Infosys: ఐటీ ఉద్యోగులకు మరోసారి నిరాశ.. కొత్త ఉద్యోగుల ఆన్బోర్డింగ్ వాయిదా వేసిన ఇన్ఫోసిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infosys delays onboarding date again: కొత్తగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేరాలనుకునే యువతకు మరోసారి నిరాశే ఎదురైంది. ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త ఉద్యోగుల ఆన్బోర్డింగ్ తేదీని మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. గత నాలుగు నెలలుగా కొత్త ఉద్యోగులు చేరికను వాయిదా వేస్తూ వస్తోంది ఇన్ఫోసిస్. మొదటిసారిగా సెప్టెంబర్ 12, 2022 చేరిక తేదీని నిర్ణయించారు. ఆ తరువాత ప్రస్తుతం డిసెంబర్ 19, 2022కు మార్చారు. గత నాలుగు నెలల్లో నాలుగు సార్లు ఆన్బోర్డింగ్ తేదీని వాయిదా వేసింది.
దీంతో ఉద్యోగంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నవారు ఆందోళనకు గురువుతున్నారు. సెప్టెంబర్ 12, అక్టోబర్, నవంబర్ 28, డిసెంబర్ 19 ఇలా వాయిదాలు వేస్తూ పోతున్నారని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. చాలా మంది ఉద్యోగం, ఆదాయం లేకుండా ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కంపెనీ తమ ఆఫర్ లెటర్ క్యాన్సిల్ చేస్తారని చాలా మంది భయపడుతున్నారు. ఇటీవల కొత్తవారిని తీసుకున్న తరువాత టెక్ మహీంద్రా, విప్రో, వంటి కంపెనీలు ఆఫ్ లెటర్ రద్దు చేసుకున్నాయి. దీంతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారి భయాలు పెరుగుతున్నాయి.
Also Read
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
- Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
Read Also: PM Narendra Modi: ప్రధాని చేతుల మీదుగా డీబీయూల ప్రారంభం.. జాతికి అంకితం చేయనున్న మోదీ
అయితే ఐటీ కంపెనీలు మాత్రం మేము మా వ్యాపార అవసరాల ఆధారంగా డేట్ ఆఫ్ జాయినింగ్ కేటాయిస్తామని తెలిపుతున్నాయి. ఉద్యోగులు చేరికకు కనీసం 2-3 వారాల ముందు సమాచారాన్ని పంపిస్తామని చెబుతున్నాయి. గత మూడు నాలుగు నెలల క్రితం ఐటీ ఇండస్ట్రీలో ఫ్రెషర్లకు ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు వచ్చాయి. చాలా కంపెనీలు కొత్తవాళ్లను తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం ప్రపంచమాంద్యం ఏర్పడుతున్న ఈ పరిస్థితుల్లో కొత్త ఉద్యోగులను తీసుకునేందుకు కంపెనీలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్ దుర్వినియోగం చేస్తూ.. రెండు ఉద్యోగాలు చేసేవారికి వార్నింగ్ ఇస్తున్నాయి. మూన్ లైటింగ్ విధానంలో రెండు ఉద్యోగాలు చేసే వారిని గుర్తించిన ఇటీవల 300 మందిని తొలగించింది విప్రో. ఇతర కంపెనీలు కూడా విప్రో బాటలో నిడిచేందుకు సిద్దం అవుతున్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!