఇది కూడా చదవండి: Chicken : చికెన్ స్కిన్ తింటే ప్రమాదమే.. ఈ ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్త!
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
ఇక ఆపరేషన్ సిందూర్లో అదానీ డిఫెన్స్ డ్రోన్లు కూడా భాగమయ్యాయని తెలిపారు. విజయం సాధించినట్లు చెప్పుకొచ్చారు. యాంటీ డ్రోన్ వ్యవస్థలు మన దళాలను, పౌరులను రక్షించడంలో సహాయపడ్డాయని చెప్పారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో మన బలగాలు అత్యంత ధైర్యసాహసాలు కనబరిచాయని కొనియాడారు. పేరు, ప్రతిష్టలు, పతకాల కోసం కాకుండా విధి నిర్వహణలో భాగంగా పనిచేశారని ప్రశంసించారు. శాంతి విలువ ఏంటో భారత్కు బాగా తెలుసు అని.. అలా అని ఎవరైనా మనకు హాని కలిగించాలని చూస్తే.. వారి భాషలో ఎలా స్పందించాలో కూడా బాగా తెలుసు అని అదానీ పేర్కొన్నారు. అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: పోటీ చేసే దమ్ముందా?.. పవన్ కల్యాణ్కు మంత్రి సవాల్!
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాదులు చెలరేగిపోయారు. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. స్త్రీలను, పిల్లలను వదిలిపెట్టి భర్తలను చంపేశారు. పదుల కొద్ది గాయపడ్డారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం.. పాకిస్థాన్పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇక మే 7న పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొత్తానికి పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.
తాజావార్తలు
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!