Delhi CM Rekha Gupta: ‘శీష్ మహల్’ వద్దన్న ఢిల్లీ కొత్త సీఎం.. అధికార నివాసం ఎక్కడంటే?
- ఢిల్లీ కొత్త సీఎం.. అధికార నివాసం
- లుటియెన్స్, సివిల్ లైన్స్ ప్రాంతంలో కొత్త బంగ్లా
- రెండ్రోజుల్లో అధికారిక నివాసాన్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. షాలిమార్బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. కాగా సీఎం రేఖా గుప్త అధికార నివాసం ఎక్కడ అన్నదానిపై చర్చమొదలైంది. సివిల్ లైన్స్లో 6 ఫ్లాగ్స్టాఫ్ రోడ్ బంగ్లా ‘శీష్ మహల్’ను ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. అయితే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శీష్ మహల్ లో ఉండబోనని ఆమె ఇప్పటికే స్పష్టం చేసింది. శీష్ మహల్ ను మ్యూజియంగా మారుస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అధికార నివాసం కోసం వెతకడం ప్రారంభించారు. లుటియెన్స్, సివిల్ లైన్స్ ప్రాంతంలో కొత్త బంగ్లా కోసం వెతుకుతున్నారు.
Also Read:Hitchcock: చిరంజీవి చేతుల మీదుగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్’ సెకండ్ ఎడిషన్ లాంచ్..
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
సీఎం రేఖా గుప్త అధికారిక నివాసం కోసం సీఎం సిబ్బంది మూడు ప్రాంతాలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్, ఢిల్లీ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే ఒకటి, రెండ్రోజుల్లో అధికారిక నివాసాన్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ సీఎంవో అధికారులకు ఇచ్చిన లిస్ట్ లో కొన్ని బంగ్లాలు సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉండగా.. మరికొన్ని ఢిల్లీలోని లుటియెన్స్ లో ఉన్నాయి. వీటిల్లో ఢిల్లీ సీఎం ఏ బంగ్లాలో నివసించాలో నిర్ణయించుకోనున్నారు.
Also Read:Bangalore: స్నేహం ముసుగులో.. మహిళపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్టు
ఢిల్లీలోని లుటియెన్స్ ప్రాంతంలో రాష్ట్రపతి భవన్, కేంద్ర మంత్రుల నివాసాలు, సచివాలయంతో సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం దేశ పరిపాలనా అధికార కేంద్రంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో, సివిల్ లైన్స్ అనేది ఇప్పటివరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉన్న ప్రాంతం. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)తో సహా గత ఆప్ ప్రభుత్వంలోని మంత్రులందరికీ ఈ ప్రాంతంలో బంగ్లాలు కేటాయించబడ్డాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!