Andhra Pradesh: అమ్మపై అధికారులకు బాలిక ఫిర్యాదు.. చదువంటే ప్రాణం మరి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: సమాజంలో అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు.. కొందరు చదుకొంటే.. కొందరు చదువుకునేందుకు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి.. ఇక, చదువుకుంటే ఏమి వస్తుంది.. కూలి ఏస్తే కొన్ని డబ్బులైనా వస్తాయంటూ.. పిల్లలను తమ వెంట పనికితీసుకెళ్లే తల్లిదండ్రులు కూడా ఉన్నారు.. మరికొందరు తాము పడిన కష్టం పిల్లలు పడకూడదంటూ.. అప్పులు చేయి అయినా.. పిల్లలను చదివించుకునేవారు ఉన్నారు.. అయితే, కర్నూలు జిల్లాలో తన తల్లిపై అధికారులకు ఫిర్యాదు చేసింది ఓ బాలిక.. ఈ ఏడాది టెన్త్ పాసైన నిర్మలమ్మ అనే బాలిక.. టెన్త్లో ఏకంగా 534 మార్కులు సాధించింది.. తనకు పై చదువులు చదవాలనే కోరిక ఉన్నా.. ఆమెను చదివించలేని పరిస్థితి ఆ కుటుంబానిది.. ఆ బాలిక ఎన్నిసార్లు తన తల్లికి మొరపెట్టుకున్నా.. తన కల తీరాలా కనిపించలేదు ఆ బాలికకు.. దీంతో.. అధికారులకు ఫిర్యాదు చేసింది..
Read Also: Dal: కందిపప్పు ధరలను అదుపు చేసేందుకు.. చర్యలు మొదలెట్టిన ప్రభుత్వం
Also Read
ఆదోని మండలం పెద్దహరివానంలో తాజాగా అధికారిక కార్యక్రమానికి వచ్చారు తహశీల్ధారు, ఎంపీడీవో, ఎస్ఐ.. అయితే, తన తల్లిపై వారికి ఫిర్యాదు చేసింది నిర్మలమ్మ.. టెన్త్ లో తనకు 534 మార్కులు వచ్చాయని.. పై చదువులు చదుకోవాలని ఉంది.. కానీ, మా అమ్మ నన్ను చదివించడంలేదు.. ఎలాగైనా నా తల్లిని ఒప్పించండి అంటూ అధికారులను వేడుకుంది.. అయితే, పేదరికంతో ఉన్న ఆ తల్లి.. తన వెంట కూతురిని కూలికి తీసుకెళ్తోంది.. ఇద్దరం పనిచేస్తేనే.. నాలుగువేళ్లు నోట్లోకి వెళ్తాయనేది ఆ తల్లి ఆవేదన.. కానీ, చదువుపై ఉన్న ప్రేమతో.. తనను కనిపెంచిన తల్లిపైనే అధికారులకు ఫిర్యాదు చేసింది నిర్మలమ్మ.. దీంతో, ఆ తల్లికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అధికారులు.. ప్రభుత్వ పథకాల ద్వారా నిర్మలమ్మను చదివించే బాధ్యత తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. మరి నిర్మలమ్మ కష్టాలు తీరి.. మళ్లీ బ్యాగ్ భుజానికి వేస్తుందో..? ఉన్నత చదువులు చదువుతుందేమో చూడాలి..
తాజావార్తలు
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!