Bihar: బీహార్లో పడవ బోల్తా.. ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat capsizes in Bihar’s Katihar: బీహార్ రాష్ట్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ విషాదకర సంఘటన ఆదివారం రోజున కతిహార్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 10 మంది ఉంటే ఏడుగురు మరణించారు. మరో ముగ్గురు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారు. పడవలో ఉన్నవారంతా రైతులే అని తెలుస్తోంది. మరణించిన వారికి సీఎం నితీష్ కుమార్ రూ.4 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
ఆదివారం బరారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్ఘియా గ్రామసమీపంలోని బరాండీ నదిలో బోటు అకాస్మత్తుగా బోల్తా పడింది. ఈతగాళ్లు మొత్తం ఏడుగురు మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. స్థానికులతో పాటు ఎస్డీఆర్ఎఫ్ టీములు చనిపోయినవారి మృతదేహాలను నది నుంచి వెలికితీశారు. పడవలో ఉన్న వారంతా మర్గియా గ్రామానికి చెందిన పాశ్వాన్ తోలా వాసులుగా గుర్తించారు.
Also Read
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
- Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు 'ప్రతీక్ యాదవ్' మృతి..!
Read Also: Infosys: ఐటీ ఉద్యోగులకు మరోసారి నిరాశ.. కొత్త ఉద్యోగుల ఆన్బోర్డింగ్ వాయిదా వేసిన ఇన్ఫోసిస్
పడవలో ప్రయాణిస్తున్నవారంతా తమ పొలాల్లో పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. రైతులు తమ పొలం నుంచి వరిని పడవల్లో తెచ్చుకుంటున్నారు. పొలాల నుంచి గ్రామానికి వేరే మార్గం లేకపోవడంతో పడవల ద్వారానే పంటను తీసుకుస్తున్నారని.. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు.
అంతకుముందు రోజు శనివారం సీఎం నితీష్ కుమార్ కి ప్రమాదం తప్పింది. గంగా నదిలో స్టీమర్ లో ప్రయాణిస్తున్న సందర్భంలో స్టీమర్ పిల్లర్ ని ఢీకొట్టింది. దీంతో నితీష్ కుమార్ కు స్వల్పగాయాలు అయ్యాయి. ఛఠ్ పూజ సందర్భంగా గంగా నదిలో ఘాట్లను సందర్శించే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రతీ ఏడాది ఛఠ్ పూజ సందర్భంగా గంగానదిని సందర్శిస్తుంటారు సీఎం నితీష్ కుమార్. దీపావళి జరిగిన 6 రోజుల తర్వాత ఛఠ్ పూజలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 30 నుంచి ఈ పూజలు ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
-
CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
-
US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!