Harish Rao: దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో విపక్షాలు తట్టుకోవడం లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: బంజరు భూముల పంపిణీ, వీఆర్ఏల క్రమబద్ధీకరణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో విపక్షాలు తట్టుకోవడం లేదని అన్నారు. కీలక నిర్ణయాల వల్ల ప్రతిపక్ష పార్టీలకు ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ప్రతిపక్షాల గొంతు మూగబోయిందని, వారి గొంతు లేకుండా చేశారని విమర్శించారు. బయటే కాకుండా అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలను సమర్థంగా ఎదుర్కొంటామన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనసభను 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. అయితే సమావేశాలు ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించారనేది ముఖ్యం కాదని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఎన్ని పని గంటలు నిర్వహించడమనేది ముఖ్యమని గుర్తించాలని మంత్రి హరీష్ రావు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తెచ్చారు.
Read also: Gyanvapi Mosque: జ్ఞాన్వాపి మసీదు కేసులో కీలక మలుపు.. అందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Also Read
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలకు డబుల్ బెడ్ రూమ్ సమస్య తప్ప మరో అంశం లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యాక గ్రాఫ్ పెరిగిందని అంటున్నారు. మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొందరు విమర్శించారు. త్వరలో మీడియా సంస్థను ప్రారంభించి తెలంగాణ యాసలో ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తానని వెల్లడించారు. ఏది జరిగినా అంతా మన మంచికే అని అన్నారు. మాడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు వస్తారో తానే నిర్ణయిస్తానని మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో మంత్రి మల్లారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మల్లారెడ్డి కేఎల్ఆర్కు టిక్కెట్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తనకు స్నేహితులు ఉన్నారని చెప్పారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో గొడవలకు కారణం వారేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
Shweta Tiwari Saree Pics: హాట్ ఫోజులతో.. శారీలో సెగలు పుట్టిస్తున్న శ్వేతా తివారీ!
తాజావార్తలు
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
-
Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ట్రెండింగ్
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!