Bombay High Court: దేశ సమస్యలు వద్దు కానీ, “గాజా” కావాలా.? సీపీఎం పార్టీపై హైకోర్టు ఆగ్రహం..
- సీపీఎం ‘‘గాజా ర్యాలీ’’ పిటిషన్ తిరస్కరించిన బాంబే హైకోర్టు..
- పాలస్తీనా విషయాలు వద్దు, దేశ సమస్యలు పట్టించుకోండి..
- దేశభక్తులుగా ఉండండి అంటూ ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: పాలస్తీనా గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా ముంబైలోని ఆజాద్ మైదాన్లో నిరసనకు అనుమతి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. జస్టిస్ రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖద్లతో కూడిన ధర్మాసనం పిటిషన్ను తిరస్కరిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టే బదులు, సీపీఎం భారతదేశంలోని సమస్యలపై దృష్టి పెట్టాలని కోరింది. ‘‘మనదేశంలో తగినన్ని సమస్యలు ఉన్నాయి. మనకు ఇలాంటివ వద్దు. మీరు చిన్న దృష్టితో చూస్తున్నారని చెప్పడానికి బాధగా ఉంది. మీరు గాజా, పాలస్తీనా సమస్యలను చూస్తున్నారు. మీ సొంత దేశాన్ని చూడండి. దేశభక్తులుగా ఉండండి. ఇది దేశభక్తి అనిపించుకోదు.’’ అని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Also Read
- CM Vijay: 20 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం.. మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు
- Gurugram: గురుగ్రామ్పై జలఖడ్గం.. 10 కి.మీ ట్రాఫిక్ జామ్.. ఎటుచూసినా నీళ్లే
- Bihar: ప్రశాంత్ కిషోర్కు పోటీగా బీజేపీ నుంచి అభిషేక్ కుమార్.. బంకీపూర్ బైపోల్స్లో టఫ్ ఫైట్
- Wayanad: వయనాడ్లో కొండచరియలు బీభత్సం.. నలుగురు మృతి.. వీడియో వైరల్
Read Also: Asim Munir: పరువు పోయిందిగా.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్పై చైనా ఆగ్రహం..
‘‘మీరు భారతదేశంలో నమోదైన ఒక సంస్థ. చెత్త డంపింగ్, కాలుష్యం, మురుగునీరు, వరదలు వంటి సమస్యలను చేపట్టాలి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీటిపై మీరు పోరాటం చేయడం లేదు కానీ వేల మైళ్ల దూరంలోని వేరే దేశం కోసం పోరాడుతున్నారు’’ అని సీపీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. దేశ విదేశాంగ విధానం సీపీఎం తీసుకున్న వైఖరిని భిన్నంగా ఉందని హైకోర్టు గమనించింది. ఇలాంటి నిరసనలు దౌత్యపరమైన పరిణామాలకు దారి తీస్తాయని హెచ్చరించింది.
‘‘పాలస్తీనా, ఇజ్రాయిల్ వైపు ఉండటం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో మీకు తెలియదు. మీరు ఎందుకు దీన్ని చేయాలనుకుంటున్నారు..? ఇది దేశ విదేశాంగ వ్యవహారాలకు ఎలాంటి నష్టం చేస్తుందో మీకు అర్థం కావడం లేదు’’ అని ధర్మాసనం హెచ్చరించింది. భారత విదేశాంగ విధానంపై ఆందోళనలను చూపుతూ, గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా ఆజాద్ మైదాన్లో నిరసన నిర్వహించడానికి ఆల్ ఇండియా సాలిడారిటీ ఆర్గనైజేషన్ దాఖలు చేసిన దరఖాస్తును జూన్ 17న ముంబై పోలీసులు తిరస్కరించారు. సీపీఎం హైకోర్టులో తిరస్కరణను సవాల్ చేసింది.
సీపీఎం తరుపున హాజరైన సీనియర్ న్యాయవాది మిహిర్ దేశాయ్ మాట్లాడుతూ.. పోలీసులు భారత విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా ఉందని, శాంతిభద్రతలకు దారి తీయచ్చనే కారణాలతో పోలీసులు అనుమతి నిరాకరించారని కోర్టు దృష్టి తెచ్చారు. అయినప్పటికీ, ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని వాదించారు. ప్రభుత్వం వాదనలు కూడా విన్న కోర్టు సీపీఎం పిటిషన్ని తిరస్కరించింది.
తాజావార్తలు
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!