Bangladesh: పాకిస్తాన్ కోసం బంగ్లాదేశ్ కీలక నిర్ణయం.. భారత్కి సెక్యూరిటీ సమస్య..
- పాకిస్తాన్ కోసం బంగ్లాదేశ్ కీలక నిర్ణయం..
- వీసా రూల్స్ సవరించిన బంగ్లా..
- భారత్కి భద్రతాపరమైన సమస్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ రోజురోజుకు భారత్తో వైరం పెట్టుకోవాలని తహతహలాడుతోంది. అందుకు ఆ దేశం తీసుకుంటున్న నిర్ణయాలే కారణం. ఇప్పటికే బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై అకృత్యాలు కొనసాగిస్తూ, భారత్ని కవ్వించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ తన సరిహద్దుల్లో బైరెక్టర్ డ్రోన్లను మోహరించింది. బంగ్లాదేశ్ సరిహద్దును దాటి ఆ దేశ బోర్డర్ గార్డ్స్ అస్సాంలోకి చొరబడ్డారు. సరిహద్దుల్లో నిర్మితమవుతున్న ఆలయ నిర్మాణాన్ని ఆపేయాలంటూ, లేకుంటే కాల్పులు జరుపుతామంటూ హెచ్చరించారు. ఈ చర్యతో అంతర్జాతీయ చట్టాలను బంగ్లాదేశ్ సరిహద్దు దళం ఉల్లంఘించింది.
Read Also: Pushpa 2: రెండో రోజుకే 500 కోట్ల క్లబ్బులో పుష్ప.. అస్సలు తగ్గేదేలే!
Also Read
- Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
- China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
- Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!
- Congress MLA Rs 300 Crore Demand: రూ.300 కోట్లు ఇస్తేనే పార్టీలో ఉంటా.. మహిళా ఎమ్మెల్యే డిమాండ్తో కాంగ్రెస్లో కలకలం..
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే బంగ్లాలో తమ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ని కాదని మహ్మద్ అలీ జిన్నాను పొగుడుతున్నారు. తాజాగా రెండు దేశాల మధ్య బంధం మరింతగా పెరిగేందుకు బంగ్లాదేశ్, పాకిస్తాన్ పౌరులకు వీసా నిబంధనల్ని సడలించింది. పాకిస్తాన్ పౌరులుకు భద్రతా క్లియరెన్స్ పొందాల్సిన అవసరాన్ని తొలగించింది. 2019లో ఈ క్లియరెన్స్ని ప్రవేశపెట్టారు. డిసెంబర్ 2న బంగ్లా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ సర్వీసెస్ డివిజన్(ఎస్ఎస్డీ) కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి, పరిమితుల్ని తొలగించింది. ఈ పరిణామం రానున్న కాలంలో భారత్కి భద్రతా పరమైన సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ హైకమీషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ డిసెంబర్ 3న ఢాకాలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నాయకురాలు ఖలీదా జియాతో సమావేశానికి ఒక రోజు ముందు ఈ నిర్ణయం వెలువడింది. గత నెలలో తొలిసారిగా కరాచీ నుంచి బంగ్లాదేశ్ చిట్టగాంగ్కి పాకిస్తాన్ నుంచి కార్గో నౌక వచ్చింది. ఇప్పుడు పాకిస్తానీలకు వీసా నిబంధనల్లో సడలింపుల్ని ఇచ్చింది. ఖలీదా జియా, మాజీ ప్రధాని షేక్ హసీనాలా కాకుండా పాకిస్తాన్తో సంబంధాలను కలిగి ఉండి. షేక్ హసీనా సమయంలో భారత్కి మంచి మిత్రురాలిగా ఉండేది. ఇప్పుడు బంగ్లాదేశ్ మొత్తం జమాతే ఇస్లామీ, బీఎన్పీలే పాలన సాగిస్తున్నారు. ఈ రెండు కూడా పాకిస్తాన్ అనుకూల పార్టీలుగా పేరు పొందాయి.
తాజావార్తలు
-
Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
-
China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
-
Peddi: ‘పెద్ది’ రన్ టైంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
-
Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
-
AP Weather Update: భిన్న వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆ జిల్లాల్లో వడగాలులు..