Devendra Fadnavis: ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ ఓటర్లకు ఇష్టం లేదు..
- ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ ఓటర్లకు నచ్చలేదు..
- ఓట్లు బదిలీ కాకపోవడంతోనే లోక్సభ ఎన్నికల్లో పరాజయం..
- అసెంబ్లీ ఎన్నికల్లో ఇది పునరావృతం కాదు..
- డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: 2024 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోర వైఫల్యంపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి ఓట్ల బదిలీ జరగకపోవడమే కారణమని గురువారం అన్నారు. ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ ప్రధాన ఓటర్లు ‘‘కోర్ వోటర్ బేస్’’కి నచ్చలేదని అన్నారు. అయితే, 80 శాతం మంది మాత్రం ఇప్పుడు అలాంటి రాజకీయాల్లో రాజీ అవసమని ఎన్నికల ద్వారా ఒప్పుకున్నారని ఆయన అన్నారు.
బీజేపీ, ఎన్సీపీ(అజిత్ పవార్), శివసేన(ఏక్నాథ్ షిండే) అధికార కూటమి మొత్తం మహారాష్ట్రలోని 48 లోక్సభస స్థానాల్లో కేవలం 17 స్థానాలను మాత్రమే గెలుచుకుంటి. 2019లో సొంతగా 23 ఎంపీ స్థానాలను సాధించిన బీజేపీ ఈ సారి 9 స్థానాలకే పరిమితమైంది.
Also Read
- E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
- Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
Read Also: Rachana Banerjee: ‘‘ క్వింటాల్ క్వింటాల్ వాటర్’’.. ఒకప్పటి తెలుగు హీరోయిన్, ఎంపీపై ట్రోలింగ్..
గత కొన్ని సార్వత్రిక ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో చెత్త ప్రదర్శన చేశామని, మేము 28 స్థానాల్లో పోటీ చేస్తే, చాలా తక్కువ సీట్లు వచ్చాయని అన్నారు. మేము 3 శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో 12 సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. 3000 -6000 తేడాలో ఓడిపోయామని అన్నారు. ఈ ఎన్నికల్లో షిండే 07, అజిత్ పవార్ 01 సీట్లనను గెలుచుకున్నాయి. రాష్ట్ర ఎన్నికల్లో ఇది పునరావృతం కాదని స్పష్టం చేశారు.
శివసేన తన ఓట్లను బీజేపీకి బదిలీ చేయడం సులభం, ఎందుకంటే రెండు పార్టీలు చాలా ఏళ్లుగా పొత్తులో ఉన్నాయని, మేం ఎప్పుడూ ఎన్సీపీకి వ్యతిరేకంగా పోటీ చేశామని, అందువల్ల ఆ ఓట్లను బదిలీ చేయడం కష్టమైందని అన్నారు. కానీ ఇప్పుడు రెండు పార్టీల ఓటర్ల బేస్ స్థిరపడిందని ఫడ్నవీస్ చెప్పారు. తమ కూటమి అవశ్యకతను కార్యకర్తలకు చెప్పి ఒప్పించామని, మా ఓటర్లలో కనీసం 80 శాతం మంది ఇప్పుడు ఎన్సీపీతో పొత్తును ఒప్పుకున్నారని అన్నారు. రాష్ట్రంలో 288 అసెంబ్లీ సీట్లలో పోటీ గురించి 80 శాతం చర్చలు ముగిశాయని అన్నారు. నవంబర్ నెలలో మహారాష్ట్ర ఎన్నికలు జరగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!