Pahalgam Terror Attack: భార్య, కుమారుడితో అమెరికా నుంచి వచ్చాడు.. ఉగ్రదాడిలో కోల్కతా టెక్కీ మృతి
- భార్య, పిల్లలతో అమెరికా నుంచి వచ్చాడు
- పహల్గామ్ టూర్కు వెళ్లిన బితాన్ ఫ్యామిలీ
- మంగళవారం ఉగ్రదాడిలో కోల్కతా టెక్కీ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాకు చెందిన కోల్కతా టెక్కీ బితాన్ అధికారి(40), భార్య సోహిని, మూడేళ్ల కుమారుడితో కలిసి భారత్కు వచ్చాడు. ఫ్లోరిడాలో టీసీఎస్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఏప్రిల్ 8న కోల్కతాలోని సొంతింటికి వచ్చాడు. సరదాగా ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేశాడు. అలా కాశ్మీర్లోని పహల్గామ్కు వెళ్లారు. మంగళవారం బితాన్ అధికారి భార్య, కుమారుడితో సరదాగా గడుపుతున్నారు. ఉన్నట్టుండి ముష్కరులు కాల్పులు జరిపారు. భార్య, కుమారుడి కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకుని వృద్ధ తల్లిదండ్రులు తల్లిడిల్లిపోయారు. కన్నీటి పర్యాంతం అయ్యారు. ఉగ్రవాదులు.. భార్య, కుమారుడి జోలికి రాలేదు. కేవలం బితాన్ మాత్రమే చంపేసి వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: Pahalgam Terrorist Attack: పహల్గాం ఉగ్ర దాడిలో మరణించిన నెల్లూరు వాసి!
Also Read
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
- PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
- Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
ఇక బితాన్ అధికారి మరణ వార్త తెలియగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సోహినికి ఫోన్ చేసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని.. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని కోల్కతా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్లో కూడా మమత వెల్లడించారు. ‘‘పహల్గామ్ ఘటనలో మృతిచెందిన బితాన్ అధికారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా. భార్యతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. ఓదార్చడానికి మాటలు రావడం లేదన్నారు. భౌతికకాయం ఇంటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.’’ అని మమత వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Pahalgam Attack: పహల్గామ్ మృతులకు అమిత్ షా నివాళి
పర్యాటక కేంద్రమైన పహల్గామ్లో నిన్న మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో ఇద్దరు విదేశీయులు సహా కనీసం 26 మంది మరణించారు. ఇక ఈ ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్కు అండగా ఉంటామని అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ప్రకటించాయి. ఇక సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. ఉగ్ర దాడి వార్త తెలుసుకున్న వెంటనే హుటాహుటినా భారత్కు బయల్దేరి వచ్చేశారు. బుధవారం అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అలాగే మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించనున్నారు.
My heart goes out to the families of the victims of the devastating terrorist attack on the tourists in Jammu and Kashmir today.
One of the victims, Sri Bitan Adhikari, is from West Bengal. I have talked with his wife over phone. Though no words are enough to console her in…
— Mamata Banerjee (@MamataOfficial) April 22, 2025
తాజావార్తలు
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
-
Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?