Bombay High Court: దేశ సమస్యలు వద్దు కానీ, “గాజా” కావాలా.? సీపీఎం పార్టీపై హైకోర్టు ఆగ్రహం..
- సీపీఎం ‘‘గాజా ర్యాలీ’’ పిటిషన్ తిరస్కరించిన బాంబే హైకోర్టు..
- పాలస్తీనా విషయాలు వద్దు, దేశ సమస్యలు పట్టించుకోండి..
- దేశభక్తులుగా ఉండండి అంటూ ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: పాలస్తీనా గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా ముంబైలోని ఆజాద్ మైదాన్లో నిరసనకు అనుమతి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. జస్టిస్ రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖద్లతో కూడిన ధర్మాసనం పిటిషన్ను తిరస్కరిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టే బదులు, సీపీఎం భారతదేశంలోని సమస్యలపై దృష్టి పెట్టాలని కోరింది. ‘‘మనదేశంలో తగినన్ని సమస్యలు ఉన్నాయి. మనకు ఇలాంటివ వద్దు. మీరు చిన్న దృష్టితో చూస్తున్నారని చెప్పడానికి బాధగా ఉంది. మీరు గాజా, పాలస్తీనా సమస్యలను చూస్తున్నారు. మీ సొంత దేశాన్ని చూడండి. దేశభక్తులుగా ఉండండి. ఇది దేశభక్తి అనిపించుకోదు.’’ అని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Also Read
- Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
- Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
- Pak ISI: తప్పిన పెను ప్రమాదం.. పాకిస్తాన్ ISI ఉగ్రవాద ముఠాను పట్టుకున్న పోలీసులు..
- India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
Read Also: Asim Munir: పరువు పోయిందిగా.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్పై చైనా ఆగ్రహం..
‘‘మీరు భారతదేశంలో నమోదైన ఒక సంస్థ. చెత్త డంపింగ్, కాలుష్యం, మురుగునీరు, వరదలు వంటి సమస్యలను చేపట్టాలి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీటిపై మీరు పోరాటం చేయడం లేదు కానీ వేల మైళ్ల దూరంలోని వేరే దేశం కోసం పోరాడుతున్నారు’’ అని సీపీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. దేశ విదేశాంగ విధానం సీపీఎం తీసుకున్న వైఖరిని భిన్నంగా ఉందని హైకోర్టు గమనించింది. ఇలాంటి నిరసనలు దౌత్యపరమైన పరిణామాలకు దారి తీస్తాయని హెచ్చరించింది.
‘‘పాలస్తీనా, ఇజ్రాయిల్ వైపు ఉండటం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో మీకు తెలియదు. మీరు ఎందుకు దీన్ని చేయాలనుకుంటున్నారు..? ఇది దేశ విదేశాంగ వ్యవహారాలకు ఎలాంటి నష్టం చేస్తుందో మీకు అర్థం కావడం లేదు’’ అని ధర్మాసనం హెచ్చరించింది. భారత విదేశాంగ విధానంపై ఆందోళనలను చూపుతూ, గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా ఆజాద్ మైదాన్లో నిరసన నిర్వహించడానికి ఆల్ ఇండియా సాలిడారిటీ ఆర్గనైజేషన్ దాఖలు చేసిన దరఖాస్తును జూన్ 17న ముంబై పోలీసులు తిరస్కరించారు. సీపీఎం హైకోర్టులో తిరస్కరణను సవాల్ చేసింది.
సీపీఎం తరుపున హాజరైన సీనియర్ న్యాయవాది మిహిర్ దేశాయ్ మాట్లాడుతూ.. పోలీసులు భారత విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా ఉందని, శాంతిభద్రతలకు దారి తీయచ్చనే కారణాలతో పోలీసులు అనుమతి నిరాకరించారని కోర్టు దృష్టి తెచ్చారు. అయినప్పటికీ, ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని వాదించారు. ప్రభుత్వం వాదనలు కూడా విన్న కోర్టు సీపీఎం పిటిషన్ని తిరస్కరించింది.
తాజావార్తలు
-
Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
-
Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
-
Vaibhav Sooryavanshi: వైభవ్తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
-
Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
-
Sugar Free Diet: చక్కెర పూర్తిగా మానేస్తే ఆరోగ్యానికే ప్రమాదమా..? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?