Devendra Fadnavis: ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ ఓటర్లకు ఇష్టం లేదు..
- ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ ఓటర్లకు నచ్చలేదు..
- ఓట్లు బదిలీ కాకపోవడంతోనే లోక్సభ ఎన్నికల్లో పరాజయం..
- అసెంబ్లీ ఎన్నికల్లో ఇది పునరావృతం కాదు..
- డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: 2024 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోర వైఫల్యంపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి ఓట్ల బదిలీ జరగకపోవడమే కారణమని గురువారం అన్నారు. ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ ప్రధాన ఓటర్లు ‘‘కోర్ వోటర్ బేస్’’కి నచ్చలేదని అన్నారు. అయితే, 80 శాతం మంది మాత్రం ఇప్పుడు అలాంటి రాజకీయాల్లో రాజీ అవసమని ఎన్నికల ద్వారా ఒప్పుకున్నారని ఆయన అన్నారు.
బీజేపీ, ఎన్సీపీ(అజిత్ పవార్), శివసేన(ఏక్నాథ్ షిండే) అధికార కూటమి మొత్తం మహారాష్ట్రలోని 48 లోక్సభస స్థానాల్లో కేవలం 17 స్థానాలను మాత్రమే గెలుచుకుంటి. 2019లో సొంతగా 23 ఎంపీ స్థానాలను సాధించిన బీజేపీ ఈ సారి 9 స్థానాలకే పరిమితమైంది.
Also Read
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
Read Also: Rachana Banerjee: ‘‘ క్వింటాల్ క్వింటాల్ వాటర్’’.. ఒకప్పటి తెలుగు హీరోయిన్, ఎంపీపై ట్రోలింగ్..
గత కొన్ని సార్వత్రిక ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో చెత్త ప్రదర్శన చేశామని, మేము 28 స్థానాల్లో పోటీ చేస్తే, చాలా తక్కువ సీట్లు వచ్చాయని అన్నారు. మేము 3 శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో 12 సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. 3000 -6000 తేడాలో ఓడిపోయామని అన్నారు. ఈ ఎన్నికల్లో షిండే 07, అజిత్ పవార్ 01 సీట్లనను గెలుచుకున్నాయి. రాష్ట్ర ఎన్నికల్లో ఇది పునరావృతం కాదని స్పష్టం చేశారు.
శివసేన తన ఓట్లను బీజేపీకి బదిలీ చేయడం సులభం, ఎందుకంటే రెండు పార్టీలు చాలా ఏళ్లుగా పొత్తులో ఉన్నాయని, మేం ఎప్పుడూ ఎన్సీపీకి వ్యతిరేకంగా పోటీ చేశామని, అందువల్ల ఆ ఓట్లను బదిలీ చేయడం కష్టమైందని అన్నారు. కానీ ఇప్పుడు రెండు పార్టీల ఓటర్ల బేస్ స్థిరపడిందని ఫడ్నవీస్ చెప్పారు. తమ కూటమి అవశ్యకతను కార్యకర్తలకు చెప్పి ఒప్పించామని, మా ఓటర్లలో కనీసం 80 శాతం మంది ఇప్పుడు ఎన్సీపీతో పొత్తును ఒప్పుకున్నారని అన్నారు. రాష్ట్రంలో 288 అసెంబ్లీ సీట్లలో పోటీ గురించి 80 శాతం చర్చలు ముగిశాయని అన్నారు. నవంబర్ నెలలో మహారాష్ట్ర ఎన్నికలు జరగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
-
Forbes India: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!