Bengaluru mall: ధోతీ కట్టిన రైతు పవర్.. బెంగళూర్ మాల్ మూసివేత..
- ధోలీ కట్టిన రైతుకి మాల్లో ప్రవేశం నిరాకరణ..
- సోషల్ మీడియాలో జీటీ మాల్ తీరుపై తీవ్ర ఆగ్రహం..
- మాల్పై కేసు.. వారం పాటు మూసివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru mall: ధోతీ ధరించిన రైతుని మాల్కి నిరాకరించిన బెంగళూర్ ఘటన యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ధోతీ ధరించాడని చెబుతూ రైతుని, అతని కొడుకుని సినిమా టిక్కెట్లు ఉన్నప్పటికీ జీటీ మాల్లోకి అనుమతించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చివరకు మాల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. ఇదిలా ఉంటే రైతు సంఘాల నుంచి నిరసనలు రావడం, ప్రతిపక్ష బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో అధికారులు మాల్పై చర్యలకు ఉపక్రమించారు.
రైతుకు ఎంట్రీ నిరాకరించిన మాల్ యజమాని, సెక్యూరిటీ గార్డుపై కేసు నమోదైంది. పోలీసులు చర్యలు తీసుకోకుండా ఆందోళకు దిగుతామని రైతు నాయకులు హెచ్చరించడంతో పోలీసులు కేసు నమోదు చేసి, తాత్కాలికంగా మాల్ని మూసేశారు. వారం రోజుల పాటు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. జీటి మాల్ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకిత్తించిన తర్వాత, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేష్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Also Read
- Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
Read Also: UTTAR PRADESH: రాజకీయ దుమారంగా మారిన “కన్వర్ యాత్ర” రూల్స్.. ‘‘యాంటీ ముస్లిం’’ అంటూ విమర్శలు..
అసలేం జరిగింది..?
కర్ణాటక హవేరీ జిల్లాకు చెందిన ఫకీరప్ప అనే రైతు తన కొడుకును చూసేందుకు బెంగళూర్ వచ్చారు. అయితే, తన తండ్రిని సినిమాకు తీసుకెళ్లేందుకు కొడుకు టిక్కెట్లు బుక్ చేసుకుని, జీటీ మాల్లోని థియేటర్కి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ధోతీ ధరించిన కారణంగా మాల్లో తండ్రికొడుకుల్ని అనుమతించలేదు. తమ వద్ద టికెట్లు ఉన్నాయని చెప్పినప్పటికీ నిర్వాహకులు ససేమిరా అన్నారు. లోపలికి వెళ్లాలంటే ప్యాంట్ వేసుకోవాలని రైతుకు సూచించారు. దీని సంబంధించిన వీడియో వైరల్ అయింది.
బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో, ధోతి ధరించినందుకు రైతులను దుర్భాషలాడుతున్నారు, అవమానిస్తున్నారు? మాల్లోకి ప్రవేశం నిషేధించబడింది! కర్నాటక సీఎం ధోతీ ధరిస్తారు! ధోతీ మాకు గర్వకారణం.. మాల్లో రైతు టక్సీడో ధరించాలా?’’ అంటూ ట్వీట్ చేశారు. డీజిల్ ధరలను పెంచి రైతులకు ద్రోహం చేశారు. ఇప్పుడు ధోతీ ధరించిన రైతుని అవమానించారు. రాహుల్ బాబా ఎక్కడ..? అని ప్రశ్నించారు. ఇదేనా కిసాన్ కే సాథ్ న్యాయ్..? అంటూ అడిగారు.
తాజావార్తలు
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
-
Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్లో ఏముంది?
-
RCB Success Story: ఆర్సీబీ విజయాల వెనుక ‘పంచ పాండవులు’.. మూడో ఐపీఎల్ టైటిల్ కూడా!
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!