Delhi CM Rekha Gupta: ‘శీష్ మహల్’ వద్దన్న ఢిల్లీ కొత్త సీఎం.. అధికార నివాసం ఎక్కడంటే?
- ఢిల్లీ కొత్త సీఎం.. అధికార నివాసం
- లుటియెన్స్, సివిల్ లైన్స్ ప్రాంతంలో కొత్త బంగ్లా
- రెండ్రోజుల్లో అధికారిక నివాసాన్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. షాలిమార్బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. కాగా సీఎం రేఖా గుప్త అధికార నివాసం ఎక్కడ అన్నదానిపై చర్చమొదలైంది. సివిల్ లైన్స్లో 6 ఫ్లాగ్స్టాఫ్ రోడ్ బంగ్లా ‘శీష్ మహల్’ను ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. అయితే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శీష్ మహల్ లో ఉండబోనని ఆమె ఇప్పటికే స్పష్టం చేసింది. శీష్ మహల్ ను మ్యూజియంగా మారుస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అధికార నివాసం కోసం వెతకడం ప్రారంభించారు. లుటియెన్స్, సివిల్ లైన్స్ ప్రాంతంలో కొత్త బంగ్లా కోసం వెతుకుతున్నారు.
Also Read:Hitchcock: చిరంజీవి చేతుల మీదుగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్’ సెకండ్ ఎడిషన్ లాంచ్..
Also Read
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
సీఎం రేఖా గుప్త అధికారిక నివాసం కోసం సీఎం సిబ్బంది మూడు ప్రాంతాలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్, ఢిల్లీ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే ఒకటి, రెండ్రోజుల్లో అధికారిక నివాసాన్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ సీఎంవో అధికారులకు ఇచ్చిన లిస్ట్ లో కొన్ని బంగ్లాలు సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉండగా.. మరికొన్ని ఢిల్లీలోని లుటియెన్స్ లో ఉన్నాయి. వీటిల్లో ఢిల్లీ సీఎం ఏ బంగ్లాలో నివసించాలో నిర్ణయించుకోనున్నారు.
Also Read:Bangalore: స్నేహం ముసుగులో.. మహిళపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్టు
ఢిల్లీలోని లుటియెన్స్ ప్రాంతంలో రాష్ట్రపతి భవన్, కేంద్ర మంత్రుల నివాసాలు, సచివాలయంతో సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం దేశ పరిపాలనా అధికార కేంద్రంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో, సివిల్ లైన్స్ అనేది ఇప్పటివరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉన్న ప్రాంతం. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)తో సహా గత ఆప్ ప్రభుత్వంలోని మంత్రులందరికీ ఈ ప్రాంతంలో బంగ్లాలు కేటాయించబడ్డాయి.
తాజావార్తలు
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
-
SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!