Bangladeshi Hindus: భారత్లోకి వచ్చేందుకు బంగ్లాదేశ్ హిందువుల ప్రయత్నం.. నీటిలో నిలబడి నిరసన..!
- బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కొనసాగుతున్న హింస..
- భారత్లోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్న బంగ్లాదేశ్ హిందూ కుటుంబాలు..
- తమను భారత్ లోకి అనుమతించాలని నీటిలో నిలబడి బంగ్లాదేశ్ హిందువుల ఆందోళన..
Bangladeshi Hindus: బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అక్కడ హింస కొనసాగుతోంది. ఆందోళనకారులు మైనారిటీ వర్గాలైన హిందువులను టార్గెట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ (భారత సరిహద్దులో ఉన్న బంగ్లాదేశ్ ప్రజలు) నుంచి చాలా హిందూ కుటుంబాలు తమ ఇళ్లను వదిలి భారతదేశానికి రావాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. భారత్ -బంగ్లా సరిహద్దులోకి వేలాది మంది ప్రజలు చేరుకున్నారు. సరిహద్దు భద్రత విషయంలో బీఎస్ఎఫ్ కూడా అప్రమత్తమైంది. దాదాపు 1000 మంది బంగ్లాదేశీయులు బెంగాల్లోని సితాల్కుచి, కూచ్ బెహార్లోని రిజర్వాయర్లో నిలబడి.. తమను భారతదేశంలోకి అనుమతించమని బీఎస్ఎఫ్ సిబ్బందిని అభ్యర్థిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వారిలో ఇదే అతి పెద్ద గ్రూపు అని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.
Read Also: Kishan Reddy: జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
కాగా, కూచ్ బెహార్లోని కాషియార్ బరుని ప్రాంతంలోని పతంతులి గ్రామం దగ్గర సరిహద్దు దాటడానికి ప్రయత్నించిన ప్రజలు కంచె దాటి రిజర్వాయర్లో గంటల తరబడి నిరీక్షించారు. అందులో కొందరు ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు కూడా చేశారు. సరిహద్దులోని జీరో పాయింట్ నుంచి 150 గజాల దూరంలో ఉన్న కంచెను దాటకుండా బీఎస్ఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. బంగ్లాదేశ్లోని రంగ్పూర్ జిల్లాలోని దోయ్ ఖావా, గెందుగురి గ్రామాలలోని ప్రజలను తిరిగి తమ ఇళ్లకు వెళ్లమని బీఎస్ఎఫ్ సైనికులు విజ్ఞప్తులు చేసినప్పటికీ.. వారు మాత్రం అక్కడే నిలబడి ఆందోళన చేస్తున్నారు.
Read Also: Israel–Hamas war: గాజాలో నిరాశ్రయులు బస చేస్తున్న స్కూల్పై ఇజ్రాయెల్ దాడి.. 100 మందికి పైగా మృతి
అయితే, గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్కు చెందిన ప్రజలు బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల్లోని పెట్రాపోల్కు చేరుకుంటున్నారు. సరిహద్దుపై నిఘా ఉంచేందుకు భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సరిహద్దు భద్రతా దళం తూర్పు కమాండ్ ఏడీజీని కమిటీకి చైర్మన్గా ఎంపిక చేసింది. బంగ్లాదేశ్లో హింసాత్మక సంఘటనలు భారత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేశాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!