Bihar Election Results: బీహార్లో “ని-మో” జోడి ప్రభంజనం.. అండగా నిలిచిన మహిళలు..
- బీహార్లో "ని-మో" జోడి ప్రభంజనం..
- సూపర్ హిట్ అయిన మోడీ, నితీష్ కాంబినేషన్..
- బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే అఖండ విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Election Results: బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. జేడీయూ, బీజేపీల తుఫానులో ఆర్జేడీ, కాంగ్రెస్లు కొట్టుకుపోయాయి. 243 స్థానాలు ఉన్న బీహార్లో, ఏకంగా 185 నుంచి 190 స్థానాలు సాధించే దిశగా ఎన్డీయే వెళ్తోంది. ఇక ప్రతిపక్ష మహాఘట్బంధన్ కూటమి 50 లోపు స్థానాలకు మాత్రమే పరిమితమవుతోంది. ఈసారి కూడా ఆర్జేడీ కూటమికి చేదు ఫలితాలు ఎదురయ్యాయి.
ఈ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్, ప్రధాని నరేంద్రమోడీల ‘‘నిమో’’ జోడీ సూపర్ హిట్ అయింది. రెండు పార్టీలు కూడా వ్యతిరేతకను అధిగమించాయి. మరోవైపు, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిలో పొత్తుల ముందు నుంచే లుకలుకలు ఏర్పడ్డాయి. ఎన్డీయే కూటమిలో ముందు నుంచి అన్ని పార్టీలు సయోధ్యతో సీట్ల ఒప్పందాన్ని కదుర్చుకున్నాయి. ప్రచారాన్ని ఎలాంటి విభేదాలు లేకుండా నిర్వహించాయి. ఇది కూడా ఎన్డీయే కూటమి విజయానికి దోహదపడింది. ఇక మోడీ ఫ్యాక్టర్, నితీష్ కుమార్లకు ఉన్న క్లీన్ ఇమేజ్ ప్రజల ఓట్లను కొల్లగొట్టడానికి కారణమైంది. ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రచారం కలిసి వచ్చింది. తేజస్వీ యాదవ్, నితీష్ కుమార్ వయసు గురించి కించపరిచేలా విమర్శలు చేయడం కూడా ఆర్జేడీకి ప్రతికూలంగా, జేడీయూకు సింపతీగా మారాయి.
Also Read
- LPG Subsidy Cut: సామాన్యుడికి గ్యాస్ షాక్.. ఇకపై సబ్సిడీ కట్!
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
- NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
- Udhayanidhi Stalin: అధికారం పోయినా మారని తీరు! సనాతన ధర్మంపై మరోసారి విషం చిమ్మిన ఉదయనిధి స్టాలిన్
Read Also: Bihar Election Results: బీహార్లో ‘‘SIR’’ గెలిచింది, ప్రజాస్వామ్య హత్య.. కాంగ్రెస్ ఆరోపణలు మొదలు..
బీజేపీకి సహజంగా పట్టణాల్లో ఉండే ఓట్ బ్యాంక్, జేడీయూకు గ్రామాల్లో ఉండే సంస్థాగత నిర్మాణం, ఈ రెండు కలిసి అఖండ విజయాన్ని సాధించిపెట్టాయి. దీంతో పాటు కుల సమీకరణాలు, మహిళల ఓట్లు ఎన్డీయే కూటమికి కలిసి వచ్చాయి. ముఖ్యంగా, లాలూ ప్రసాద్ సమయంలోని ‘‘జంగిల్ రాజ్’’ పాలనను ఇంకా బీహార్ ప్రజలు మరిచిపోలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఈ ఎన్నికల్లో ప్రతిబింబించింది. నితీష్ కుమార్ పాలనలో లా అండ్ ఆర్డర్ పరిస్థితుల్ని, జంగిల్ రాజ్తో ప్రజలు బేరీజు వేసుకుని ఓట్లు వేశారు.
కుల, మత సమీకరణాలు పరిశీలిస్తే.. ముఖ్యంగా యాదవులు, ముస్లింలు ఆర్జేడీ కూటమికి ఓటు వేసినట్లు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఫలితాలను చూస్తే యాదవులు కూడా అంత ప్రభావవంతంగా ఆర్జేడీకి ఓటు వేయలేదని తెలుస్తోంది. యాదవేతర, ముస్లిమేతర ఓటర్లు మొత్తం గంపగుత్తగా ఎన్డీయే కూటమి వైపు నిలిచారు. ఓబీసీలు, ఈబీసీలు, అగ్ర కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు మోడీ-నితీష్ జోడీకి మద్దతు ఇచ్చారు. ఇవన్నీ కలిసి బీహార్లో ఎన్డీయే ఘన విజయానికి కారణమయ్యాయి.
తాజావార్తలు
-
LPG Subsidy Cut: సామాన్యుడికి గ్యాస్ షాక్.. ఇకపై సబ్సిడీ కట్!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
-
NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
-
Hiro Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
-
Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్కు భారీ జరిమానా..!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!