Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Bangladesh Will Not Face Any Problems Due To Cancellation Of Trans Shipment Facilities By India

Bangladesh: భారత్ నిర్ణయం వల్ల మాపై ఎలాంటి ప్రభావం ఉండదు.. బంగ్లా మేకపోతు గాంభీర్యం..

Published Date :April 10, 2025 , 7:39 pm
By Venu Goapl Reddy
  • భారత్ నిర్ణయంతో మాపై ప్రభావం ఉండదు: బంగ్లాదేశ్..
  • ట్రాన్స్ షిప్‌మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసిన భారత్..
  • బంగ్లాదేశ్ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం..
Bangladesh: భారత్ నిర్ణయం వల్ల మాపై ఎలాంటి ప్రభావం ఉండదు.. బంగ్లా మేకపోతు గాంభీర్యం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bangladesh: బంగ్లాదేశ్ దూకుడుకు భారత్ కళ్లెం వేస్తోంది. ఇటీవల చైనా పర్యటనలో ఆ దేశ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ మాట్లాడుతూ.. భారత్ దేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్‌గా ఉన్నాయని, బంగ్లాదేశ్ బంగాళాఖాతానికి సంరక్షకుడిని, చైనా తమ దేశం ద్వారా ఆ ప్రాంతానికి విస్తరించవచ్చని వ్యాఖ్యానించాడు. అయితే, ఈ వ్యాఖ్యల్ని భారత్ సీరియస్‌గా తీసుకుంటోంది. చైనా పెట్టుబడుల్ని ఆకర్షించే పనిలో, పరోక్షంగా భారత్‌ని దెబ్బతీసే ప్రయత్నంలో బంగ్లాదేశ్ ఉందని భారత అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్‌కి ఇచ్చిన ‘‘ట్రాన్స్ షిప్‌మెంట్’’ సౌకర్యాన్ని రద్దు చేసింది. అయితే, భారత్ నిర్ణయం వల్ల తమపై ఎలాంటి ప్రభావం ఉండదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ వాణిజ్య సలహాదారు షేక్ బషీర్ ఉద్దీన్ గురువారం అన్నారు. పశ్చిమాసియా, యూరప్ మరియు నేపాల్ మరియు భూటాన్ మినహా వివిధ ఇతర దేశాలకు వివిధ వస్తువులను ఎగుమతి చేయడానికి బంగ్లాదేశ్‌కు మంజూరు చేసిన ట్రాన్స్-షిప్‌మెంట్ సౌకర్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు భారతదేశం బుధవారం ప్రకటించిన తర్వాత ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘‘నిన్న వివిధ రంగాలకు చెందిన వ్యాపార ప్రతినిధులతో, కొనుగోలుదారులతో చర్చలు జరిగాయి. మా ఏర్పాట్ల ద్వారా సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు.

Also Read

  • FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్‌గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
  • PM Modi: మే 4 తర్వాత బెంగాల్‌లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
  • Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
  • AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..

Read Also: MS Dhoni: ఇట్స్ అఫీషియల్.. చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు చేపట్టిన ఎంఎస్ ధోని

భారత్ నిర్ణయంపై మీడియా ప్రశ్నించడంతో బషీర్ మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయని, పెరిగిన ఖర్చులకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయని అన్నారు. రద్దుకు సంబంధించి బంగ్లాదేశ్‌ భారత్‌కి అధికారికంగా లేఖ పంపే విషయం పరిశీలనతో లేదని అతను చెప్పాడు.

భారత్‌, బంగ్లాదేశ్‌కి మధ్య దాదాపుగా 1600 కి.మీ సరిహద్దు ఉంది. బంగ్లాదేశ్‌కి మూడు వైపులు భారత్, ఒక వైపు బంగాళాఖాతం ఉంది. బంగ్లాదేశ్ తన ఉత్పత్తుల్ని అమ్ముకోవాడానికి ఇన్నా్ళ్లు ఈ ట్రాన్స్ షిప్‌మెంట్ సౌకర్యం ద్వారా భారతదేశ రోడ్డు రవాణాతో పాటు పోర్టుల్ని వాడుకుండి. తన ఉత్పత్తుల్ని భారత్ ద్వారా భూటాన్, నేపాల్ వంటి దేశాలకు తరలించింది. అయితే, ఇప్పుడు భారత్ దీనిని రద్దు చేయడంతో బంగ్లాదేశ్‌ని దెబ్బకొట్టినట్లు అయింది. బంగ్లాదేశ్ తన ఉత్పత్తులను అమ్ముకోవాలంటే మయన్మార్ లేదా తన చిట్టగాంగ్, మోంగ్లా పోర్టులను ఉపయోగించాలి. అయితే, ఈ పోర్టు్లో సరైన మౌలిక సదుపాయాలు లేవు. ఇన్నాళ్లు కోల్‌కతా, పారాదీప్ పోర్టుల ద్వారా తన ఉత్పత్తుల్ని యూరప్, మిడిల్ ఈస్ట్ వంటి ప్రాంతాలకు బంగ్లాదేశ్ పంపేది. భారత్ నిర్ణయంతో బంగ్లాదేశ్ మరింత కుదేలు అవ్వడం ఖాయం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bangladesh
  • Bangladesh violence
  • india-bangladesh
  • trans-shipment facilities
  • Yunus

తాజావార్తలు

  • FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్‌గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..

  • Sanju Samson: గుజరాత్ టైటాన్స్‌పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..

  • Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్‌గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!

  • Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..

  • Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions