Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bjp Had 2 Seats Will Return There Soon Says Jdu Party Chief Rajiv Ranjan

JDU: 2024 ఎన్నికల్లో బీజేపీకి 2 సీట్లే.. ఎక్కడ మొదలుపెట్టారో అక్కడికే..

Published Date :September 4, 2022 , 8:15 pm
By Mahesh Jakki
JDU: 2024 ఎన్నికల్లో బీజేపీకి 2 సీట్లే.. ఎక్కడ మొదలుపెట్టారో అక్కడికే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

JDU: కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీహార్ పర్యటన మత సామరస్యానికి భంగం కలిగించే ప్రయత్నమేనని జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్(లలన్ సింగ్) ఆరోపించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 40 పార్లమెంటు స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. బీజేపీ ప్రస్థానం 2 సీట్లతో ప్రారంభమైందని, భవిష్యత్తులో తిరిగి మళ్లీ అదే స్థాయికి పడిపోతుందని జోస్యం చెప్పారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గతంలో తాను చేసిన ప్రకటనను ఉపసంహరించుకున్నారు మరియు బీజేపీని 50 సీట్లకు తగ్గించవచ్చని తాను చెప్పలేదని అన్నారు. విపక్ష పార్టీలు కలిసి పని చేస్తే అది సాధ్యమవుతుందన్నారు. ఆదివారం నిర్వహించిన ఎగ్జిక్యూటివ్‌ సమావేశం అనంతరం మరోమారు విపక్షాల ఐక్యతపై మాట్లాడారు నితీశ్‌ కుమార్‌. విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి కలిసి పని చేస్తే విజయం తథ‍్యమన్నారు. కానీ, తాము ఎన్ని సీట్లు సాధిస్తామనేదానిపై మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు. శనివారం జరిగిన తన పార్టీ, జనతాదళ్-యునైటెడ్ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ తాజా మలుపు వచ్చింది. బిహార్‌లో ఎన్‌డీయే కూటమికి టాటా చెప్పి ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనతా దళ్‌ యునైటెడ్‌(జేడీయూ). రెండు రోజుల్లోనే నితీశ్‌ కుమార్‌ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. దీంతో బీజేపీ, జేడీయూల మధ్య తీవ్ర మాటల యుద్ధం మొదలైంది.

Also Read

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
  • Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్‌తో ఉత్కంఠ..
  • TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
  • Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?

జేడీ(యూ) బీజేపీతో విడిపోయి, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, బీహార్‌లోని ఇతర పార్టీలతో కలిసి కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఒక నెల లోపే బీజేపీకి వ్యతిరేకంగా నితీష్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించ‌డం ప్రారంభించారు. అయితే, మణిపూర్‌లోని ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లిన ఒక రోజు తర్వాత పార్టీ పాట్నాలో జేడీయూ జాతీయ కార్యవర్గం సమావేశమైంది. దేశవ్యాప్తంగా బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టడానికి కుట్ర జరుగుతోందని నితీష్‌ కుమార్ అన్నట్లు జేడీయూకు సంబంధించిన నేత ఒకరు తెలిపారు.

శనివారం జరిగిన తన జాతీయ కార్యవర్గ సమావేశంలో జేడీ(యూ) కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. బీజేపీ స‌ర్కారు పాల‌న‌లో దేశంలో ప్రకటించని ఎమర్జెన్సీ ఉందని ఆరోపిస్తూ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఇది దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం ద్వారా ప్రతిపక్ష గొంతుక‌లను అణ‌చివేసే ప్రయ‌త్నాలు చేస్తోంద‌ని పేర్కొంది. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు అసమ్మతి ప్రజాస్వామ్య హక్కును “దేశద్రోహం” అని ఆరోపించింది. బీజేపీ దేశంలో మత ఉన్మాదాన్ని ప్రేరేపిస్తోందని కూడా ఆరోపించింది. బీజేపీ నిరంకుశ పాల‌న సాగిస్తోందని ఆరోపించింది. బీజేపీయేత‌ర ప్రభుత్వాల‌ను కూల్చే కుట్రకు పాల్పడుతోందని విమర్శించింది.

Magsaysay award: రామన్ మెగసెసే అవార్డును తిరస్కరించిన కేరళ మాజీ మంత్రి కేకే శైలజ

బీహార్ కోసం బీజేపీ కొత్త వ్యూహంలో భాగంగా, అమిత్ షా సెప్టెంబర్ 23-24 తేదీల్లో రాష్ట్రంలోని సీమాంచల్ ప్రాంతంలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 23న ఆయన పూర్నియా జిల్లాలో ర్యాలీ నిర్వహించి, మరుసటి రోజు కిషన్‌గంజ్‌లో సంస్థాగత సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. పర్యటన గురించి అడిగిన ప్రశ్నకు రాజీవ్ రంజన్ మాట్లాడుతూ.. “అమిత్ షా వచ్చి బీహార్‌లో మత సామరస్యాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు, బీహార్ ప్రజలు జాగ్రత్తగా ఉన్నారు.” అని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bihar
  • bjp
  • janatadal (united)
  • JDU
  • JDU Party

తాజావార్తలు

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

  • Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!

  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్‌ రికెల్టన్‌’.. SRH ముందు భారీ టార్గెట్.!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions