Maharashtra Cabinet: కుదిరిన మహారాష్ట్ర కేబినెట్.. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులంటే..?
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై వీడిన ఉత్కంఠ..
- మంత్రిమండలిపై కూటమిలో కుదిరిన ఏకాభిప్రాయం..
- బీజేపీ 20, శివసేనకు 13, ఎన్సీపీకి 9 మంత్రి పదవులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Cabinet: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత సీఎం పదవి కోసం ప్రతిష్టంభన ప్రస్తుతం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం పదవి బీజేపీకే దక్కనున్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా క్యాబినెట్ కూర్పుపైనా మహాయుతి కూటమిలో ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. అయితే, మంత్రిమండలిలో సగం బెర్త్లు బీజేపీ దగ్గరే ఉంచుకోనున్నట్లు తెలుస్తుంది. ఇక, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మూడు కీలక శాఖలతో పాటు 12 మంత్రి పదవులు దక్కనున్నాయని తెలుస్తుంది.
Read Also: BRSV State Secretary: బీఆర్ఎస్వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ అరెస్ట్..
Also Read
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
కాగా, మహారాష్ట్ర మంత్రి మండలిలో గరిష్ఠంగా 43 మంది మంత్రులను నియమించుకునే ఛాన్స్ ఉంది. ఇందులో 20కి పైగా పదవులను భారతీయ జనతా పార్టీ తీసుకునేందుకు మహాయుతి కూటమి నేతల మధ్య అంగీకారం కుదిరినట్లు ఓ ఇంగ్లీష్ మీడియా కథనాలు ప్రచురించింది. శివసేన(షిండే)కు 13, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 క్యాబినెట్ సీట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఇక, కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో షిండే వర్గానికి పట్టణాభివృద్ధి, ప్రజా పనుల అభివృద్ధి, జల వనరుల శాఖలను కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
Read Also: Bajrang Punia: నేను బీజేపీలో చేరి ఉంటే ఏ నిషేధం ఉండేది కాదు.. నాడాపై బజరంగ్ పునియా ఫైర్
అయితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు మహాయుతి నేతలు ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఈరోజు (నవంబర్ 28) ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానంతో చర్చలు కొనసాగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సమావేశం అనంతరం తదుపరి సీఎంపై ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. కొత్త సీఎంగా బీజేపీ నేత ఫడ్నవీస్ వైపే మొగ్గే ఛాన్స్ ఎక్కువగా కన్పిస్తుంది. ఈనెల 30న గానీ, వచ్చే నెల 1వ తేదీన గానీ నూతన సర్కార్ కొలువుదీరే అవకాశం ఉంది. ఈసారి కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!