Infosys: ఐటీ ఉద్యోగులకు మరోసారి నిరాశ.. కొత్త ఉద్యోగుల ఆన్బోర్డింగ్ వాయిదా వేసిన ఇన్ఫోసిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infosys delays onboarding date again: కొత్తగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేరాలనుకునే యువతకు మరోసారి నిరాశే ఎదురైంది. ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త ఉద్యోగుల ఆన్బోర్డింగ్ తేదీని మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. గత నాలుగు నెలలుగా కొత్త ఉద్యోగులు చేరికను వాయిదా వేస్తూ వస్తోంది ఇన్ఫోసిస్. మొదటిసారిగా సెప్టెంబర్ 12, 2022 చేరిక తేదీని నిర్ణయించారు. ఆ తరువాత ప్రస్తుతం డిసెంబర్ 19, 2022కు మార్చారు. గత నాలుగు నెలల్లో నాలుగు సార్లు ఆన్బోర్డింగ్ తేదీని వాయిదా వేసింది.
దీంతో ఉద్యోగంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నవారు ఆందోళనకు గురువుతున్నారు. సెప్టెంబర్ 12, అక్టోబర్, నవంబర్ 28, డిసెంబర్ 19 ఇలా వాయిదాలు వేస్తూ పోతున్నారని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. చాలా మంది ఉద్యోగం, ఆదాయం లేకుండా ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కంపెనీ తమ ఆఫర్ లెటర్ క్యాన్సిల్ చేస్తారని చాలా మంది భయపడుతున్నారు. ఇటీవల కొత్తవారిని తీసుకున్న తరువాత టెక్ మహీంద్రా, విప్రో, వంటి కంపెనీలు ఆఫ్ లెటర్ రద్దు చేసుకున్నాయి. దీంతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారి భయాలు పెరుగుతున్నాయి.
Also Read
- Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
Read Also: PM Narendra Modi: ప్రధాని చేతుల మీదుగా డీబీయూల ప్రారంభం.. జాతికి అంకితం చేయనున్న మోదీ
అయితే ఐటీ కంపెనీలు మాత్రం మేము మా వ్యాపార అవసరాల ఆధారంగా డేట్ ఆఫ్ జాయినింగ్ కేటాయిస్తామని తెలిపుతున్నాయి. ఉద్యోగులు చేరికకు కనీసం 2-3 వారాల ముందు సమాచారాన్ని పంపిస్తామని చెబుతున్నాయి. గత మూడు నాలుగు నెలల క్రితం ఐటీ ఇండస్ట్రీలో ఫ్రెషర్లకు ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు వచ్చాయి. చాలా కంపెనీలు కొత్తవాళ్లను తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం ప్రపంచమాంద్యం ఏర్పడుతున్న ఈ పరిస్థితుల్లో కొత్త ఉద్యోగులను తీసుకునేందుకు కంపెనీలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్ దుర్వినియోగం చేస్తూ.. రెండు ఉద్యోగాలు చేసేవారికి వార్నింగ్ ఇస్తున్నాయి. మూన్ లైటింగ్ విధానంలో రెండు ఉద్యోగాలు చేసే వారిని గుర్తించిన ఇటీవల 300 మందిని తొలగించింది విప్రో. ఇతర కంపెనీలు కూడా విప్రో బాటలో నిడిచేందుకు సిద్దం అవుతున్నాయి.
తాజావార్తలు
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!