Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
- నేలరాలిన విద్యాకుసుమం
- 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
- నీట్ రీ-ఎగ్జామ్ ముందు విద్యార్థిని సూసైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మరో విద్యాకుసుమం నేలరాలిపోయింది. నీట్ పరీక్ష రద్దు మరొక విద్యార్థిని బలి తీసుకొంది. ఇప్పటికే పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదు రోజుల్లో రీ-ఎగ్జామ్ జరగబోతున్న తరుణంలో డెహ్రాడూన్కు చెందిన 12వ తరగతి టాపర్ రియా కుమారి థాపా ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబంలో.. స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలుమున్నాయి.
23 ఏళ్ల రియా కుమారి థాపా ప్రతిభావంతురాలైన విద్యార్థిని. 97.6 శాతం మార్కులతో 12వ తరగతిలో ప్రథమ స్థానం సాధించింది. ట్యూషన్ చెప్పుకుంటూ తన ఖర్చులను తానే భరించుకుంది. 2026లో నీట్ పరీక్ష గురించి చాలా నమ్మకంగా ఉంది. తాను పరీక్షలో బాగా రాశానని, తప్పకుండా పాస్ అవుతానని కుటుంబ సభ్యులకు చెప్పింది. కానీ హఠాత్తుగా ఆ పరీక్ష రద్దైంది. దీంతో అప్పటి నుంచి బెంగ పెట్టుకుంది. చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయి.
Also Read
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
- Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
- Karur Stampede: కరూర్ తొక్కిసలాట కేసు.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. విజయ్ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి
- Meghalaya Honeymoon Murder Case: 'నేను అమాయకురాలిని, నన్ను ఇరికించారు'.. సోనమ్ సంచలన వ్యాఖ్యలు..
అయితే చంద్రబానిలో రియా ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది పోలీసులు లేఖను స్వాధీనం చేసుకున్నారు. ‘‘అమ్మా, నాన్నా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇందులో ఎవరిదీ తప్పు లేదు’’ అని రాసింది. తండ్రి కార్గిల్ యుద్ధంలో పోరాడగా.. తల్లి గృహిణి. రియా నీట్ పరీక్ష మొదటిసారి విఫలమైనప్పటికీ.. 2026లో జరగబోయే తన రెండో పరీక్షపై ఆమెకు పూర్తి నమ్మకం ఉంది. తాను పరీక్షలో బాగా రాశానని.. తప్పకుండా పాస్ అవుతానని తన కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి చెప్పింది. కానీ ఆశలు ఆవిరైపోయాయి.
నివేదికల ప్రకారం.. రియా రాత్రి పొద్దుపోయే వరకు చదువుకుంది. కానీ ఉదయం ఆమె గది తలుపు తెరుచుకోకపోవడంతో ఆమె తల్లి తట్టింది. చాలా సేపటి వరకు తలుపు తెరుచుకోకపోవడంతో తండ్రిని పిలిచింది. తండ్రి తలుపు తెరిచి చూడగా రియా ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. దీంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer Record: అరుదైన జాబితాలో ‘సర్పంచ్ సాబ్’.. ఏకంగా మూడుసార్లు!
-
Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
-
Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
-
Indian Student: ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి.. ఉజ్బెకిస్తాన్లో భారతీయ విద్యార్థిని హత్య..?
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!