Pahalgam Terror Attack: భార్య, కుమారుడితో అమెరికా నుంచి వచ్చాడు.. ఉగ్రదాడిలో కోల్కతా టెక్కీ మృతి
- భార్య, పిల్లలతో అమెరికా నుంచి వచ్చాడు
- పహల్గామ్ టూర్కు వెళ్లిన బితాన్ ఫ్యామిలీ
- మంగళవారం ఉగ్రదాడిలో కోల్కతా టెక్కీ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాకు చెందిన కోల్కతా టెక్కీ బితాన్ అధికారి(40), భార్య సోహిని, మూడేళ్ల కుమారుడితో కలిసి భారత్కు వచ్చాడు. ఫ్లోరిడాలో టీసీఎస్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఏప్రిల్ 8న కోల్కతాలోని సొంతింటికి వచ్చాడు. సరదాగా ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేశాడు. అలా కాశ్మీర్లోని పహల్గామ్కు వెళ్లారు. మంగళవారం బితాన్ అధికారి భార్య, కుమారుడితో సరదాగా గడుపుతున్నారు. ఉన్నట్టుండి ముష్కరులు కాల్పులు జరిపారు. భార్య, కుమారుడి కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకుని వృద్ధ తల్లిదండ్రులు తల్లిడిల్లిపోయారు. కన్నీటి పర్యాంతం అయ్యారు. ఉగ్రవాదులు.. భార్య, కుమారుడి జోలికి రాలేదు. కేవలం బితాన్ మాత్రమే చంపేసి వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: Pahalgam Terrorist Attack: పహల్గాం ఉగ్ర దాడిలో మరణించిన నెల్లూరు వాసి!
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
ఇక బితాన్ అధికారి మరణ వార్త తెలియగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సోహినికి ఫోన్ చేసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని.. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని కోల్కతా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్లో కూడా మమత వెల్లడించారు. ‘‘పహల్గామ్ ఘటనలో మృతిచెందిన బితాన్ అధికారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా. భార్యతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. ఓదార్చడానికి మాటలు రావడం లేదన్నారు. భౌతికకాయం ఇంటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.’’ అని మమత వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Pahalgam Attack: పహల్గామ్ మృతులకు అమిత్ షా నివాళి
పర్యాటక కేంద్రమైన పహల్గామ్లో నిన్న మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో ఇద్దరు విదేశీయులు సహా కనీసం 26 మంది మరణించారు. ఇక ఈ ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్కు అండగా ఉంటామని అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ప్రకటించాయి. ఇక సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. ఉగ్ర దాడి వార్త తెలుసుకున్న వెంటనే హుటాహుటినా భారత్కు బయల్దేరి వచ్చేశారు. బుధవారం అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అలాగే మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించనున్నారు.
My heart goes out to the families of the victims of the devastating terrorist attack on the tourists in Jammu and Kashmir today.
One of the victims, Sri Bitan Adhikari, is from West Bengal. I have talked with his wife over phone. Though no words are enough to console her in…
— Mamata Banerjee (@MamataOfficial) April 22, 2025
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!