Tamil Nadu: “నేను మంత్రిని కాకుంటే అతడిని ముక్కలు చేసేవాడిని”.. ప్రధాని మోడీకి డీఎంకే మంత్రి బెదిరింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన తమిళనాడు మంత్రిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికార డీఎంకే పార్టీకి చెందిన నేత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడులో వివాదాస్పదం అయ్యాయి. మంత్రి అన్బరసన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో అధికార డీఎంకేపై బీజేపీ విరుచుకుపడుతోంది.
‘‘మేము చాలా మంది ప్రధానమంత్రులను చూశాం. కానీ ఇంత తక్కువ స్థాయిలో మాట్లాడే ప్రధానిని చూడలేదు. మనల్ని నిర్మూలిస్తానని అంటాడు. నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, డీఎంకే ఒక సాధారణ సంస్థ కాదు, ఇది చాలా మంది త్యాగం, రక్తాన్ని చిందించడం ద్వారా నిర్మించబడింది, డీఎంకేని నాశనం చేస్తానన్న వాళ్లు మరణించారు. ఈ సంస్థ ఎప్పటికీ ఉన్నతంగా నిలుస్తుంది, దానిని గుర్తుంచుకోండి. దీన్ని వేరే చోట చూపేందుకు ప్రయత్నించండి. నేను మంత్రిని కాకపోతే, మిమ్మల్ని చీల్చివేస్తాను, నేను మంత్రిని కాబట్టి మెల్లగా మాట్లాడుతున్నాను, నేను మంత్రిగా ఉండకపోతే ఆయన్ని ముక్కలు చేసి ఉండేవాడిని’’ అంటూ మంత్రి అన్బరసన్ బెదిరింపులకు పాల్పడ్డారు.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
Read Also: Star Hospitals: గచ్చిబౌలిలోని స్టార్ హాస్పిటల్స్లో ప్రపంచ కిడ్నీ దినోత్సవ వేడుకలు
తమిళనాడులోని తిరుప్పూర్లో ప్రధాని మోడీ రోడ్షో నిర్వహించిన వారం తర్వాత నాలుగు రోజుల క్రితం డీఎంకే మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అన్బరసన్ వ్యాఖ్యల్ని బీజేపీ ఖండించింది. ప్రధాని మోడీని బెదిరించినందుకు అతడిని తొలగించాలని సీఎం స్టాలిన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ మాట్లాడుతూ.. ఇండియా కూటమి ఎజెండా మరింత స్పష్టమైంది, సనాతన ధర్మాన్ని రక్షించే ప్రతీ ఒక్కరిని నిర్మూలించండి అంటూ వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి అధమస్థాయి దిగజారిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి మాట్లాడుతూ.. ప్రధాని ఎందుకు వస్తున్నారని సీఎం ట్వీట్ చేశారు, కాబట్టి తమిళనాడులో ప్రధాని పర్యటనలకు వారు భయపడి ఉండొచ్చని, అందుకే ప్రధాని గురించి ఇంత హీనంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఒక బాధ్యత కలిగిన సీఎంగా, ఈ దేశ ప్రధానిని బెదిరించే ప్రయత్నం చేసినందుకు స్టాలిన్ సదరు మంత్రిని తొలగించాలని ఆయన అన్నారు.
- Tags
- bjp
- DMK
- MK Stalin
- PM Modi
- Tamil Nadu
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!