Bengaluru: చదువుకోమని తల్లి మందలింపు.. 20వ అంతస్తు నుంచి దూకి టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
- బెంగళూరులో ఘోర విషాదం
- చదువుకోమని తల్లి మందలింపు
- 20వ అంతస్తు నుంచి దూకి టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదో తరగతి అంటేనే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎంతో కష్టపడితేనే గానీ.. చదువు ముందుకెళ్లదు. అందుకే తల్లిదండ్రులు చాలా శ్రద్ధ పెట్టి చదివిస్తుంటారు. అదే తల్లిదండ్రుల పాలిట శాపమైంది. ఫోన్ చూడకుండా చదువుకోమని తల్లి చెప్పడమే పాపమైంది. ముందు వెనుక ఆలోచించకుండా 20వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. నవమాసాలు మోసి కని..పెంచిన తల్లికి గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన బెంగళూరులోని కడుగోడి శివారు ప్రాంతంలోని అసెట్జ్ మార్క్ అపార్ట్మెంట్లో బుధవారం మధ్యాహ్నం జరిగింది.
ఇది కూడా చదవండి: KTR: పేద రైతుకు ఒక న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా?
Also Read
- PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
- CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
అవంతిక చౌరాసియా అనే 15 ఏళ్ల బాలిక.. బెంగళూరులోని ప్రముఖ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మార్చి 15 నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. దీంతో పాఠశాల యాజమాన్యం.. విద్యార్థులకు స్టడీ లీవ్ ఇచ్చింది. దీంతో విద్యార్థులంతా పుస్తకాలను దగ్గర పెట్టుకుని కుస్తీ పడుతున్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం అవంతిక చదువుకోకుండా ఫోన్లో నిమగ్నమైంది. దీన్ని గమనించిన తల్లి.. ఫోన్ పక్కన పెట్టి చదువుకోమని మందలించింది. అంతే కోపోద్రేకురాలైన అవంతిక..గది కిటికీ తలుపులు తీసి 20వ అంతస్తు నుంచి కిందకి దూకింది. గమనించిన తల్లి..వేగంగా కిందకి వెళ్లి చూడగా.. తలకు బలమైన గాయాలు తగలడంతో సంఘటనాస్థలిలోనే అవంతిక ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేసినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. తల్లి మందలింపుతో అవంతిక మనస్తాపం చెంది తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కడుగోడి పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైట్ఫీల్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శివకుమార్ గుణారే మాట్లాడుతూ.. అవంతిక మరణాన్ని ధృవీకరించారు. బాధిత కుటుంబం మధ్యప్రదేశ్కు చెందినదిగా తెలిపారు. అవంతిక తండ్రి లక్ష్మీకాంత్ చౌరాసియా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా.. తల్లి గృహిణిగా ఉంది. కుమార్తె మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: YSRCP: వల్లభనేని వంశీ అరెస్ట్పై స్పందించిన వైసీపీ.. ఇది అక్రమం
తాజావార్తలు
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!