Rajnath Singh: “రాజకీయాల్లో బెస్ట్ ఫినిషర్”.. రాహుల్ గాంధీపై రాజ్నాథ్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: క్రికెట్లో బెస్ట్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని అయితే, భారత రాజకీయాల్లో ‘‘బెస్ట్ ఫినిషర్’’ రాహుల్ గాంధీ అని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సెటైర్లు వేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధి జిల్లాలో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి అవినీతితో విడదీయరాని బంధం ఉందని రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. ఒకప్పుడు భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించేదని, ఇప్పుడు రెండుమూడు చిన్న రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైందని అన్నారు.
‘‘ ఎందుకు ఇలా జరుగుతుందని కొన్నిసార్లు ఆశ్చర్యపోతున్నా. నేను ఒక నిర్ణయానికి వచ్చా.. క్రికెట్లో బెస్ట్ ఫినిషర్ ఎవరు.. ధోని, ఎవరైనా నన్ను భారత రాజకీయాల్లో బెస్ట్ ఫినిషర్ ఎవరు అని అడిగితే, నేను రాహుల్ గాంధీ అని చెబుతాను. చాలా మంది నేతలు కాంగ్రెస్ను వీడడానికి ఇదే కారణం’’ అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ని ఖతం చేసే వరకు రాహుల్ గాంధీ విశ్రమించరని ఎద్దేవా చేశారు.
Also Read
- Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
- Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
- Tamil Nadu Debt Crisis: పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.28 లక్షల అప్పు.. శ్వేతపత్రంలో సంచలన విషయాలు
- Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
Read Also: MP Margani Bharat: కేంద్రమేమీ ఆకాశం నుండి ఊడి పడలేదు.. ఏపీకి తీరని అన్యాయమే చేసింది..
కాంగ్రెస్కి అవినీతికి అవినాభావ సంబంధం ఉందని, చాలా కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నాయని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని ఏ మంత్రిపైనా అలాంటి ఆరోపణలు రాలేదని రాజ్నాథ్ అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికలకు ఆయన మద్దతు పలికారు, ఇది సమయం, వనరులను ఆదా చేస్తుందని పేర్కొన్నారు. ఏక కాల ఎన్నికలకు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయని చెప్పారు. 2027 ప్రారంభం నాటికి భారతదేశం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేశారు. పదేళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న భారత్, మోడీ పాలనలో 5వ స్థానానికి చేరుకుందని చెప్పారు. 2045 నాటికి భారత్ సూపర్ పవర్ అవుతుందని ఆయన అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చాలా హామీలు ఇచ్చిందని, వాటిని పాక్షికంగా అమలు చేసినా, భారత్ చాలా ఏళ్ల క్రితమే శక్తివంతమైన దేశంగా ఎదిగేదని అన్నారు. మరోవైపు పదేళ్లలో బీజేపీ తన వాగ్దానాలను నెరవేర్చిందని చెప్పారు. మేం చెప్పినట్లు రామమందిరం నిర్మించాం, ఆర్టికల్ 370 రద్దు చేశాం, త్రిపుల్ తలాక్కి స్వస్తి పలికామని ఉదాహరణగా చెప్పారు. బుజ్జగింపు రాజకీయాలు చేయడం లేదని, దేశ నిర్మాణం కోసం బీజేపీ రాజకీయాలు చేస్తుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్పై 3-1 తేడాతో.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Electric Scooters: విశాలమైన బూట్ స్పేస్.. హెల్మెట్తో పాటు కిరాణా సామాను కూడా పట్టే టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
-
Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
ట్రెండింగ్
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!