Asim Munir: పరువు పోయిందిగా.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్పై చైనా ఆగ్రహం..
- పాక్ ఆర్మీ చీఫ్ మునీర్పై చైనా ఆగ్రహం..
- పాకిస్తాన్లో చైనీయులు భద్రతపై ఆందోళన..
- అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్న పాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఆ దేశ ప్రధాని షహజాబ్ షరీఫ్ కన్నా ఎక్కువగా విదేశాల పర్యటిస్తున్నారు. తాజాగా, ఆయన చైనా పర్యటనకు వెళ్లారు. అయితే, మునీర్ తన బీజింగ్ పర్యటనలో చైనా చేతిలో చీవాట్లు తిన్నట్లు తెలుస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఆసిమ్ మునీర్ని నేరుగా మందలించిన పనిచేశారు. పాకిస్తాన్లో చైనా ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనీయుల భద్రత గురించి వాంగ్ యీ ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ వ్యాప్తంగా జరిగిన ఉగ్రవాద దాడుల్లో పలువురు చైనా జాతీయులు మరణించారు.
Read Also: Rahul Gandhi: ప్రధాని మోడీకి అంత సీను లేదు, మీడియా అతిగా చూపించింది..
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
అక్టోబర్ 2024లో, కరాచీ విమానాశ్రయం వెలుపల జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో ఇద్దరు చైనీస్ ఇంజనీర్లు మరణించారు. అదే సంవత్సరం మార్చిలో, ఉత్తర పాకిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో ఐదుగురు చైనా కార్మికులు మరణించారు. ఈ దాడులపై చైనా తన ఆందోళనల్ని వ్యక్తం చేస్తోంది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(CPEC)లోని అనేక ప్రాజెక్టుల్లో చైనా ఇంజనీర్లు, నిపుణులు పనిచేస్తున్నారు. అయితే, అక్కడి తాలిబాన్లు, బలూచిస్తాన్ రెబల్స్ వీరిని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు.
చైనా, పాకిస్తాన్ మధ్య సోదరభావం కాలపరీక్షలకు తట్టుకుని నిలబడిందని, రాయిలా దృఢంగా ఉందని మునీర్ అన్నారు. పాకిస్తాన్ సైన్యం చైనా పౌరులు భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మేలో భారత్ భంగపాటు గురైన తర్వాత, చైనాకు మొదటిసారిగా ఆసిమ్ మునీర్ వెళ్లారు. చైనాకు అన్ని విషయాల్లో పాకిస్తాన్ సహకరిస్తుందని మునీర్ పునరుద్ఘాటించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. ఫీల్డ్ మార్షల్ హోదా పొందినందకు ఆసిమ్ మునీర్ను అభినందించారు. పాకిస్తాన్ తమ ఉక్కు స్నేహితుడని, ఆల్-వెదర్ ఫ్రెండ్గా అభివర్ణించారు. పాకిస్తాన్కి చైనా తిరుగులేని మద్దతు ఇస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!