Bihar Election Results: బీహార్లో “ని-మో” జోడి ప్రభంజనం.. అండగా నిలిచిన మహిళలు..
- బీహార్లో "ని-మో" జోడి ప్రభంజనం..
- సూపర్ హిట్ అయిన మోడీ, నితీష్ కాంబినేషన్..
- బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే అఖండ విజయం..
Bihar Election Results: బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. జేడీయూ, బీజేపీల తుఫానులో ఆర్జేడీ, కాంగ్రెస్లు కొట్టుకుపోయాయి. 243 స్థానాలు ఉన్న బీహార్లో, ఏకంగా 185 నుంచి 190 స్థానాలు సాధించే దిశగా ఎన్డీయే వెళ్తోంది. ఇక ప్రతిపక్ష మహాఘట్బంధన్ కూటమి 50 లోపు స్థానాలకు మాత్రమే పరిమితమవుతోంది. ఈసారి కూడా ఆర్జేడీ కూటమికి చేదు ఫలితాలు ఎదురయ్యాయి.
ఈ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్, ప్రధాని నరేంద్రమోడీల ‘‘నిమో’’ జోడీ సూపర్ హిట్ అయింది. రెండు పార్టీలు కూడా వ్యతిరేతకను అధిగమించాయి. మరోవైపు, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిలో పొత్తుల ముందు నుంచే లుకలుకలు ఏర్పడ్డాయి. ఎన్డీయే కూటమిలో ముందు నుంచి అన్ని పార్టీలు సయోధ్యతో సీట్ల ఒప్పందాన్ని కదుర్చుకున్నాయి. ప్రచారాన్ని ఎలాంటి విభేదాలు లేకుండా నిర్వహించాయి. ఇది కూడా ఎన్డీయే కూటమి విజయానికి దోహదపడింది. ఇక మోడీ ఫ్యాక్టర్, నితీష్ కుమార్లకు ఉన్న క్లీన్ ఇమేజ్ ప్రజల ఓట్లను కొల్లగొట్టడానికి కారణమైంది. ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రచారం కలిసి వచ్చింది. తేజస్వీ యాదవ్, నితీష్ కుమార్ వయసు గురించి కించపరిచేలా విమర్శలు చేయడం కూడా ఆర్జేడీకి ప్రతికూలంగా, జేడీయూకు సింపతీగా మారాయి.
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
Read Also: Bihar Election Results: బీహార్లో ‘‘SIR’’ గెలిచింది, ప్రజాస్వామ్య హత్య.. కాంగ్రెస్ ఆరోపణలు మొదలు..
బీజేపీకి సహజంగా పట్టణాల్లో ఉండే ఓట్ బ్యాంక్, జేడీయూకు గ్రామాల్లో ఉండే సంస్థాగత నిర్మాణం, ఈ రెండు కలిసి అఖండ విజయాన్ని సాధించిపెట్టాయి. దీంతో పాటు కుల సమీకరణాలు, మహిళల ఓట్లు ఎన్డీయే కూటమికి కలిసి వచ్చాయి. ముఖ్యంగా, లాలూ ప్రసాద్ సమయంలోని ‘‘జంగిల్ రాజ్’’ పాలనను ఇంకా బీహార్ ప్రజలు మరిచిపోలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఈ ఎన్నికల్లో ప్రతిబింబించింది. నితీష్ కుమార్ పాలనలో లా అండ్ ఆర్డర్ పరిస్థితుల్ని, జంగిల్ రాజ్తో ప్రజలు బేరీజు వేసుకుని ఓట్లు వేశారు.
కుల, మత సమీకరణాలు పరిశీలిస్తే.. ముఖ్యంగా యాదవులు, ముస్లింలు ఆర్జేడీ కూటమికి ఓటు వేసినట్లు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఫలితాలను చూస్తే యాదవులు కూడా అంత ప్రభావవంతంగా ఆర్జేడీకి ఓటు వేయలేదని తెలుస్తోంది. యాదవేతర, ముస్లిమేతర ఓటర్లు మొత్తం గంపగుత్తగా ఎన్డీయే కూటమి వైపు నిలిచారు. ఓబీసీలు, ఈబీసీలు, అగ్ర కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు మోడీ-నితీష్ జోడీకి మద్దతు ఇచ్చారు. ఇవన్నీ కలిసి బీహార్లో ఎన్డీయే ఘన విజయానికి కారణమయ్యాయి.
తాజావార్తలు
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?