Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
- నేలరాలిన విద్యాకుసుమం
- 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
- నీట్ రీ-ఎగ్జామ్ ముందు విద్యార్థిని సూసైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మరో విద్యాకుసుమం నేలరాలిపోయింది. నీట్ పరీక్ష రద్దు మరొక విద్యార్థిని బలి తీసుకొంది. ఇప్పటికే పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదు రోజుల్లో రీ-ఎగ్జామ్ జరగబోతున్న తరుణంలో డెహ్రాడూన్కు చెందిన 12వ తరగతి టాపర్ రియా కుమారి థాపా ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబంలో.. స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలుమున్నాయి.
23 ఏళ్ల రియా కుమారి థాపా ప్రతిభావంతురాలైన విద్యార్థిని. 97.6 శాతం మార్కులతో 12వ తరగతిలో ప్రథమ స్థానం సాధించింది. ట్యూషన్ చెప్పుకుంటూ తన ఖర్చులను తానే భరించుకుంది. 2026లో నీట్ పరీక్ష గురించి చాలా నమ్మకంగా ఉంది. తాను పరీక్షలో బాగా రాశానని, తప్పకుండా పాస్ అవుతానని కుటుంబ సభ్యులకు చెప్పింది. కానీ హఠాత్తుగా ఆ పరీక్ష రద్దైంది. దీంతో అప్పటి నుంచి బెంగ పెట్టుకుంది. చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయి.
Also Read
- IMD Alert: 19 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
- El Nino: సూపర్ ఎల్నినో వచ్చేసిందన్న శాస్త్రవేత్తలు.. రాజ్యసభలో కీలక ప్రకటన చేసిన కేంద్రం
- CJP Protest: వెండి తెరపైకి ఢిల్లీ విద్యార్థుల ఉద్యమం.. బాలీవుడ్ సినిమా టైటిల్ ఇదే!
- Karnataka: కన్న కూతురుపై తండ్రి పగ.. కాలేజీకెళ్లి కత్తి దాడి.. దేనికోసమో తెలిస్తే..!
అయితే చంద్రబానిలో రియా ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది పోలీసులు లేఖను స్వాధీనం చేసుకున్నారు. ‘‘అమ్మా, నాన్నా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇందులో ఎవరిదీ తప్పు లేదు’’ అని రాసింది. తండ్రి కార్గిల్ యుద్ధంలో పోరాడగా.. తల్లి గృహిణి. రియా నీట్ పరీక్ష మొదటిసారి విఫలమైనప్పటికీ.. 2026లో జరగబోయే తన రెండో పరీక్షపై ఆమెకు పూర్తి నమ్మకం ఉంది. తాను పరీక్షలో బాగా రాశానని.. తప్పకుండా పాస్ అవుతానని తన కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి చెప్పింది. కానీ ఆశలు ఆవిరైపోయాయి.
నివేదికల ప్రకారం.. రియా రాత్రి పొద్దుపోయే వరకు చదువుకుంది. కానీ ఉదయం ఆమె గది తలుపు తెరుచుకోకపోవడంతో ఆమె తల్లి తట్టింది. చాలా సేపటి వరకు తలుపు తెరుచుకోకపోవడంతో తండ్రిని పిలిచింది. తండ్రి తలుపు తెరిచి చూడగా రియా ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. దీంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
-
Metro Express: కరీంనగర్లో ‘సిటీ మెట్రో ఎక్స్ప్రెస్’ బస్సులు ప్రారంభం.. ఈ రూట్లల్లో అందుబాటులోకి..
-
Sai Krishna Lockup Death Case: సీఐ నాగరాజుపై సుదీర్ఘ విచారణ.. ప్రశ్నల వర్షం కురిపించిన SIT..
-
YS Jagan: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్ష సాధింపు.. ప్రమాదాన్ని కుట్రగా మార్చారు.!
-
IMD Alert: 19 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!