West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
- ఫల్తా రీపోలింగ్లో బీజేపీ భారీ ఆధిక్యం.. టీఎంసీ కంచుకోటలో కమల వికాసం.. నాలుగో స్థానంలో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లో వివాదాస్పద ఫల్తా నియోజకవర్గం రీ-పోలింగ్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ కంచుకోటగా ఉన్న ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఘోర ఓటమి దిశగా వెళ్తోంది. ఎన్నికల ఓటింగ్కు ముందే పోటీ నుంచి టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ పోటీ నుంచి వైదొలిగినట్లు ప్రకటించాడు. ఈ ఎన్నికల్లో టీఎంసీ నాలుగో స్థానంలో ఉంది. గత 15 ఏళ్లుగా టీఎంసీ కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు టీఎంసీ బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ తర్వాత స్థానంలో నిలిచింది.
ఫల్తాలో తొమ్మిదో రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి దేబాంశు పాండా 34,000కు పైగా ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించారు. రౌండ్ రౌండ్కు బీజేపీ తన అధిక్యాన్ని పెంచుకుంటూ పోతోంది. మొత్తం 21 రౌండ్ల తర్వాత మెజారిటీపై స్పష్టత వస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే బీజేపీకి భారీ విజయం ఖాయంగా కనిపిస్తోంది. అభిషేక్ బెనర్జీకి సన్నిహిత సహచరుడి ఉన్న జహంగీర్ ఖాన్ కేవలం 2570 ఓట్లు సాధించారు.
Also Read
- NTA: నీట్ వివాదం.. NTAలో భారీ ప్రక్షాళన.. 47 మందిపై వేటు..
- Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం
- Delhi: చాట్జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
అభిషేక్ కోటకు బీటలు:
బెంగాల్ టీఎంసీ దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. పార్టీ నేతలు ఇప్పటికే మమతా బెనర్జీపై తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్నారు. గత 15 ఏళ్లుగా నడిచిన తృణమూల్ అరాచకాలపై సాధారణ ప్రజలు కూడా తిరగబడుతున్నారు. కొత్తగా ఎన్నికైన సీఎం సువేందు అధికారి ప్రభుత్వం టీఎంసీ గుండాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఎన్నికల అక్రమాలకు అడ్డాగా ఉన్న ఫల్తాలో రీపోలింగ్కు ఈసీ ఆదేశాలు ఇవ్వడంతో టీఎంసీలో ఓటమి భయం మొదలైంది.
ఇక ఎంపీ అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ ఎంపీ సీటు పరిధిలోనే ఫల్తా నియోజకవర్గం ఉంటుంది. ఈ ప్రాంతంలో టీఎంసీ ఓటమి వచ్చే పార్లమెంట్ స్థానంపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది. దీనికితో తోడు తాను నమ్మినబంటుగా ఉన్న జహంగీర్ ఖాన్ ఓటమి కూడా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా నెగిటివ్గా మారుతుంది. టీఎంసీలో మమత తర్వాత నెంబర్ 2గా ఉన్న అభిషేక్ను దెబ్బతీయడం బీజేపీకి చాలా అవసరంగా భావిస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!