MP Chhedi Paswan: ప్రధాని పదవి కోసం నితీష్ దావుద్ ఇబ్రహీంతో చేతులు కలపొచ్చు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Chhedi Paswan comments on CM nistish kumar: బీజేపీతో పొత్తు తెంచుకుని ఆర్జేడీతో జట్టు కట్టిన సీఎం నితీష్ కుమార్ పై బీజేపీ విమర్శల పదును పెంచింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ నితీష్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. ఆర్జేడీతో నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సమయంలోనే బీహార్ వ్యాప్తంగా క్రైం రేటు పెరిగిపోయిందంటూ.. నేరాల జాబితాను కూడా విడుదల చేశారు. ఇక అస్సాం సీఎం హిామంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. మేం కూడా పార్టీలు మారాం కానీ.. నితీష్ లాగా పార్టీలు మారలేదని విమర్శించారు. హర్యానా హోం మంత్రి అనిల్ విజ్.. నితీష్ ఓ వలస పక్షి అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే బీజేపేతర పార్టీలు మాత్రం నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్ లను ప్రశంసిస్తున్నాయి.
ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ ఛెడీ పాశ్వాన్ నితీష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ నమ్మదగిన వ్యక్తి కాదంటూనే.. ప్రధాని పదవి కోసం నితీష్ కుమార్ దావూద్ ఇబ్రహీంతో చేతులు కలిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ ఆర్జేడీ పార్టీలో మహఘటబంధన్ కూటమి ఏర్పాటు చేసిన తర్వాత ససారం ఎంపీ ఛెడీ పాశ్వాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే నితీష్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రధాని కాలేడని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
Read Also: Shivamogga Subbanna: జాతీయ అవార్డు గ్రహీత.. ప్రముఖ సింగర్ శివమొగ్గ సుబ్బన్న కన్నుమూత
మరోవైపు బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్ మాట్లాడుతూ.. అవినీతి విషయంలో నితీష్ కుమార్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం అవినీతి కేసులు ప్రస్తుత బీహర్ ప్రభుత్వ మూసివేస్తారని అన్నారు. 2017లో ఆర్జేడీ అవినీతితో పొత్తు వీడారని.. ఇప్పుడు అదే ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. బీజేపీ నేత సంజీవ్ చౌరాసియా మాట్లాడుతూ.. మీరు ఎవరి ముఖంతో ఎన్నికల్లో గెలిచారని..ప్రశ్నించారు. మీకు ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!