Congress: బెంగాల్లో కాంగ్రెస్ ఖాళీ.. ఉన్న ఒక్కడు కూడా టీఎంసీలోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కర్ణాటక రాష్ట్రంలో బీజేపీని దారుణంగా ఓడించామని సంబర పడుతున్న కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం ఎదురుదెబ్బ తాకింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే గెలుపొందాడు. ఇప్పుడు ఆ ఒక్కడు కూడా అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పార్టీలో చేరాడు. దీంతో బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. ఎమ్మెల్యే బేరాన్ బిస్వాస్ సోమవారం టీఎంసీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేారారు.
Read Also: Loan App Harassment: అకౌంట్లో డబ్బులు వేయకుండానే.. మహిళకు వేధింపులు
Also Read
- PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
ఈ చేరిక సందర్భంగా అభిషేక్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని టీఎంసీని వ్యతిరేకించాలా..? లేకపోతే కేంద్రంలోని బీజేపీని వ్యతిరేకించాలా..? అనేదాన్ని కాంగ్రెస్ నిర్ణయించుకోవాలి అని అన్నారు. మైనారిటీలు అధికంగా ఉండే పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని సాగర్ ఢీఘీ నుంచి ఈ ఏడాది మొదట్లో జరిగిన ఉపఎన్నికల్లో గెలిచారు. సమీప టీఎంసీ ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. గెలిచిన మూడు నెలల తర్వాత ఆయన కాంగ్రెస్ ను వదిలి టీఎంసీలో చేరారు. ‘‘బీజేపీ విభజన మరియు వివక్షాపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలనే మీ సంకల్పాన్ని బలోపేతం చేయడానికి. , మీరు సరైన ప్లాట్ఫారమ్ను ఎంచుకున్నారు. కలిసికట్టుగా గెలుస్తాం’’ అని టీఎంసీ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పేర్కొంది. ప్రముఖ బీడీ వ్యాపారి అయిన బిశ్వాస్ గెలుపుతో కాంగ్రెస్ పాత్ర ఏం లేదని టీఎంసీ అంది.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. అయితే సాగర్ డిఘి స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరుపున బిశ్వాస్ గెలవడం ఆ పార్టీకి ఊపిరి పోసింది. అయితే ఇది ఎన్నోరోజులు నిలవలేదు. బిశ్వాస్ చేరికతో టీఎంసీని వ్యతిరేకించే బీజేపీ, కాంగ్రెస్ కూటమి ఓడిపోయిందని అభిషేక్ బెనర్జీ అన్నారు. బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య అనైతిక పొత్తు ఉందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక… త్వరలోనే గుడ్ న్యూస్
-
PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
-
Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
-
CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
-
Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!