Jammu And Kashmir: జమ్మూలో బక్రీద్ జోష్.. రంగుల కాంతులతో ముస్తాబైన కాశ్మీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu And Kashmir: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈద్-ఉల్-అధా(బక్రీద్) పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అరబిక్ భాషలో ఈద్-అల్-అధా లేదా ఈద్ ఉల్ జుహా ముస్లింలలో త్యాగానికి గుర్తింపుగా జరుపుకునే పండుగ. ఇబ్రహీం ప్రవక్త అల్లాహ్ పై ఉన్న బలమైన విశ్వాసంతో చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు జరుపుకునే పండుగ ఈద్ ఉల్ అధా
బక్రీద్ గా పిలిచే ఈద్ అల్ అధా వేడుకలను పురస్కరించుకుని జమ్మూకాశ్మీర్ లోని మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్స్ లు కిటకిటలాడాయి. రంగురంగుల లైట్లతో సుందర కాంతులతో అక్కడి వీధులు వెలిగిపోతున్నాయి. ఇబ్రహీం ప్రవక్త త్యాగం, అంకితభావానికి గుర్తుగా ఈద్-ఉల్-అధా జరుపుకుంటారు. ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం.. ఈ పండుగను సాధారణంగా జిల్-హజ్ 10 వ రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది ఈద్-ఉల్-అధాను జూన్ 29 గురువారం జరుపుకుంటున్నారు.
Read also: Best Mileage Bike 2023: స్టైల్లోనే కాదు మైలేజ్లోనూ కింగే.. ఈ బైక్ ధర కేవలం 54 వేలు మాత్రమే!
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
శ్రీనగర్లో నిరంతర వేడి వేవ్ పండుగ స్ఫూర్తిని తగ్గించింది, కానీ ఇప్పుడు పడుతున్న చిరుజల్లులు ఉష్ణోగ్రతలను తగ్గించాయి. దుకాణదారులను, వినియోగదారులను బయటకు తీసుకువచ్చాయి. పండగ వాతావరణాన్ని మరింత సుందరంగా మార్చేందుకు పెద్ద మార్కెట్లు, వ్యాపార సంస్థలు అలంకరించబడ్డాయి. నగర వ్యాప్తంగా తాత్కాలిక బేకరీ షాపులు వెలిశాయి. దుస్తులు, యాక్సెసరీల నుండి బూట్లు, బహుమతి వస్తువుల వరకు- లాల్ చౌక్, గోనిఖన్, జహంగీర్ చౌక్, డౌన్ టౌన్ శ్రీనగర్ లోని జామియా మసీదు ప్రాంతం, పోలో-వ్యూ, సరాయ్ బాలా, మహారాజ్ బజార్, కోకర్ బజార్ మొదలైన వాటి వద్ద వినియోగదారుల భారీ రద్దీ ఉంది. దుకాణదారుల రద్దీ నగరంలో తరచూ ట్రాఫిక్ జామ్ కు దారితీస్తుంది. రెడీమేడ్ గార్మెంట్ షోరూమ్లు, పాదరక్షల దుకాణాలు, గిఫ్ట్ ఐటమ్స్ దుకాణాలు జోరుగా వ్యాపారం చేస్తుండగా, వివిధ నగర మార్కెట్లలో రంగురంగుల ఈద్ స్టాల్స్ కిటకిటలాడుతున్నాయి.
colorful lights: Andhra Pradesh: అమ్మపై అధికారులకు బాలిక ఫిర్యాదు.. చదువంటే ప్రాణం మరి..!
పండుగ నేపథ్యంలో ఈ కొద్ది రోజులుగా మార్కెట్లు చాలా రద్దీగా ఉంటాయనీ, ప్రజలు ఈద్ కోసం కొనుగోళ్లు చేస్తున్నారని కూడా తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వినియోగదారులు నగరానికి తరలివస్తున్నారు. ఇదిలా ఉంటే షాపింగ్ విషయంలో పిల్లల జోరు కనిపిస్తోంది. ఈద్ ఆనందాన్ని పెంచడానికి పిల్లలు టపాసులు, బొమ్మలు కొనడానికి ఇష్టపడుతుండగా, తల్లిదండ్రులు వంటగదికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడంలో బిజీగా ఉన్నారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పవిత్ర హజ్రత్ బల్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, ఈద్ రోజున ప్రజలు నమాజ్ చేసుకునేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!