Bihar Election Results: రబ్రీ దేవిని ఓడించాడు, ఇప్పుడు తేజస్వీని ఓడిస్తాడా.? ఎవరీ సతీష్ కుమార్ యాదవ్..
- తేజస్వీ యాదవ్కు రఘోపూర్లో గట్టిపోటీ..
- గతంలో రబ్రీ దేవిని ఓడించాడు, ఇప్పుడు తేజస్వీ వంతు..?
- ఎవరీ సతీష్ కుమార్ యాదవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Election Results: బీహర్ ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. ఎగ్జిట్ పోల్స్ ఊహించిన దాని కన్నా ఎన్డీయే కూటమి అఖండ విజయం దిశగా వెళ్తోంది. మొత్తం 243 సీట్లలో బీజేపీ-జేడీయూ కూటమి 190కి పైగా స్థానాలను కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు, ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ల ‘‘మహాఘట్బంధన్’’ కూటమి ఘోర పరాజయం కైవసం చేసుకోబోతోంది. కేవలం 50 సీట్లకు లోపే ఈ కూటమి ఉండబోతోంది. ఇదిలా ఉంటే, మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థి, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్కు రాఘోపూర్ నియోజకవర్గంలో గట్టి పోటీ ఎదురవుతోంది. కొన్ని రౌండ్స్లో వెనకంజలోకి వెళ్లాడు. లాలూ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నియోజకవర్గంలో ఓటమి దిశగా వెళ్తున్నారు.
ఆర్జేడీకి కంచుకోటగా ఉన్న రాఘోపూర్లో తేజస్వీ యాదవ్ బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ యాదవ్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నాడు. యాదవ్ ఒక దశలో సతీష్ కుమార్ యాదవ్ కన్నా 13,000 ఓట్ల లేడాతో వెనకబడి ఉన్నాడు. మధ్యాహ్నం నాటికి స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. అయితే, 15 ఏళ్ల క్రితం లాలూ భార్య, తేజస్వీ తల్లి రబ్రీదేవీని ఇదే సతీష్ కుమార్ రాఘోపూర్లో ఓడించారు. ఈసారి తేజస్వీని ఓడిస్తారా.? అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Also Read
- Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
- Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
- IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
- PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
Read Also: Bihar Election Results: బీహార్లో “ని-మో” జోడి ప్రభంజనం.. అండగా నిలిచిన మహిళలు..
ఎవరీ సతీష్ కుమార్?
59 ఏళ్ల సతీష్ కుమార్ తన రాజకీయ ప్రయాణాన్ని ఆర్జేడీ నుంచే మొదలుపెట్టారు. బీహార్ జనాభాలో యాదవులు 15 శాతం ఉంటారు. వీరిలో ప్రభావవంతమైన నేతగా ఉన్నారు. 2005లో సతీష్ కుమార్ జేడీయూలో చేరారు. రాఘోపూర్ నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో రబ్రీదేవీ ఆయనను 25 వేల పైచిలుకు ఓట్లతో ఓడించింది. అయితే, 2010 ఎన్నికల్లో సతీష్ కుమార్ 13,000 ఓట్ల తేడాతో రబ్రీ దేవీని ఓడించారు. 2015లో ఆయన తన స్థానాన్ని కాపాడుకునేందుకు బీజేపీలో చేరారు. ఇప్పుడు, తేజస్వీకి గట్టి పోటీ ఇస్తున్నారు. ఎవరు గెలిచినా స్వల్ప తేడా మాత్రమే ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!