JDU: 2024 ఎన్నికల్లో బీజేపీకి 2 సీట్లే.. ఎక్కడ మొదలుపెట్టారో అక్కడికే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JDU: కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీహార్ పర్యటన మత సామరస్యానికి భంగం కలిగించే ప్రయత్నమేనని జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్(లలన్ సింగ్) ఆరోపించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 40 పార్లమెంటు స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. బీజేపీ ప్రస్థానం 2 సీట్లతో ప్రారంభమైందని, భవిష్యత్తులో తిరిగి మళ్లీ అదే స్థాయికి పడిపోతుందని జోస్యం చెప్పారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గతంలో తాను చేసిన ప్రకటనను ఉపసంహరించుకున్నారు మరియు బీజేపీని 50 సీట్లకు తగ్గించవచ్చని తాను చెప్పలేదని అన్నారు. విపక్ష పార్టీలు కలిసి పని చేస్తే అది సాధ్యమవుతుందన్నారు. ఆదివారం నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ సమావేశం అనంతరం మరోమారు విపక్షాల ఐక్యతపై మాట్లాడారు నితీశ్ కుమార్. విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి కలిసి పని చేస్తే విజయం తథ్యమన్నారు. కానీ, తాము ఎన్ని సీట్లు సాధిస్తామనేదానిపై మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు. శనివారం జరిగిన తన పార్టీ, జనతాదళ్-యునైటెడ్ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ తాజా మలుపు వచ్చింది. బిహార్లో ఎన్డీయే కూటమికి టాటా చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్లతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనతా దళ్ యునైటెడ్(జేడీయూ). రెండు రోజుల్లోనే నితీశ్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. దీంతో బీజేపీ, జేడీయూల మధ్య తీవ్ర మాటల యుద్ధం మొదలైంది.
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
జేడీ(యూ) బీజేపీతో విడిపోయి, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, బీహార్లోని ఇతర పార్టీలతో కలిసి కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఒక నెల లోపే బీజేపీకి వ్యతిరేకంగా నితీష్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. అయితే, మణిపూర్లోని ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లిన ఒక రోజు తర్వాత పార్టీ పాట్నాలో జేడీయూ జాతీయ కార్యవర్గం సమావేశమైంది. దేశవ్యాప్తంగా బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టడానికి కుట్ర జరుగుతోందని నితీష్ కుమార్ అన్నట్లు జేడీయూకు సంబంధించిన నేత ఒకరు తెలిపారు.
శనివారం జరిగిన తన జాతీయ కార్యవర్గ సమావేశంలో జేడీ(యూ) కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. బీజేపీ సర్కారు పాలనలో దేశంలో ప్రకటించని ఎమర్జెన్సీ ఉందని ఆరోపిస్తూ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఇది దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం ద్వారా ప్రతిపక్ష గొంతుకలను అణచివేసే ప్రయత్నాలు చేస్తోందని పేర్కొంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు అసమ్మతి ప్రజాస్వామ్య హక్కును “దేశద్రోహం” అని ఆరోపించింది. బీజేపీ దేశంలో మత ఉన్మాదాన్ని ప్రేరేపిస్తోందని కూడా ఆరోపించింది. బీజేపీ నిరంకుశ పాలన సాగిస్తోందని ఆరోపించింది. బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చే కుట్రకు పాల్పడుతోందని విమర్శించింది.
Magsaysay award: రామన్ మెగసెసే అవార్డును తిరస్కరించిన కేరళ మాజీ మంత్రి కేకే శైలజ
బీహార్ కోసం బీజేపీ కొత్త వ్యూహంలో భాగంగా, అమిత్ షా సెప్టెంబర్ 23-24 తేదీల్లో రాష్ట్రంలోని సీమాంచల్ ప్రాంతంలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 23న ఆయన పూర్నియా జిల్లాలో ర్యాలీ నిర్వహించి, మరుసటి రోజు కిషన్గంజ్లో సంస్థాగత సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. పర్యటన గురించి అడిగిన ప్రశ్నకు రాజీవ్ రంజన్ మాట్లాడుతూ.. “అమిత్ షా వచ్చి బీహార్లో మత సామరస్యాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు, బీహార్ ప్రజలు జాగ్రత్తగా ఉన్నారు.” అని అన్నారు.
తాజావార్తలు
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?