Hardeep Puri: బిలావల్ భుట్టో ‘‘రక్తం’’ కామెంట్స్.. కేంద్రమంత్రి ‘‘నీటి’’తో దిమ్మతిరిగే సమాధానం..
- బిలావల్ భుట్టో ‘‘రక్తం’’ కామెంట్స్..
- తీవ్రంగా స్పందించిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి..
- ఆయన దూకాలనుకున్న పాకిస్తాన్లో నీరు ఉండదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardeep Puri: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం పాకిస్తాన్ని తెగ భయపెడుతోంది. ఇదే జరిగితే పాకిస్తాన్ దాదాపుగా ఎడారిగా మారుతుంది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కలిగిన పాకిస్తాన్కి ఆకలి చావులే గతి. అయితే, సింధు జలాలపై పాక్ నేతలు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. పాక్ ప్రధాని సింధు నదిని ‘‘జీవనాడి’’గా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. ‘‘ సింధు నది మాది, మా నీరుని ఆపితే, భారతీయుల రక్తం ప్రవహిస్తుంది’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ‘‘ నేను అతడి(భుట్టో) ప్రకటన విన్నాను. నీటిలో ఎక్కడైనా దూకమనండి. అయితే, నీరు లేనప్పుడు అతను ఎలా చేస్తాడు..? అలాంటి ప్రకటనల్ని పట్టించుకోవద్దు. వారికే తర్వాత అర్థం అవుతుంది’’ అని అన్నారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Read Also: Rahul Gandhi: ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమే.. ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలు జరుగుతున్నాయి..
“పహల్గామ్ సంఘటన నిస్సందేహంగా పొరుగు రాష్ట్రం చేసిన సరిహద్దు ఉగ్రవాద దాడి, వారు బాధ్యత వహించాల్సిందే. మునుపటిలా కాకుండా, ఏ వ్యాపారం ఇప్పుడు కొనసాగదు. ప్రధానమంత్రి మోడీ చెప్పినట్లుగా, పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది , ఇది ప్రారంభం మాత్రమే. ఉగ్రవాదులు జీవించే అత్యంత ప్రాథమిక హక్కును లాక్కుంటారు. దీనిని ప్రపంచం మొత్తం ఖండిస్తోంది. పాకిస్తాన్ కేవలం మోసపూరిత దేశం కాదు, ఇది అంతిమ క్షీణతలో ఉన్న దేశం’’ అని ఆయన అన్నారు.
లండన్లో పాకిస్తాన్ హైకమిషన్లో పాకిస్తాన్ ఆర్మీ, వైమానిక సలహాదారు కల్నల్ తైమూర్ భారతీయుల గొంతు కోస్తాననే అర్థం వచ్చేలా ప్రవర్తించడంపై పూరి మాట్లాడుతూ.. పాకిస్తాన్ టెర్రర్ స్పాన్సర్డ్ దేశం, వారు మూల్యం చెల్లించుకోవాల్సిన స్థితిలో ఉన్నారు, ఇప్పుడు సింధు జల ఒప్పందం నుంచి వారు(పాకిస్తాన్) బయటపడగలమని భావిస్తే, వారికి శుభాకాంక్షలు అని చెప్పారు.
#WATCH | Mohali | On #Pahalgamterrorattack, Union Minister Hardeep Singh Puri says, "The Pahalgam incident is unequivocally a cross-border terrorist attack unleashed by a neighbouring state and they are taking its responsibility… Unlike before, no business will continue. Like… pic.twitter.com/IP6eGPIGIW
— ANI (@ANI) April 26, 2025
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!